Indonesia Earthquake: ఇండోనేషియా భూకంపంలో 252కు చేరిన మృతులు.. అండగా ఉంటామన్న ప్రధాని మోదీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Toll From Indonesia Earthquake Reaches 252: ఇండోనేషియా భూకంపంలో మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు ఈ భూకంపంలో ఇప్పటి వరకు 252 మంది మరణించారు. మంగళవారం ఇండోనేషియా ప్రభుత్వం మరణాల సంఖ్యను వెల్లడించింది. మరో 31 మంది గల్లంతయ్యారని.. 377 మంది గాయపడ్డారని వెల్లడించింది. భూకంపం వల్ల 7,060 మంది ప్రజలు చెల్లచెదురయ్యారు.
ఇండోనేషియా పశ్చిమ జావాలోని సియాంజూర్ పట్టణంలో భూకంపం సంభవించడం వల్ల భారీగా ప్రాణనష్టం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 5.6 తీవ్రతతో భూకంపం రావడం వల్ల ప్రజలు ప్రాణాలు పోయాయి. ప్రస్తుతం శిథిలాల కింద మరింత మంది చిక్కుకుపోయి ఉన్నారు. వారిని రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది పనిచేస్తోంది. సోమవారం భూకంపం రాజధాని జకర్తాలకు ఆగ్నేయంగా 75 కిలోొమీటర్ల దూరంలో ఉన్న సియాంజూర్ లో భూమికి 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది.
Also Read
- US-Iran War: 'ట్రంప్ను చంపేస్తాం'.. శవపేటికలో అమెరికా అధ్యక్షుడు..ఇరాన్ ప్రచారం..
- Earthquake: న్యూజిలాండ్లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
- JD Vance-Iran: జేడీ వాన్స్కు ఇరాన్ రహస్య హెచ్చరిక? అంతర్జాతీయంగా తీవ్ర కలకలం
- Explainer: ఇరు సైన్యాల మధ్య నలిగిపోయిన భారతీయ సిబ్బంది.. ఆ రాత్రి అసలేం జరిగింది?
Read Also: Saudi Arabia: 12 మంది తల నరికి, ఉరితీసిన సౌదీ అరేబియా
భూకంపం బారిన పడిని ఇండోనేషియాకు ప్రపంచదేశాలు బాసటగా నిలుస్తున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ ఇండోనేషియాకు అండగా ఉంటామని ప్రకటించారు. ‘‘ఇండోనేషియా భూకంపంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగడం బాధాకరం.. బాధితులు, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని.. ఈ దు:ఖ సమయంలో ఇండోనేషియాకు భారత్ అండగా ఉంటుంది’’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ప్రధానితో పాటు బ్రిటన్ ప్రధాని రిషి సునక్, భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ సంతాపం వ్యక్తం చేశారు.
ఇండోనేషియాలో తరుచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. ఇండోనేషియా సముద్రంలో అగ్నిపర్వతాలు అధికంగా ఉంటాయి. ఈ ప్రాంతం పసిఫిక్ మహాసముద్రంలోని ‘‘ రింగ్ ఆఫ్ ఫైర్’’ ప్రాంతంలో ఉంది. ఇక్కడ ఇండియన్ టెక్టానిక్ ప్లేట్, బర్మా టెక్టానిక్ ప్లేట్ కదలికలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఈ పలకల మధ్య ఘర్షణ, అగ్నిపర్వతాల విస్పోటనం కారణంగా ఇండోనేషియా భూకంపాలు, సునామీల బారిన పడుతుంటుంది.
తాజావార్తలు
-
India vs England 2nd ODI: కేఎల్ రాహుల్ ఔట్.. ఇషాన్ కిషన్ ఇన్.. అసలు కారణం చెప్పిన కెప్టెన్ గిల్
-
EV Market: ఎలక్ట్రిక్ వాహనాల జోరు..12 రెట్లు పెరిగిన EV మార్కెట్..
-
Uttam Kumar Reddy : కమిషన్ల కక్కుర్తి వల్లే కాళేశ్వరం కూలిపోయింది
-
Karnataka: కర్ణాటకలో దారుణం.. డాక్టర్ భర్తను చంపిన భార్య.. కుమారుడిపై కూడా కత్తితో దాడి
-
Posani Krishna Murali: ‘లవ్ యూ రాజా’ డైలాగ్ వెనుక అసలు కథ ఇదే.. అసలు విషయం చెప్పిన పోసాని
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!