Wayand Polls: ప్రియాంకాగాంధీ నామినేషన్ పత్రాలపై కీలక ప్రకటన
- ప్రియాంకాగాంధీ నామినేషన్ పత్రాలపై కీలక ప్రకటన
- నామినేషన్ పత్రాలు ఆమోదం పొందినట్లు అధికారులు వెల్లడి
కాంగ్రెస్ అగ్ర ప్రియాంకాగాంధీ నామినేషన్ పత్రాలపై అధికారులు కీలక ప్రకటన చేశారు. ఈనెల 23న ప్రియాంకాగాంధీ వయనాడ్ కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ అగ్ర నేతలు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి ఆమె నామినేషన్ వేశారు. అయితే తాజాగా ప్రియాంక నామినేషన్ పత్రాలు ఆమోదం పొందినట్లు సోమవారం అధికారులు ప్రకటించారు. ప్రియాంక నామినేషన్ తర్వాత బీజేపీ విమర్శలు గుప్పించింది. ఆమె ఆస్తులు, భర్త ఆస్తులపై ఆరోపణలు గుప్పించారు. అఫిడవిట్లో ప్రియాంక ఆస్తులు రూ.12 కోట్లు ఉండగా.. భర్త రాబర్ట్ వాద్రా ఆస్తులు రూ.66 కోట్లు ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. మొత్తానికి ప్రియాంక నామినేషన్ ఆమోదం పొందడంతో పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సోమవారం నుంచి రెండు రోజుల పాటు కొండ నియోజకవర్గంలో ప్రియాంక ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఓటర్లతో మమేకమై బహిరంగ సభల్లో పాల్గొని ప్రచారం చేయనున్నారు.
ఇది కూడా చదవండి: Hyderabad: ఎయిర్పోర్టులో పార్క్ చేసిన విమానం ధ్వంసం..
Also Read
- Rs 397 Crore Transformer Scam: ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో రూ.397 కోట్ల స్కామ్.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు..
- JMI VC Mazhar Asif: "భారతీయులందరిది మహాదేవుడి డిఎన్ఏ!".. ముస్లిం వైస్ ఛాన్సలర్ ఆసిఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- PM Modi: ప్రధాని మోడీ వారణాసి పర్యటన.. కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు
- West Bengal Assembly Elections 2026: బెంగాల్ 2వ దశ పోలింగ్లో EVM గందరగోళం.. హౌరాలో హింసాత్మక ఘటనలు
నవంబర్ 13న వయనాడ్ బైపోల్ ఎన్నిక జరగనుంది. ఇప్పటికే ప్రియాంకపై పోటీగా బీజేపీ కూడా బలమైన అభ్యర్థిని నిలబెట్టింది. బీజేపీలో క్రీయాశీలకంగా ఉన్న నవ్య హరిదాస్ను బరిలోకి దింపింది. ఈమె కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. రెండు జాతీయ పార్టీలు పోటీపోటీగా ప్రచారం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Vijayawada: విషాదం.. హోటల్ కిటికీ నుంచి పడి నాలుగేళ్ల చిన్నారి మృతి
ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రాయ్బరేలీ, వయనాడ్ నుంచి పోటీ చేశారు. రెండు చోట్ల నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు. అయితే గాంధీ కుటుంబానికి కుంచుకోట అయిన రాయ్బరేలీ స్థానాన్ని ఉంచుకుని.. వయనాడ్ స్థానాన్ని రాహుల్గాంధీ వదులుకున్నారు. దీంతో వయనాడ్లో ఉపఎన్నిక అనివార్యమైంది. నవంబర్ 13న పోలింగ్ జరుగుతుండగా.. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 23న విడుదల కానున్నాయి.
ఇది కూడా చదవండి: Suriya: కంగువ డబ్బు కోసం చేయలేదు.. సూర్య కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Players Caught Vaping: మ్యాచ్ మధ్యలో ఈ-సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కిన ప్లేయర్స్ వీళ్లే..
-
Arshdeep Singh Trolls: రీల్స్, గర్ల్ఫ్రెండ్పై కాదు.. బౌలింగ్పై దృష్టి పెట్టు సింగ్ సాబ్!
-
Rs 397 Crore Transformer Scam: ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో రూ.397 కోట్ల స్కామ్.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు..
-
Redmi Pad 2: రెడ్మి ప్యాడ్ 2 టాబ్లెట్ విడుదల.. 7600mAh బ్యాటరీ, డ్యూయల్ స్పీకర్లు.. తక్కువ ధరకే
-
JMI VC Mazhar Asif: “భారతీయులందరిది మహాదేవుడి డిఎన్ఏ!”.. ముస్లిం వైస్ ఛాన్సలర్ ఆసిఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో