Etela Rajender: తెలంగాణ జాతి ఆకలినైనా భరిస్తుంది.. కానీ ఆత్మగౌరవం కోల్పోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాదాద్రి జిల్లాలో ఉద్యమకారుడు జీట్ట బాలకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ్ బాలాయ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ అలయ్ బాలాయ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హుజూర్ నగర్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటల రాజేందర్ హాజరయ్యారు. బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ జాతి ఆకలినైనా భరిస్తుంది కానీ ఆత్మగౌరవం కోల్పోదు అంటూ వ్యాఖ్యనించాడు.
Also Read: OG: బ్రేకుల్లేని బుల్డోజర్ లా ఉన్నారు…
Also Read
తెలంగాణ ప్రజలకు కావాల్సింది ఇప్పుడు సూకల్డ్ అభివృద్ధి కాదు అని ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణ ప్రజల సొమ్ముతో రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నారు.. తెలంగాణలో రైతు వేదికలు ఎందుకు పనికిరాకుండా పోయాయి.. రాష్ట్రాల్లో పంటలు పండినా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అమ్ముకోలేని దుస్థితి నెలకొంది అని ఈటెల రాజేందర్ అన్నారు. రైతు ప్రభుత్వంగా చెప్పుకునే బీఆర్ఎస్ పార్టీ రైతులకు ఎం మేలు చేసిందో చెప్పాలి అని ఈటెల డిమాండ్ చేశారు.
Also Read: Kodandaram: తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చడం టీజేఎస్ తోనే సాధ్యం
పంచాయతీ కార్యదర్శిలకు, వీఓఏ, ఆర్టీసీ కార్మికులకు, రాష్ట్రప్రభుత్వం అన్యాయం చేస్తుంది అని ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణ గడ్డమీద కేసీఆర్ ను తరిమికొట్టే రోజు వస్తుంది.. రింగ్ రోడ్డుల నిర్మాణం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బ్రోకర్ అవతారం ఎత్తింది అని విమర్శించారు. ధర్మాన్ని న్యాయాన్ని ప్రజలను నమ్ముకున్న మాకు మంచి జరుగుతుంది.. ప్రజల అండదండలు మాకు ఉంటాయి అని ఈటెల రాజేందర్ అన్నారు.
Also Read: West Bengal: రైలు ప్రమాదంలో గాయపడిన వాళ్లను తరలిస్తున్న బస్సుకు ప్రమాదం..
అలయ్ బలాయ్ కార్యక్రమంలో మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నరసయ్య గౌడ్ కూడా పాల్గొన్నారు. బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ.. అప్పు, సిప్పు, డప్పుగా తెలంగాణ రాష్ట్ర పరిస్థితి మారింది అని కామెంట్స్ చేశారు. తెలంగాణలో ప్రతి ఓటరు చైతన్యం కావాల్సిన అవసరం ఉంది.. ఓటుకు పదివేలు, లక్ష ఇచ్చినా తీసుకోండి మనకు ఆ నేతలు బాకీ ఉన్నారు.. ఉద్యమం సమయంలో తెలంగాణ వస్తే రాష్ట్ర రూపు రేఖలు మారి, అభివృద్ధి సాధిస్తామని ఆశించాం.. కానీ ఇప్పుడు మరోక విధంగా రాష్ట్రం మారిందని ఆయన వ్యాఖ్యనించారు.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!