Johnson & Johnson: వేల కోట్ల సెటిల్మెంట్కి రెడీ అయిన ప్రపంచ దిగ్గజ కంపెనీ.. అక్షరాల రూ.52 వేల కోట్లు ఇవ్వడానికి డీల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Johnson & Johnson: జాన్సన్ అండ్ జాన్సన్ (J&J) బేబీ పౌడర్తో పాటు టాల్క్ ఆధారిత ఉత్పత్తుల వల్ల అండాశయ క్యాన్సర్ వచ్చిందంటూ అమెరికాలో దాఖలైన వేలాది కేసుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వివాదానికి ముగింపు పలికే ప్రయత్నంలో భాగంగా బాధితులకు సుమారు రూ.52 వేల కోట్ల పరిహారం చెల్లించేందుకు జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ అంగీకరించింది. అమెరికా వ్యాప్తంగా జాన్సన్ అండ్ జాన్సన్పై దాదాపు 76 వేల పిటిషన్లు నమోదయ్యాయి. వీరిలో కనీసం 95 శాతం మంది ఈ సెటిల్మెంట్కు ఒప్పుకుంటే ఈ డీల్ అమల్లోకి రానుందని సమాచారం. లేదంటే కంపెనీపై కోర్టు విచారణలు కొనసాగనున్నాయి. ఇప్పటి వరకు తమ టాల్క్ ఉత్పత్తులు పూర్తిగా సురక్షితమైనవేనని, వాటిలో క్యాన్సర్కు కారణమవుతుందని ఆరోపిస్తున్న ఆస్బెస్టాస్ లేదని జాన్సన్ అండ్ జాన్సన్ వాదిస్తూ వచ్చింది. అండాశయ క్యాన్సర్కు తమ ఉత్పత్తులకు ఎలాంటి సంబంధం లేదని కూడా సంస్థ పలుమార్లు స్పష్టం చేసింది.
అయితే దశాబ్దానికి పైగా కొనసాగుతున్న న్యాయపోరాటాలు, భారీ న్యాయ వ్యయాలు కంపెనీ కార్యకలాపాలపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొంది. ఈ కేసుల్లో తాము గెలుస్తామనే నమ్మకం ఉన్నప్పటికీ, సంస్థ ప్రధాన వ్యాపార లక్ష్యాలపై దృష్టి సారించేందుకు ఈ సెటిల్మెంట్కు అంగీకరించినట్లు వెల్లడించింది. ఈ పరిహారంలో తొలి విడతగా 2027లో 3 బిలియన్ డాలర్లు, మిగిలిన మొత్తాన్ని 2028లో చెల్లిస్తామని కోర్టుకు తెలిపింది. కాగా, జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్తో పాటు ఇతర టాల్క్ ఉత్పత్తులను దీర్ఘకాలంగా ఉపయోగించడం వల్ల మహిళలు అండాశయ క్యాన్సర్ బారిన పడుతున్నారని ఆరోపిస్తూ పలువురు అమెరికా కోర్టులను ఆశ్రయించారు. ఈ ఆరోపణలను సంస్థ ఖండించినప్పటికీ, 2020లో అమెరికాలో టాల్క్ ఆధారిత జాన్సన్ బేబీ పౌడర్ విక్రయాలను నిలిపివేసి, దాని స్థానంలో మొక్కజొన్న పిండితో తయారు చేసిన కార్న్స్టార్చ్ ఆధారిత బేబీ పౌడర్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.
Also Read
- TV Ad Cap: 12 నిమిషాల యాడ్ రూల్కు కేంద్రం గుడ్బై.. టీవీ ఛానళ్లకు కొత్త నిబంధనలు
- BSNL: కస్టమర్లకు ఇండిపెండెన్స్ డే ఆఫర్.. కేవలం ఒక రూపాయికే కొత్త స్కీమ్
- RBI SGB Redemption: గ్రాము బంగారం రూ.3 వేలకు కొన్నారు.. ఇప్పుడు లక్షకు రూ.4 లక్షలు..
- Vijay Mallya: వేల కోట్లు ఎగగొట్టి పోయిన విజయ్ మాల్యా చుట్టూ మళ్లీ హాట్ టాపిక్.. ఎంత వసూలైంది? ఎంత మిగిలిందంటే?
తాజావార్తలు
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
PM Modi’s Saptdhara Vision: వికసిత్ భారత్ కోసం ‘సప్తధార’.. మోడీ చెప్పిన 7 కీలక శక్తులివే..
-
Venky Atluri: త్రివిక్రమ్ ఛాయలు.. వెంకీ అట్లూరి రైటింగ్పై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Red Fort: ఎర్రకోట ఎందుకు అంత ముఖ్యమైంది? మొఘలుల నుంచి బ్రిటిష్ వరకు.. చరిత్రలోని ఆసక్తికర నిజాలు
ట్రెండింగ్
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..