Wayand Polls: ప్రియాంకాగాంధీ నామినేషన్ పత్రాలపై కీలక ప్రకటన
- ప్రియాంకాగాంధీ నామినేషన్ పత్రాలపై కీలక ప్రకటన
- నామినేషన్ పత్రాలు ఆమోదం పొందినట్లు అధికారులు వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ అగ్ర ప్రియాంకాగాంధీ నామినేషన్ పత్రాలపై అధికారులు కీలక ప్రకటన చేశారు. ఈనెల 23న ప్రియాంకాగాంధీ వయనాడ్ కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ అగ్ర నేతలు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి ఆమె నామినేషన్ వేశారు. అయితే తాజాగా ప్రియాంక నామినేషన్ పత్రాలు ఆమోదం పొందినట్లు సోమవారం అధికారులు ప్రకటించారు. ప్రియాంక నామినేషన్ తర్వాత బీజేపీ విమర్శలు గుప్పించింది. ఆమె ఆస్తులు, భర్త ఆస్తులపై ఆరోపణలు గుప్పించారు. అఫిడవిట్లో ప్రియాంక ఆస్తులు రూ.12 కోట్లు ఉండగా.. భర్త రాబర్ట్ వాద్రా ఆస్తులు రూ.66 కోట్లు ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. మొత్తానికి ప్రియాంక నామినేషన్ ఆమోదం పొందడంతో పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సోమవారం నుంచి రెండు రోజుల పాటు కొండ నియోజకవర్గంలో ప్రియాంక ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఓటర్లతో మమేకమై బహిరంగ సభల్లో పాల్గొని ప్రచారం చేయనున్నారు.
ఇది కూడా చదవండి: Hyderabad: ఎయిర్పోర్టులో పార్క్ చేసిన విమానం ధ్వంసం..
Also Read
- Mamata Banerjee: మమత పార్టీలో విభేదాలు.. నిరసనకు 35 మంది ఎమ్మెల్యేలే హాజరు..
- Modi-Meloni: గంటల్లోనే కోట్లలో వ్యూస్.. ఇంటర్నెట్లో ప్రకంపనలు రేపుతున్న మెలోడీ వీడియో
- Suryastra Rocket: శత్రువులకు హెచ్చరికగా.. స్వదేశీ ‘సూర్యాస్త్ర’ రాకెట్ సక్సెస్.. పెరిగిన డిఫెన్స్ పవర్
- PM Modi: కాశీ-రోమ్ శాశ్వతనగరాలు.. సంబంధాలు కూడా అంతే గొప్పవన్న మోడీ
నవంబర్ 13న వయనాడ్ బైపోల్ ఎన్నిక జరగనుంది. ఇప్పటికే ప్రియాంకపై పోటీగా బీజేపీ కూడా బలమైన అభ్యర్థిని నిలబెట్టింది. బీజేపీలో క్రీయాశీలకంగా ఉన్న నవ్య హరిదాస్ను బరిలోకి దింపింది. ఈమె కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. రెండు జాతీయ పార్టీలు పోటీపోటీగా ప్రచారం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Vijayawada: విషాదం.. హోటల్ కిటికీ నుంచి పడి నాలుగేళ్ల చిన్నారి మృతి
ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రాయ్బరేలీ, వయనాడ్ నుంచి పోటీ చేశారు. రెండు చోట్ల నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు. అయితే గాంధీ కుటుంబానికి కుంచుకోట అయిన రాయ్బరేలీ స్థానాన్ని ఉంచుకుని.. వయనాడ్ స్థానాన్ని రాహుల్గాంధీ వదులుకున్నారు. దీంతో వయనాడ్లో ఉపఎన్నిక అనివార్యమైంది. నవంబర్ 13న పోలింగ్ జరుగుతుండగా.. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 23న విడుదల కానున్నాయి.
ఇది కూడా చదవండి: Suriya: కంగువ డబ్బు కోసం చేయలేదు.. సూర్య కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Mohammad Amir: బ్రిటిష్ పౌరుడిగా మహ్మద్ ఆమీర్.. ఇక IPLలో ఆడే ఛాన్స్.!
-
Prashanth Neel : ఎన్టీఆర్ బక్క చిక్కడం చూసి భయపడిపోయా.. ఎన్టీఆర్ భార్య కూడా నాపై సీరియస్ అయింది
-
Mamata Banerjee: మమత పార్టీలో విభేదాలు.. నిరసనకు 35 మంది ఎమ్మెల్యేలే హాజరు..
-
Modi-Meloni: గంటల్లోనే కోట్లలో వ్యూస్.. ఇంటర్నెట్లో ప్రకంపనలు రేపుతున్న మెలోడీ వీడియో
-
Lenovo Legion Y900: కొత్త టాబ్లెట్ లెనోవో లెజియన్ Y900 విడుదల..144Hz డిస్ప్లే, 12,700mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!