Seethakka In Assembly: గురుకులాల్లో కలుషిత ఆహార ఘటనలపై స్పందించిన మంత్రి సీతక్క
- గురుకులాల్లో కలుషిత ఆహార ఘటనలపై
- తెలంగాణ శాసన మండలిలో స్పందించిన మంత్రి సీతక్క.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Seethakka In Assembly: తెలంగాణ శాసన మండలిలో గురుకుల పాఠశాలల్లో కలుషిత ఆహార సమస్యలపై జరిగిన చర్చలో మంత్రి సీతక్క తీవ్రంగా స్పందించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుందని, హాస్టల్ సిబ్బందితో పాటు సరఫరాదారులపై కూడా నిఘాను పెంచుతామని ఆమె తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో 70 సంఘటనలు నమోదయ్యాయని, అందులో 5024 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని మంత్రి సీతక్క గుర్తుచేశారు. వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ పరిస్థితి విషమించినప్పుడే ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని నిమ్స్లో శైలజను మంత్రులు, సీఎంవో సిబ్బంది నిరంతరం పర్యవేక్షించారని మంత్రి వివరించారు. గత పాలనలో విద్యార్థులు చనిపోతే కనీసం పట్టించుకోలేదని, నిరుద్యోగులు మరణించినప్పుడు వారి కుటుంబాలను కూడా పరామర్శించలేదని సీతక్క ఆరోపించారు. గడిచిన ఏడు సంవత్సరాల తర్వాత డైట్ చార్జీలను పెంచినట్టు, 16 ఏళ్ల తర్వాత కాస్మొటిక్ చార్జీలను పెంచి గురుకులాల్లో విద్యార్థుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ఆమె పేర్కొన్నారు.
Also Read: Secretariat Employees Association Elections: సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
Also Read
- US-India-Russia: చమురు విషయంలో రష్యా హామీ.. అమెరికా ముందు భారత్ కీలక డిమాండ్..
- Monsoon Alert: భారతీయులకు శుభవార్త.. 5 రోజుల ముందే అండమాన్ను తాకనున్న తొలకరి జల్లు
- AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. వారానికి ఒకరోజు ‘నో వెహికల్ డే’!
- Uttar Pradesh: టీ-షర్ట్, ప్యాంట్ వేసుకోవడంపై గొడవ.. భార్యను చంపిన భర్త ఆత్మహత్య..
మంత్రి సీతక్క మాట్లాడుతూ.. టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ధ్వజమెత్తారు. మాకు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటమే తెలుసు, టీఆర్ఎస్ వాళ్ల లాగా యాక్టింగ్ రాదని ఆమె వ్యాఖ్యానించారు. టిఆర్ఎస్ నుంచి హుందాతనం నేర్చుకోవాల్సిన అవసరం లేదని, వారు మాట్లాడితే అహంకారమే కనిపిస్తోందని ఆమె విమర్శించారు. గురుకులాల కార్యదర్శిగా పనిచేసిన ఒక అధికారి పదవికి రాజీనామా చేశాక టీఆర్ఎస్ పాలనపై అనేక ట్వీట్లు చేశారని, అవి బయటకు తీసుకురావాలని నిర్ణయించినట్టు సీతక్క తెలిపారు. ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను నిర్లక్ష్యం చేయదని, అన్ని చర్యలను తీసుకోవడంలో ముందు ఉంటుందని సీతక్క స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Adani Group: అదానీ వేల కోట్ల సామ్రాజ్యంలోకి మరొక కంపెనీ.. ఇకపై జీవీకే ఎనర్జీ అదానీ సొంతం!
-
US-India-Russia: చమురు విషయంలో రష్యా హామీ.. అమెరికా ముందు భారత్ కీలక డిమాండ్..
-
Monsoon Alert: భారతీయులకు శుభవార్త.. 5 రోజుల ముందే అండమాన్ను తాకనున్న తొలకరి జల్లు
-
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. వారానికి ఒకరోజు ‘నో వెహికల్ డే’!
-
Akash Ambani: జియో సామ్రాజ్యానికి కొత్త బాస్.. అంబానీ వారసుడి చేతికి జియో ప్లాట్ఫామ్స్ పగ్గాలు!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?