Arvind Kejriwal: ఢిల్లీ మహిళల్ని మోసం చేయొద్దు.. కేజ్రీవాల్ ఇంటి ముందు పంజాబ్ మహిళల ఆందోళన..
- ఢిల్లీ మహిళల్ని మోసం చేయొద్దు..
- కేజ్రీవాల్ ఇంటి ముందు పంజాబ్ మహిళల నిరసన..
- కాంగ్రెస్, బీజేపీ వారంటూ ఆప్ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో ఒక్కసారిగా అక్కడి రాజకీయ వాతావరణం మారిపోయింది. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ, మరోసారి అధికారం చేపట్టాలని ఆప్, సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తున్నాయి. ముఖ్యంగా ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయిలో జరుగుతోంది. ఇదిలా ఉంటే, ఈ రోజు పంజాబ్కి చెందిన మహిళలు అరవింద్ కేజ్రీవాల్ ఇంటి ముందు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆప్ ప్రభుత్వం హామీలను నెరవేర్చలేదని చెబుతూ మహిళలు ఆందోళనకు దిగడం ఉద్రిక్తంగా మారింది.
Read Also: Record in Bookings: 2024లో ఈ కారు కొత్త రికార్డు సృష్టించింది.. గంటలో 1.7లక్షల బుకింగ్స్!
Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
పంజాబ్లో ప్రతీ మహిళకు రూ.1000 అందచేస్తామని హామీ ఇచ్చిన ఆప్ ప్రభుత్వం, దానిని నెరవేర్చలేదని నిరసనకారులు ఆరోపించారు. నాలుగోసారి వరసగా మళ్లీ గెలిస్తే తాము మహిళకు రూ. 2100 ఇస్తామని ఆప్ ప్రకటించిన నేపథ్యంలో ఈ నిరసనలు జరగడం గమనార్హం. తమ సమస్యల్ని లేవనెత్తడానికి అమృత్సర్ నుంచి వచ్చినట్లు మహిళలు చెప్పారు. మాలాగే ఢిల్లీ మహిళల్ని మోసం చేయొద్దని నిరసనకారులు అన్నారు. అయితే, ఈ నిరసనపై ఆప్ ఎదురుదాడికి దిగింది. కేజ్రీవాల్ మాట్లాడుతూ.. నిరసన తెలుపుతున్న వారు కాంగ్రెస్, బీజేపీకి చెందిన వారని అన్నారు. ఈ రెండు పార్టీలు కూడా అనధికారికంగా పొత్తు ప్రకటించాయని దుయ్యబట్టారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!