Puja Khedkar: మరోసారి వార్తల్లో పూజా ఖేద్కర్.. ఈసారి దేనికోసమంటే..!
- మరోసారి వార్తల్లో పూజా ఖేద్కర్
- దొంగతనంపై పోలీసులకు ఫిర్యాదు
- దర్యాప్తు చేస్తున్న పోలీసులు
మాజీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ మరోసారి వార్తల్లోకి వచ్చారు. యూపీఎస్సీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడినందుకు 2024లో ఐఏఎస్ ఉద్యోగాన్ని పోగొట్టుకున్నారు. అనంతరం గతేడాది పూజా ఖేద్కర్ తండ్రి.. ఓ డ్రైవర్ను కిడ్నాప్ చేయడంతో మళ్లీ వార్తల్లో హల్చల్ చేశారు. తాజాగా మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఈసారి తమ కుటుంబ సమస్యలపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు.
ఇది కూడా చదవండి: Silver Rates: వామ్మో సిల్వర్.. మళ్లీ తాండవమే! ఈరోజు ఎంత పెరిగిందంటే..!
Also Read
- Pune: పెళ్లి కోసం యువకుడి ఆరాటం.. ఏకంగా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లతో ప్రచారం..
- Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
- PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
- Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. 'మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం'.. అంటూ ఆగ్రహం!
తమ ఇంట్లో దొంగతనం జరిగిందని శనివారం పూజా ఖేద్కర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేపాల్ నుంచి వచ్చిన పని మనిషి.. ఆహారం, పానీయాల్లో మత్తుమందులు కలిపి ఇవ్వడంతో తన తల్లిదండ్రులు, సిబ్బంది అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. పూణెలోని బనేర్ రోడ్ నివాసంలో పూజా ఖేద్కర్ ఇంటికి వెళ్లారు. అక్కడ వాచ్మెన్ జితేంద్ర సింగ్, తల్లిదండ్రులు దిలీప్, మనోరమ మంచంపై అపస్మారక స్థితిలో కనిపించారు. ఇక గదిలో అల్మారాలు, మూడు గదులు తెరిచి ఉన్నాయని.. అంతస్తుల్లో వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Trump: ట్రంప్ మరో దూకుడు.. వెనిజులా అధ్యక్షుడిగా ప్రకటన
పోలీసులు వెంటనే పూజా ఖేద్కర్ తల్లిదండ్రులతో పాటు వాచ్మన్ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కుటుంబ డ్రైవర్ దాదాసాహెబ్ ధకానే మరొక గదిలో ఉండగా.. వంటవాడు సుజత్ రాయ్ ఇంకొక గదిలో ఉన్నారు. వీరిని కూడా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో తాను తప్పించుకోగలిగానని.. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పూజా ఖేద్కర్ తెలిపారు. ఇక ఆమె సోదరులు వినయ్, హర్షద్ బుధ్వంత్ కూడా క్షేమంగా ఉన్నారు.
ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని.. పూజా ఖేద్కర్ ఆదివారం నాటికి అధికారికంగా లిఖితపూర్వక ఫిర్యాదు చేయలేదని.. ఏవేవి దొంగిలించబడ్డాయో వివరాలు అందించలేదని పోలీసులు తెలిపారు.
2024లో పూణెలో ఐఏఎస్ ప్రొబెషనర్ పిరియడ్లో ఉండగా పూజా ఖేద్కర్ గొంతెమ్మ కోర్కెలు కోరింది. ట్రైనింగ్ సమయంలో ఎలాంటి సదుపాయాలు ఉండవు. కానీ అంతకు మించి కోర్కెలు కోరారు. దీంతో ఆమెపై ఫిర్యాదులు వెళ్లాయి. తప్పుడు ధృవీకరణ పత్రాలతో ఉద్యోగం పొందినట్లుగా తేలడంతో యూపీఎస్సీ వేటు వేసింది. భవిష్యత్లో ఎలాంటి పరీక్షల్లో పాల్గొనకుండా సస్పెన్షన్ చేసింది.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?