Rahul Gandhi: తెలంగాణలో గెలుస్తాం.. ఎంపీ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో బీజేపీ కనబడకుండా చేస్తాం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: పాట్నా వేదికగా బీహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలో జరుగుతున్న విపక్షాల సమావేశానికి కాంగ్రెస్ తరుపున రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరయ్యారు. పాట్నా చేరుకున్న వీరిద్దరు అక్కడి కాంగ్రెస్ శ్రేణుల్ని ఉద్దేశించి మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో విజయం సాధిస్తామని.. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ కనిపించకుండా చేస్తామని రాహుల్ గాంధీ అన్నారు. పేదల పక్షాన కాంగ్రెస్ నిలబడుతోందని.. ఇద్దరుముగ్గురు కోసమే బీజేపీ పనిచేస్తుందని విమర్శించారు.
Read Also: Rahul Gandhi: రాహుల్ గాంధీ రియల్ “దేవదాస్”.. బీజేపీ వ్యంగ్యాస్త్రాలు..
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
విద్వేషాన్ని, హింసను వ్యాప్తి చేసి దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ కృషి చేస్తోంది. మేము ప్రేమను పంచడానికి మరియు ఏకం చేయడానికి కృషి చేస్తున్నాము. ప్రతిపక్షాలు ఈరోజు ఇక్కడికి వచ్చాయి, కలిసి బీజేపీని ఓడిస్తాం అని ఆయన అన్నారు. భారతదేశంలో భావజాల యుద్ధం నడుస్తోందని.. ఒక వైపు కాంగ్రెస్ ‘భారత్ జోడో’ సిద్ధాంతం.. మరోవైపు ఆర్ఎస్ఎస్, బీజేపీల గురించి ‘భారత్ తోడో’ సిద్ధాంత ఉందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏ బీహార్ రాష్ట్రంలో ఉందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
ఇకవేళ బీహార్ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిస్తే.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గెలుస్తుందని పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. భారతదేశాన్ని కలిపి ఉంచేందుకు, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలు మద్దతు ఇవ్వాలని అన్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు 15కు పైగా విపక్షాలు పాట్నాలో సమావేశమయ్యాయి. 2024 లోక్ సభ ఎన్నికల్లో ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్లాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఎన్డీయేతర విపక్షాలు అన్ని ఈ సమావేశానికి హాజరయ్యాయి. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. మమతా బెనర్జీ, స్టాలిన్, కేజ్రీవాల్, భగవంత్ మాన్, హేమంత్ సొరెన్ హాజరయ్యారు. వీరితో పాటు కీలక నేతలు అఖిలేష్ యాదవ్, మహబూబా ముఫ్తీ, శరద్ పవార్, ఆదిత్య ఠాక్రే, సంజయ్ రౌత్ మొదలైన వారు ఈ సమావేశానికి హాజరయ్యారు.
తాజావార్తలు
-
Suryakumar Yadav: టీ20 ముంబై లీగ్లో క్రీడాస్ఫూర్తి.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ను సహచరుడికి ఇచ్చేసిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
Peddi : ‘పెద్ది’ టికెట్ రేట్ల తగ్గింపు… ఒక్క రోజే ఈ బంపర్ ఆఫర్
-
Fish Medicine: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ.. రాత్రి 9 గంటల వరకే.!
-
Vastu Tips: ఇంట్లో డబ్బు ఉంచే ప్రదేశం వాస్తు ప్రకారం ఎలా ఉండాలి? చాలామందికి తెలియని విషయాలు ఇవే!
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!