Attack On BJP: బీజేపీ కార్యకర్తపై దాడి.. ఆ పార్టీ చెందిన పలువురు వ్యక్తులపై ఆరోపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అధికార తృణమూల్ కాంగ్రెస్ చెందిన పలువురు వ్యక్తులు ఈ రోజు తనపై పదునైన ఆయుధాలతో దాడి చేశారని కోల్కతాలోని ఒక బీజేపీ కార్యకర్త ఆరోపించారు. దక్షిణ కోల్కతాలోని కస్బా ప్రాంతంలోని బీజేపీ మహిళా మండల్స్ యూనిట్ అధ్యక్షురాలు సరస్వతి సర్కార్ ఇతర పార్టీ కార్యకర్తలతో కలిసి ఎన్నికల పోస్టర్లు పెడుతుండగా ఆమెపై దాడి జరిగిందని ఆమె ఆరోపించారు. ఇకపోతే ఘటనా స్థలం నుండి వచ్చిన ఫోటోలలో శ్రీమతి సర్కార్ తన తలను పట్టుకుని, ఆమె ముఖం మీద రక్తం వస్తు నొప్పితో ఏడుస్తున్నట్లు చూపించాయి. దాడి వెనుక ఉన్నవారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ దక్షిణ కోల్కతా లోక్సభ అభ్యర్థి దేబశ్రీ చౌదరి నేతృత్వంలోని స్థానిక బీజేపీ ఆనందపూర్లోని పోలీస్ స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేసింది.
Also Read: Intraday Share Markets: భారీ లాభాలతో అదరగొట్టిన స్టాక్ మార్కెట్స్..
Also Read
- Pak vs WI: వెస్టిండీస్పై బాబర్ సేన భారీ విజయం.! WTC పాయింట్ల పట్టికలో మార్పులు.!
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
మీడియాతో మాట్లాడిన బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ షోతోరుప., “ఈ సంఘటన కస్బా లో చాలా ఎత్తైన భవనం బయట జరిగింది. ఇది అస్సలు డౌన్ మార్కెట్ ప్రాంతం కాదు. ఒక గుంపు వ్యక్తులు మా కార్లను వెంబడించారు. సరస్వతి సర్కార్ కారు కొంచెం ముందుకు వెళుతుండగా.., 11 మంది కార్యకర్తలతో ఆమె వెనుక ఉన్న కారును ఆపి, వారిని వాహనం నుండి బయటకు తీసి దాడి చేశారు. సరస్వతి దీనిని చూసినప్పుడు, వ్యక్తులు దాడి చేసినప్పుడు ఆమె వారిని నివారించేందుకు పరిగెత్తింది. దాంతో ఈ ఘటనలో ఆమెకు దెబ్బలు తగిలాయి. దాంతో తలపై ఆమెకు 5 కుట్లు పడ్డాయి.
Also Read: Google layoffs: మరోసారి భారీగా ఉద్యోగులను తొలగించిన గూగుల్…
ఆమె రక్తస్రావం అవుతుండగా ఆనందపూర్ పోలీస్ స్టేషన్ కు 50-60 మీటర్లు నడిచి వెళ్లింది. అక్కడ ఎఫ్ఐఆర్ నమోదుచేయాలని కార్యకర్తలు కోరగా.. కానీ హత్యాయత్నం వంటి పెద్ద అభియోగాలను దాఖలు చేయడానికి పోలీసులు నిరాకరించారని ఆమె చెప్పారు. అయితే, ఈ దాడికి ఎలాంటి సంబంధం లేదని, ఇది స్థానిక సమస్య కావచ్చని తృణమూల్ కాంగ్రెస్ ఖండించింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Huawei MateBook Pro S: హువావే మేట్బుక్ ప్రో ఎస్ విడుదల.. అత్యంత తేలికైన ల్యాప్టాప్.. Kirin XE90 ప్రాసెసర్
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త!
-
Raaka: ‘రాకా’లో షారుఖ్ ఉన్నారా? వైరల్ అవుతున్న గెస్ట్ రోల్ వార్తలపై క్లారిటీ!
-
Pak vs WI: వెస్టిండీస్పై బాబర్ సేన భారీ విజయం.! WTC పాయింట్ల పట్టికలో మార్పులు.!
-
Oppo F35 Pro: ఒప్పో F35 ప్రో భారత్ లో రిలీజ్ కు రెడీ.. 10,000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫోన్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!