Hyderabad: ఎయిర్పోర్టులో పార్క్ చేసిన విమానం ధ్వంసం..
- నిలిపి ఉంచిన విమానం ధ్వంసం
- హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయంలో ఘటన
- ఫుటేజీని పరిశీలిస్తున్నామన్న పోలీసులు
- చర్యలు తీసుకుంటామని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయంలో నిలిపి ఉంచిన విమానాన్ని (ప్రైవేట్ జెట్) ఉద్దేశపూర్వకంగా పాడు చేశారనే ఆరోపణలపై అపోలో హాస్పిటల్స్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. అపోలో హాస్పిటల్స్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ – జగ్జీత్ సింగ్ గురువారం ఇక్కడ బేగంపేట పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేయడంతో ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.
READ MORE: Jammu Kashmir: ఆర్మీ వాహనంపై దాడి.. కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం..
Also Read
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..? ఆల్-పార్టీ మీటింగ్లో కీలక పరిణామం..
- Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
- Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
- CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
బేగంపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీటీ-పీసీఆర్గా నమోదైన విమానం ఏప్రిల్లో రెండు వారాల పాటు బేగంపేట విమానాశ్రయంలో పార్క్ చేశారు. ఈ విమానం అపోలో గ్రూప్ ఛైర్మన్, ప్రతాప్ సి.రెడ్డి కి చెందినదిగా సమాచారం. ఏప్రిల్ 5న చెన్నై వెళ్లేందుకు విమానాన్ని పరిశీలించగా ఇంజన్లోని కొన్ని పరికరాలు దెబ్బతిని ఉండడాన్ని గుర్తించారు. విమానంలోని కొన్ని భాగాలకు ఉద్దేశపూర్వకంగా నష్టం జరిగినట్లు కనుగొన్నారు. దెబ్బతిన్న వస్తువులు మినిమం ఎక్విప్మెంట్ లిస్ట్ (ఎంఈఎల్) నిబంధనల పరిధిలోకి వచ్చినప్పటికీ విమానాన్ని టేకాఫ్కు అనుమతించి చెన్నైకి చేరుకున్నట్లు తెలిసింది. అయితే.. చెన్నైలో ల్యాండింగ్లో విమానం ఇంజిన్, వైర్లు, ఏవియానిక్స్కు అదనపు నష్టం జరిగినట్లు సిబ్బంది గుర్తించింది. ఈ విషయాన్ని బేగంపేట ఎయిర్పోర్ట్ డైరెక్టర్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లినా సరైన స్పందన లేదని జగ్జీత్ సింగ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు మేరకు బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. “ఇది అధిక భద్రతా ప్రాంతం. విమానాలు పార్క్ చేసిన స్థలం మొత్తం నిఘా కెమెరాలతో పర్యవేక్షిస్తాం. ఫుటేజీని పరిశీలిస్తున్నాం. తదుపరి విచారణ ఆధారంగా బాధ్యులను గుర్తించి, అవసరమైన చర్యలు తీసుకుంటాం. ”అని ఓ పోలీసు అధికారి తెలిపారు.
తాజావార్తలు
-
IND vs ENG 3rd ODI: రోహిత్-కోహ్లీ భవిష్యత్తుపై ప్రశ్న.. హ్యారీ బ్రూక్ సమాధానం ఇదే!
-
OPPO K14x 5G: ఒప్పో K14x 5G.. 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్!
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..? ఆల్-పార్టీ మీటింగ్లో కీలక పరిణామం..
-
Rohit Sharma: ఇంగ్లండ్తో మూడో వన్డే మ్యాచ్.. అదే రోహిత్కు ప్రధాన సమస్య!
-
Bollywood: బాలీవుడ్లో కోట్లు కురిపిస్తున్న కామెడీ చిత్రాలు
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!