Puja Khedkar: మరోసారి వార్తల్లో పూజా ఖేద్కర్.. ఈసారి దేనికోసమంటే..!
- మరోసారి వార్తల్లో పూజా ఖేద్కర్
- దొంగతనంపై పోలీసులకు ఫిర్యాదు
- దర్యాప్తు చేస్తున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ మరోసారి వార్తల్లోకి వచ్చారు. యూపీఎస్సీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడినందుకు 2024లో ఐఏఎస్ ఉద్యోగాన్ని పోగొట్టుకున్నారు. అనంతరం గతేడాది పూజా ఖేద్కర్ తండ్రి.. ఓ డ్రైవర్ను కిడ్నాప్ చేయడంతో మళ్లీ వార్తల్లో హల్చల్ చేశారు. తాజాగా మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఈసారి తమ కుటుంబ సమస్యలపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు.
ఇది కూడా చదవండి: Silver Rates: వామ్మో సిల్వర్.. మళ్లీ తాండవమే! ఈరోజు ఎంత పెరిగిందంటే..!
Also Read
- MK Stalin: టీవీకే ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు.. పరిస్థితి మారింది, ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ..
- Odisha Engineer: రూ.6 వేల జీతంతో ప్రారంభం.. రూ.2 కోట్ల ఆస్తులతో పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి
- Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
- NEET UG 2026: నీట్ రీ-ఎగ్జామ్ కు ముందు.. పేపర్ లీక్ వదంతులపై విద్యార్థులకు ఎన్టీఏ విజ్ఞప్తి..
తమ ఇంట్లో దొంగతనం జరిగిందని శనివారం పూజా ఖేద్కర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేపాల్ నుంచి వచ్చిన పని మనిషి.. ఆహారం, పానీయాల్లో మత్తుమందులు కలిపి ఇవ్వడంతో తన తల్లిదండ్రులు, సిబ్బంది అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. పూణెలోని బనేర్ రోడ్ నివాసంలో పూజా ఖేద్కర్ ఇంటికి వెళ్లారు. అక్కడ వాచ్మెన్ జితేంద్ర సింగ్, తల్లిదండ్రులు దిలీప్, మనోరమ మంచంపై అపస్మారక స్థితిలో కనిపించారు. ఇక గదిలో అల్మారాలు, మూడు గదులు తెరిచి ఉన్నాయని.. అంతస్తుల్లో వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Trump: ట్రంప్ మరో దూకుడు.. వెనిజులా అధ్యక్షుడిగా ప్రకటన
పోలీసులు వెంటనే పూజా ఖేద్కర్ తల్లిదండ్రులతో పాటు వాచ్మన్ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కుటుంబ డ్రైవర్ దాదాసాహెబ్ ధకానే మరొక గదిలో ఉండగా.. వంటవాడు సుజత్ రాయ్ ఇంకొక గదిలో ఉన్నారు. వీరిని కూడా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో తాను తప్పించుకోగలిగానని.. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పూజా ఖేద్కర్ తెలిపారు. ఇక ఆమె సోదరులు వినయ్, హర్షద్ బుధ్వంత్ కూడా క్షేమంగా ఉన్నారు.
ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని.. పూజా ఖేద్కర్ ఆదివారం నాటికి అధికారికంగా లిఖితపూర్వక ఫిర్యాదు చేయలేదని.. ఏవేవి దొంగిలించబడ్డాయో వివరాలు అందించలేదని పోలీసులు తెలిపారు.
2024లో పూణెలో ఐఏఎస్ ప్రొబెషనర్ పిరియడ్లో ఉండగా పూజా ఖేద్కర్ గొంతెమ్మ కోర్కెలు కోరింది. ట్రైనింగ్ సమయంలో ఎలాంటి సదుపాయాలు ఉండవు. కానీ అంతకు మించి కోర్కెలు కోరారు. దీంతో ఆమెపై ఫిర్యాదులు వెళ్లాయి. తప్పుడు ధృవీకరణ పత్రాలతో ఉద్యోగం పొందినట్లుగా తేలడంతో యూపీఎస్సీ వేటు వేసింది. భవిష్యత్లో ఎలాంటి పరీక్షల్లో పాల్గొనకుండా సస్పెన్షన్ చేసింది.
తాజావార్తలు
-
MK Stalin: టీవీకే ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు.. పరిస్థితి మారింది, ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ..
-
NBK 112 : బాలయ్య సినిమాలో విలన్ గా యాంగ్రీ యంగ్ సీనియర్ హీరో?
-
Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
-
Shreyas Iyer: కేక్పై ఐసింగ్ లాంటిది.. టీమిండియా కెప్టెన్సీపై తొలిసారి స్పందించిన శ్రేయస్ అయ్యర్!
-
Sriram Krishnan: ట్రంప్ ప్రభుత్వానికి షాక్.. AI విధాన సలహాదారు పదవికి శ్రీరామ్ కృష్ణన్ రాజీనామా
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!