Rahul Gandhi: తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల్లో కర్ణాటక ఫలితాలే.. బీజేపీని తుడిచిపెట్టేస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటిస్తు్న్నారు. ఆయన శాన్ ఫ్రానిస్కో, న్యూయార్క్, వాషింగ్టన్ నగరాల్లో పర్యటిస్తు్న్నారు. ఆదివారం న్యూయార్క్ నగరంలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్-యూఎస్ఏ నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే ఇతర రాష్ట్రాల్లో పునరావృతం అవుతాయని ఆయన అన్నారు. తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల్లో బీజేపీని తుడిచిపెడుతామంటూ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కాదని యావత్ దేశం విద్వేషపూరిత సిద్ధాంతాలను ఓడించేందుకు సిద్ధమైందని అన్నారు. బీజేపీని కర్ణాటకలో తుడిచిపెట్టగలమని నిరూపించామని, మేం బీజేపీ ఓడించలేదని, తుడిచిపెట్టామని అన్నారు.
Read Also: Etela Rajender: తెలంగాణ జాతి ఆకలినైనా భరిస్తుంది.. కానీ ఆత్మగౌరవం కోల్పోదు..
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
కర్ణాటకలో గెలిచేందుకు బీజేపీ అన్ని శక్తులను ఒడ్డి పోరాడిందని రాహుల్ గాంధీ అన్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ ఘన విజయం సాధించిందని వెల్లడించారు. తెలంగాణలో కూడా అదే జరుగుతుందని, రాబోయే ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీని గుర్తించడం కష్టమని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది తెలంగాణతో పాటు రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ లోనూ బీజేపీలో కనిపించకుండా పోతుందని అన్నారు. బీజేపీ విద్వేష రాజకీయాలతో ముందకెళ్లలేమని దేశ ప్రజలు గుర్తించడమే ఇందుకు కారణమని అన్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తామని అన్నారు. ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యమయ్యాని అన్నారు. బీజేపీ విద్వేషపూరిత సిద్ధాంత, కాంగ్రెస్ ప్రేమపూర్వక సిద్ధాంతం ప్రజల ముందున్నాయని వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!