Rahul Gandhi: త్వరలో ‘‘హైడ్రోజన్ బాంబు’’.. బీజేపీకి రాహుల్ గాంధీ వార్నింగ్..
- త్వరలో ‘‘హైడ్రోజన్ బాంబు’’..
- బీజేపీకి రాహుల్ గాంధీ హెచ్చరిక..
- ఓటు చోరీ చేస్తున్నారని ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, ఎన్నికల సంఘం ఓటర్లను మోసం చేయడానికి కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. ‘‘త్వరలో ఓటు చోరిపై హైడ్రోజన్ బాంబు పేలుస్తా’’ అంటూ కామెంట్స్ చేశారు. ఎన్నికల కమిషన్ చేపట్టిన ‘‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’’ ద్వారా బీహార్లో ఓటర్లను తొలగిస్తున్నారని ప్రతిపక్షాలు అధికార బీజేపీ, ఎన్నిక సంఘంపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. 65 లక్షల మంది ఓటు హక్కును అక్రమంగా తొలగించారంటూ రాహుల్ గాంధీ గతంలో ఆరోపిస్తున్నారు.
Read Also: Nellore : ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై హత్యాయత్నం 8 రౌడీషీటర్ల అరెస్ట్
Also Read
- PM Modi: ప్రధాని మోడీకి మెటా క్షమాపణలు.. సాంకేతిక లోపమే కారణమని స్పష్టీకరణ
- Supreme Court: విద్యార్థి నిరసనకారులకు ఊరట.. మైనర్లు, నేర చరిత్ర లేని వారిని వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశం
- Parliament Monsoon Session 2026: నేటి నుంచి సజావుగా పార్లమెంట్ సమావేశాలు.. స్పీకర్ ఓం బిర్లా చొరవతో తొలగిన ప్రతిష్టంభన
- Bihar: నీట్ నిరసనకారులకు ప్రభుత్వం గుడ్న్యూస్.. ఎఫ్ఐఆర్లు ఉపసంహరణ
అయితే, రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై అంతే స్థాయిలో బీజేపీ విరుచుకుపడింది. రాహుల్ గాంధీ కామెంట్స్ తనను తాను కించపరుచుకోవడం, దేశ ఓటర్లను అవమానించడమే అని బీజేపీ ఎదురుదాడి చేసింది. రాహుల్ గాంధీ ర్యాలీకి ఉత్తర్ ప్రదేశ్లోని డియోరియా నుంచి 20,000 మందిని తీసుకువచ్చారని బీజేపీ ఎద్దేవా చేసింది. బీజేపీ నేత, మాజీ కేంద్రం న్యాయ మంత్రి రవి శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘ నేను రాహుల్ గాంధీ మాటలు విన్నప్పుడల్లా, పార్లమెంటు లోపల లేదా వెలుపల, ఆయన ఏమి చెప్పాలనుకుంటున్నారో అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది… అణు బాంబు, హైడ్రోజన్ బాంబులకు ఎన్నికలకు ఏం సంబంధం? రాహుల్ గాంధీ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నాడు’’ అని అన్నారు.
దీనికి ముందు రాహుల్ గాంధీ బీహార్లోని ‘‘ఓటర్ అధికార్’’ ర్యాలీని ముగిస్తూ బీజేపీని హెచ్చరించారు. ‘‘మేము బీజేపీ రాజ్యాంగాన్ని హత్య చేయనివ్వము. అందుకే యాత్ర చేపట్టాము. ప్రజల నుంచి ‘ఓట్ చోర్, గద్ది చోర్’ నినాదాలు వచ్చాయి’’ అని అన్నారు. ‘‘ఓట్ చోర్..’’ నినాదం ప్రతీ చోటా ధ్వనిస్తోందని, ఇప్పుడు చైనాకు కూడా చేరుకుందని రాహుల్ గాంధీ, ప్రధాని మోడీ చైనా ఎస్సీఓ పర్యటనను విమర్శించారు. ‘‘ నేను బీజేపీకి చెబుతున్నా, మీరు అణు బాంబు కన్నా పెద్దది ఏదైనా విన్నారా.? ఇది హైడ్రోజన్ బాంబు. బీజేపీ సిద్ధంగా ఉండాలి, హైడ్రోజన్ బాంబు వస్తోంది’’ అని రాహుల్ గాంధీ అన్నారు.
తాజావార్తలు
-
Johnson & Johnson: వేల కోట్ల సెటిల్మెంట్కి రెడీ అయిన ప్రపంచ దిగ్గజ కంపెనీ.. అక్షరాల రూ.52 వేల కోట్లు ఇవ్వడానికి డీల్!
-
Allu Arjun: హేటర్స్కు అల్లు అర్జున్ స్ట్రాంగ్ మెసేజ్.. ఏం చెప్పాడు భయ్యా!
-
Christopher Nolan: సత్యజిత్ రేకు క్రిస్టోఫర్ నోలన్ నివాళి.. ‘పథేర్ పాంచాలి’ అబ్బురపరిచిందన్న ఆస్కార్ దర్శకుడు!
-
Raaka Movie Update: ‘రాకా’ ఎంట్రీకి రంగం సిద్ధం.. ప్రేక్షకులకు గూస్బంప్స్!
-
Prabhas-Fauji: ప్రభాస్ ఫ్యాన్స్కు పిచ్చెక్కించే న్యూస్.. ఈసారి పీక్స్లో..!
ట్రెండింగ్
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!
-
3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!
-
Saransh Jain: భారత జట్టులోకి దేశవాళీ మాన్స్టర్.. ఎవరీ సరాంశ్ జైన్?.. అంత తోపు ప్లేయరా?
-
Sanju Samson: ఎలుకల పందెంలో పరుగెత్తలేను.. ఎలా ఆడాలో ఎవరూ చెప్పక్కర్లేదు.. సంజు సంచలన వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన POCO M8 Power 5G.!