Delhi: రాహుల్గాంధీతో వినేష్ ఫోగట్ భేటీ.. కాంగ్రెస్ టికెట్ ఖాయమా?
- రాహుల్గాంధీతో వినేష్ ఫోగట్ భేటీ
- కాంగ్రెస్ టికెట్ ఖాయమా?
- ఈ సాయంత్రమే జాబితా ప్రకటన
- జాబితాలో ఇద్దరు భారత రెజ్లర్లు పేర్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాలు.. కాంగ్రెస్ అగ్ర నేత, ప్రతిపక్ష నేత రాహుల్గాంధీని కలిశారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ వీరి సమావేశం సర్వత్రా ఆసక్తిగా మారింది. పారిస్ ఒలింపిక్స్లో ఉన్నప్పుడే వినేష్ ఫోగట్ కాంగ్రెస్ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఇటీవల పంజాబ్-హర్యానా సరిహద్దులో అన్నదాతలు చేస్తున్న ఆందోళనకు వినేష్ ఫోగట్ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తు్న్నారా? అని అడిగిన ప్రశ్నకు సమాధానం దాట వేసింది. మొత్తానికి ఊహాగానాలకు తెరదించుతూ ఆమె బుధవారం రాహుల్గాంధీని కలిసింది. త్వరలో జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేయడం ఖాయమని తేలిపోయింది.
ఇది కూడా చదవండి: GWMC : జీడబ్ల్యూఎంసీ పాత భవనం కూల్చివేతలో అధికారుల నిర్లక్ష్యం
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- Maharashtra: ఘోర విషాదం.. ఆలయ గోడ కూలి ఆరుగురు మృతి
- UP: భర్త కోసం టవరెక్కిన మహిళ.. గంట తర్వాత ఏం జరిగిందంటే..!
పారిస్ ఒలింపిక్స్లో 100 గ్రాములు తేడా రావడంతో వినేష్ ఫోగట్ ఫైనల్కు వెళ్లకుండా నిష్క్రమించింది. దీంతో ఆమె తీవ్ర ఆవేదన చెందింది. ఆమెకు భారతీయుల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. ఇక కుస్తి పోటీలకు స్వస్తి పలికి ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తాజా పరిణామాలను బట్టి అర్ధమవుతోంది. అక్టోబర్ 5న హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్డీఏ-ఇండియా కూటమిల మధ్య గట్టి పోటీ నెలకొంది. మరోసారి అధికారం కోసం బీజేపీ ప్రయత్నిస్తుండగా.. ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్ కూటమి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే గెలుపు గుర్రాల కోసం హస్తం పార్టీ వెతుకలాట ప్రారంభించినట్లు సమాచారం. రెజర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాకు సీట్లు కేటాయించి విజయం సాధించాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ఇదిలా ఉంటే ఎన్నికల్లో పోటీపై మాత్రం వినేష్ ఫోగట్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.
ఇది కూడా చదవండి: PM Modi: సింగపూర్లో మోడీకి ఘనస్వాగతం.. డోలు వాయించిన ప్రధాని
హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ 34 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. తాజాగా రెజర్లు భేటీ కావడంతో తుది జాబితాను బుధవారం సాయంత్రం కల్లా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక్కడ అక్టోబర్ 5న పోలింగ్, 8న ఫలితాలు విడుదల కానున్నాయి.
नेता विपक्ष श्री @RahulGandhi से विनेश फोगाट जी और बजरंग पुनिया जी ने मुलाकात की। pic.twitter.com/UK7HW6kLEL
— Congress (@INCIndia) September 4, 2024
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!