INDIA Bloc-EC War: ఇండియా కూటమి మార్చ్లో ఉద్రిక్తత.. రాహుల్గాంధీ అరెస్ట్
- ఇండియా కూటమి మార్చ్లో ఉద్రిక్తత
- రాహుల్గాంధీ అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి చేపట్టిన మార్చ్ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం పార్లమెంట్ భవన్ నుంచి ఈసీ ఆఫీసుకు ర్యాలీ చేపట్టారు. విపక్ష ఎంపీలంతా ఈ మార్చ్లో పాల్గొన్నారు. అయితే ఈ ర్యాలీకి అనుమతి లేదంటూ భద్రతా దళాలు అడ్డుకున్నాయి. దీంతో నేతలు-పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇంకోవైపు అఖిలేష్ యాదవ్ సహా పలువురు ఎంపీలు బారీకేడ్లు దూకుకుంటూ వెళ్లిపోయారు. పరిస్థితులు చేదాటిపోవడంతో రాహుల్గాంధీని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ వాహనంలోకి ఎక్కించారు.
పార్లమెంట్ భవనం నుంచి ఈసీ ఆఫీసు కిలోమీటర్ దూరంలో ఉంది. సోమవారం ఉదయం ఈసీ ఆఫీసుకు ఇండియా కూటమి ర్యాలీగా బయల్దేరింది. దేశంలో ఓట్లు చోరీ జరుగుతుందంటూ కూటమి ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు బయల్దేరింది. అయితే పార్లమెంట్ చుట్టూ పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేశారు. ర్యాలీగా వెళ్లకుండా అష్టదిగ్బంధం చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
Also Read
- Puri Jagannath: పూరీ ఆలయ నిధుల లెక్కలు వెల్లడి.. జగన్నాథ స్వామి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలుసా..?
- El Nino: 2027 ఫిబ్రవరి వరకు ఎల్ నినో.. 100% కొనసాగుతుందని WMO హెచ్చరిక
- PM Modi: కిర్గిజ్స్థాన్లో ‘మానస్’ ప్రత్యక్ష పఠనాన్ని వీక్షించిన మోడీ.. ప్రత్యేకత ఏంటి?
- Ram Mandir CEO: రామ మందిర్ CEOగా జితేంద్ర మిశ్రా.. ‘ఆపరేషన్ సింధూర్లో రహస్యం ఉందా?’ కాంగ్రెస్ అనుమానం
త్వరలో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సంఘం రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) సర్వే చేపట్టింది. ఇందులో భాగంగా 65 లక్షల ఓట్లను తొలగించింది. దీంతో విపక్షాలు ధ్వజమెత్తాయి. అధికార పార్టీకి మద్దతుగా ఎన్నికల సంఘం ఓట్లు తొలగించిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అయితే ఆరోపణలను ఎన్నికల సంఘం ఖండిస్తోంది. తనిఖీలు చేశాకే ఓట్లు తొలగించినట్లు చెప్పింది. ఇక ఇటీవల గత లోక్సభ ఎన్నికల్లో మోసం జరిగిందంటూ కర్ణాటకలో జరిగిన ఘటనను రాహుల్ గాంధీ ఎత్తిచూపారు. అయితే దీనిపై రాహుల్ గాంధీకి నోటీసు జారీ చేసింది. అయితే తాము అడిగిన సమాచారం ఇవ్వాలంటూ తాజాగా ఈసీ ఆఫీస్కు మార్చ్ చేపట్టారు.

#WATCH | Delhi: Samajwadi Party chief Akhilesh Yadav jumps over a police barricade as Delhi Police stops INDIA bloc leaders marching from the Parliament to the Election Commission of India to protest against the Special Intensive Revision (SIR) of electoral rolls in poll-bound… pic.twitter.com/X8YV4mQ28P
— ANI (@ANI) August 11, 2025
#WATCH | Delhi: "… They are using the police to stop us…," says Samajwadi Party Chief and MP Akhilesh Yadav as he sits down to protest as police stop the opposition MPs from marching towards the Election Commission of India. pic.twitter.com/u3ScvbxWiX
— ANI (@ANI) August 11, 2025
తాజావార్తలు
-
Puri Jagannath: పూరీ ఆలయ నిధుల లెక్కలు వెల్లడి.. జగన్నాథ స్వామి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలుసా..?
-
El Nino: 2027 ఫిబ్రవరి వరకు ఎల్ నినో.. 100% కొనసాగుతుందని WMO హెచ్చరిక
-
Konda Surekha : గతంలో పార్టీని తిట్టిన వారిపై చర్యలేవి.? కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు
-
PM Modi: కిర్గిజ్స్థాన్లో ‘మానస్’ ప్రత్యక్ష పఠనాన్ని వీక్షించిన మోడీ.. ప్రత్యేకత ఏంటి?
-
Ram Mandir CEO: రామ మందిర్ CEOగా జితేంద్ర మిశ్రా.. ‘ఆపరేషన్ సింధూర్లో రహస్యం ఉందా?’ కాంగ్రెస్ అనుమానం
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!