Delhi: రాహుల్గాంధీతో వినేష్ ఫోగట్ భేటీ.. కాంగ్రెస్ టికెట్ ఖాయమా?
- రాహుల్గాంధీతో వినేష్ ఫోగట్ భేటీ
- కాంగ్రెస్ టికెట్ ఖాయమా?
- ఈ సాయంత్రమే జాబితా ప్రకటన
- జాబితాలో ఇద్దరు భారత రెజ్లర్లు పేర్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాలు.. కాంగ్రెస్ అగ్ర నేత, ప్రతిపక్ష నేత రాహుల్గాంధీని కలిశారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ వీరి సమావేశం సర్వత్రా ఆసక్తిగా మారింది. పారిస్ ఒలింపిక్స్లో ఉన్నప్పుడే వినేష్ ఫోగట్ కాంగ్రెస్ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఇటీవల పంజాబ్-హర్యానా సరిహద్దులో అన్నదాతలు చేస్తున్న ఆందోళనకు వినేష్ ఫోగట్ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తు్న్నారా? అని అడిగిన ప్రశ్నకు సమాధానం దాట వేసింది. మొత్తానికి ఊహాగానాలకు తెరదించుతూ ఆమె బుధవారం రాహుల్గాంధీని కలిసింది. త్వరలో జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేయడం ఖాయమని తేలిపోయింది.
ఇది కూడా చదవండి: GWMC : జీడబ్ల్యూఎంసీ పాత భవనం కూల్చివేతలో అధికారుల నిర్లక్ష్యం
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Bankra mosque: కోల్కతా ఎయిర్పోర్టు పక్కన 136 ఏళ్ల మసీదు తరలింపు..
- VBSA Bill: పార్లమెంట్లోకి ‘వీబీఎస్ఏ బిల్లు’.. ఎన్డీఏ రాష్ట్రాల సహా తీవ్ర వ్యతిరేకత.. కారణమిదేనా?
పారిస్ ఒలింపిక్స్లో 100 గ్రాములు తేడా రావడంతో వినేష్ ఫోగట్ ఫైనల్కు వెళ్లకుండా నిష్క్రమించింది. దీంతో ఆమె తీవ్ర ఆవేదన చెందింది. ఆమెకు భారతీయుల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. ఇక కుస్తి పోటీలకు స్వస్తి పలికి ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తాజా పరిణామాలను బట్టి అర్ధమవుతోంది. అక్టోబర్ 5న హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్డీఏ-ఇండియా కూటమిల మధ్య గట్టి పోటీ నెలకొంది. మరోసారి అధికారం కోసం బీజేపీ ప్రయత్నిస్తుండగా.. ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్ కూటమి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే గెలుపు గుర్రాల కోసం హస్తం పార్టీ వెతుకలాట ప్రారంభించినట్లు సమాచారం. రెజర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాకు సీట్లు కేటాయించి విజయం సాధించాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ఇదిలా ఉంటే ఎన్నికల్లో పోటీపై మాత్రం వినేష్ ఫోగట్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.
ఇది కూడా చదవండి: PM Modi: సింగపూర్లో మోడీకి ఘనస్వాగతం.. డోలు వాయించిన ప్రధాని
హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ 34 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. తాజాగా రెజర్లు భేటీ కావడంతో తుది జాబితాను బుధవారం సాయంత్రం కల్లా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక్కడ అక్టోబర్ 5న పోలింగ్, 8న ఫలితాలు విడుదల కానున్నాయి.
नेता विपक्ष श्री @RahulGandhi से विनेश फोगाट जी और बजरंग पुनिया जी ने मुलाकात की। pic.twitter.com/UK7HW6kLEL
— Congress (@INCIndia) September 4, 2024
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!