FIFA World Cup: జకీర్ నాయక్కి ఖతార్ ఆహ్వానం.. ఫిఫాను భారత్ బ్యాన్ చేయాలన్న బీజేపీ నేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Qatar’s invite to fugitive Islamic preacher Zakir Naik slammed by BJP leader: వివాదాస్పద ఇస్లామిక్ మతబోధకుడు జకీర్ నాయక్ ను ఖతార్ ఆహ్వానించినట్లు వార్తలు వస్తున్నాయి. ఖతార్ లో ఫిఫా వరల్డ్ కప్ జరుగుతున్న క్రమంలో అక్కడ ఇస్లాంపై ఉపన్యాసాలు ఇవ్వడానికి ఖతార్ ప్రభుత్వం జకీర్ నాయక్ ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. భారతదేశంలో ఇస్లామిక్ ఉగ్రవాదానికి కారణం అవుతున్నాడని అతనిపై నేరాలు ఉన్నాయి. అప్పటి నుంచి మలేషియాలోొ ప్రవాసంలో ఉంటున్నాడు జకీర్ నాయక్. అయితే ఆయన్ను ఖతార్ ఆహ్వానించడం పట్ల పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
వివాదాస్పద ఇస్లామిక్ బోధకుడు జకీర్ నాయక్ను ఖతార్ ఫిఫా ప్రపంచకప్కు ఆహ్వానించిన నేపథ్యంలో బీజేపీ అధికార ప్రతినిధి సావియో రోడ్రిగ్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత ఫుట్ బాల్ అసోసియేషన్లు, అక్కడికి వెళ్లే భారతీయులు ఖతార్ ఫిఫా ఈవెంట్ను బహిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచం తీవ్రవాదంతో పోరాడుతున్న తరుణంలో జకీర్ నాయక్ ను ఖతార్ ఆహ్వానించడం అంటే ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి ఉగ్రవాద సానుభూతిపరుడిని పిలిచినట్లే అవుతుందని రోడ్రిగ్స్ అన్నారు.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
Read Also: Indonesia Earthquake: ఇండోనేషియా భూకంపంలో 252కు చేరిన మృతులు.. అండగా ఉంటామన్న ప్రధాని మోదీ
ఫిఫా వరల్డ్ కప్ అనేది గ్లోబల్ ఈవెంట్ అని.. ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు ఈ ఫుట్ బాల్ మ్యాచులను చూసేందుకు వస్తారని.. మిలియన్ల మంది టీవీల ద్వారా వీక్షిస్తారని.. ఇలాంటి సమయంలో ఓ ఉగ్రవాద సానుభూతిపరుడిని పిలవడం అంటే.. ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి వేదిక ఇచ్చినట్లే అని అన్నారు. భారతదేశంలో ఇస్లామిక్ రాడికల్ భావజాలం, ద్వేషం వ్యాప్తి చేయడంలో జకీర్ నాయక్ కీలక పాత్ర పోషించారని, ఆయన ఉగ్రవాది కన్నా తక్కువేం కాదని రోడ్రిగ్స్ అన్నారు.
మనీలాండరింగ్, విద్వేషపూరిత ప్రసంగాలు చేడయంపై భారత్ లో ఆయనపై అభియోగాలు ఉన్నాయి. భారతదేశానికి అతను మోస్ట్ వాంటెడ్. ఈ ఏడాది మార్చిలో హోం మంత్రిత్వ శాఖ జకీర్ నాయక్ స్థాపించిన ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ ని చట్టవిరుద్ధ సంస్థగా ప్రకటించి ఐదేళ్లు నిషేధం విధించింది. యువతను బలవంతంగా ఇస్లాంలోకి మార్చడం, ఉగ్రవాదులను కీర్తించడం, హిందూ దేవీదేవతపై అనుచిత వ్యాఖ్యలు చేయస్తుండటం వంటి అభియోగాలను జకీర్ నాయక్ ఎదుర్కొంటున్నారు. భారత్, విదేశాల్లో ఉంటున్న ముస్లిం యువత ఉగ్రవాదానికి ఆకర్షితం అయ్యేలా ప్రోత్సహిస్తున్నాడని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఓ నోటిఫికేషన్ లో పేర్కొంది.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!