Khalistan: కెనడా పీఎం ట్రూడో సమక్షంలో ఖలిస్తాన్ అనుకూల నినాదాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khalistan: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన భారత వ్యతిరేక వైఖరిని అవలంభిస్తూనే ఉన్నాడు. తాజాగా టొరంటోలో జరిగి ఖల్సా డే సెలబ్రేషన్స్లో పీఎం ట్రూడో, ప్రతిపక్ష నేత పియరీ పోయిలీవ్రే సమక్షంలో ఖలిస్తాన్ అనుకూల నినాదాలు చేయడం చర్చనీయాంశంగా మారాయి. కెనడాలో ఇటీవల కాలంలో భారత వ్యతిరేక సెంటిమెంట్లు పెరుగుతున్నాయి. ముఖ్యంగా అక్కడ కొందరు రాడికల్ సిక్కులు ఖలిస్తాన్ డిమాండ్ చేస్తున్నారు. దీనికి మద్దతుగా ట్రూడో ప్రభుత్వం, అతని పార్టీ వ్యవహరిస్తోంది.
ట్రూడోతో అధికారాన్ని పంచుకుంటున్న ఖలిస్తాన్ అనుకూల పార్టీ ఎన్డీపీ నేత జగ్మీత్ సింగ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరైన సందర్భంలో ‘‘ఖలిస్తాన్ జిందాబాద్’’ నినాదాలు వినిపించాయి. ప్రతిపక్ష నాయకుడు పియరీ ప్రోయిలీవ్రే కార్యక్రమంలో మాట్లాడేందుకు వెళ్లిన సమయంలో కూడా ఇలాంటి నినాదాలే వినిపించాయి. టొరంటోలో జరిగిన ఈ కార్యక్రమానికి వేలాది మంది ప్రజలు హాజరయ్యారు. సిక్కు కొత్త సంవత్సర వైశాఖని ఖల్సాడే అని కూడా పిలుస్తారు.
Also Read
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- DMK: లోక్సభలో కాంగ్రెస్తో కలిసి కూర్చోం.. డీఎంకే నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్..!
Read Also: Attack On BJP: బీజేపీ కార్యకర్తపై దాడి.. ఆ పార్టీ చెందిన పలువురు వ్యక్తులపై ఆరోపణ..
ఇక ప్రధాని జస్టిన్ ట్రూడో సిక్కు కమ్యూనిటీని ఉద్దేశించి మాట్లాడే సమయంలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున నినాదాలు వచ్చాయి. దేశంలోని సిక్కు కమ్యూనిటీ హక్కులు, స్వేచ్ఛలను అన్ని విధాలుగా రక్షించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని ఆయన చెప్పారు. కెనడాలో దాదాపుగా 8 లక్షల మంది సిక్కులు ఉన్నారు. ద్వేషం, వివక్షకు వ్యతిరేకంగా మీ కమ్యూనిటీని రక్షించుకుంటామని చెప్పారు.
భారత్-కెనడాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో ట్రూడో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గతేడాది హర్దీప్ సింగ్ నిజ్జర్ అనే ఖలిస్తానీ ఉగ్రవాదిని కెనడాలోని సర్రే ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. అయితే, ఈ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని ప్రధాని ట్రూడో ఆరోపించాడు. అయితే, ఆయన చేసిన వ్యాఖ్యలు అసంబద్ధమైన, ప్రేరేపిత వ్యాఖ్యలుగా ఇండియా కొట్టిపారేసింది. కెనడా గడ్డ గ్యాంగ్స్టర్లు, ఉగ్రవాదులకు నిలయంగా మారిందని భారత్ ఆరోపించింది. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు క్షీణించాయి.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!