Uttar Pradesh: రాహుల్ గాంధీ-అఖిలేష్ యాదవ్ సభలో తొక్కిసలాట.. కార్యకర్తల మధ్య ఘర్షణ..
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్లో ప్రయాగ్ రాజ్లో జరగాల్సిన కాంగ్రెస్-సమాజ్వాదీ(ఎస్పీ) పార్టీల ఎన్నికల ర్యాలీ రసాభసాగా మారింది. ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. కార్యకర్తల అత్యుత్సాహంతో తొక్కిసలాట జరిగింది. దీంతో రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ ప్రసంగించకుండానే సభ వేదిక నుంచి వెళ్లిపోయారు. ఒక్కసారిగా గుంపులు గుంపులుగా కార్యకర్తలు బహిరంగ సభ వేదిక వద్దకు దూసుకువచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఈ నేపథ్యంలో భద్రతకు ఇబ్బంది కావడంతో ఇరువురు నేతలు అక్కడ నుంచి వెళ్లిపోయారు.
Read Also: Indian 2: స్టార్ స్పోర్ట్స్లో ‘భారతీయుడు 2’ ప్రమోషన్స్…ఆడియో లాంచ్ ఆరోజే
Also Read
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
- Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..
- Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
ప్రయాగ్ రాజ్ జిల్లాలోని ఫుల్పూర్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని పాడిలాలో ఈ రోజు జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడకుండా వెళ్లిపోయారు. కాంగ్రెస్, ఎస్పీ కార్యకర్తలు అదుపు తప్పి వేదికపైకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పార్టీ కార్యకర్తలు శాంతించాలని, సంయమనం పాటించాలని అఖిలేష్, రాహుల్ పదేపదే అభ్యర్థించినప్పటికీ, కార్యకర్తలు వీటిని పట్టించుకోలేదు. కార్యకర్తలనను అదుపు చేసేందుకు పోలీసులు, ఇతర భద్రతా సిబ్బంది నానా తంటాలు పడాల్సి వచ్చింది. ఫుల్పూర్ ర్యాలీ నుంచి ఇరువురు నేతలు అలహాబాద్ ఎంపీ పరిధిలోని కరాచానాలోని ముంగారి వద్దకు వెళ్లారు. ఈ ర్యాలీలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. జనం బారికేడ్లు బద్దలు కొట్టి వేదిక పైకి చేరుకునేందుకు ప్రయత్నించారు.
ఉత్తర్ ప్రదేశ్లో మొత్తం 80 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఎక్కువ స్థానాలు గెలిచిన పార్టీనే ఢిల్లీ సింహాసానాన్ని అధిష్టిస్తుంది. గత రెండు పర్యాయాలుగా ఈ రాష్ట్రం నుంచి బీజేపీ మెజారిటీ స్థానాలను సాధించింది. ఈ సారి క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్-ఎస్పీలు పొత్తులో పోటీ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే మే 20 రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న రాయ్బరేలీతో పాటు అమేథీకి ఎన్నికలు జరగనున్నాయి.
#WATCH | Uttar Pradesh: A stampede-like situation took place in the joint public meeting of Congress MP Rahul Gandhi and Samajwadi Party chief Akhilesh Yadav at Phulpur constituency, in Prayagraj.
Rahul Gandhi and Akhilesh Yadav left the public meeting without addressing the… pic.twitter.com/fPW2tgaWOP
— ANI (@ANI) May 19, 2024
తాజావార్తలు
-
Salary Delay: సారీ బాస్.. ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! ఈసారి ‘ఫస్ట్’కు శాలరీ రాదు.. ఎందుకో తెలుసా?
-
Putin – Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్కు రష్యా ‘ఫుల్’ సపోర్ట్..!
-
AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
-
CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
-
RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
ట్రెండింగ్
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!