Priyanka Gandhi: రాష్ట్రపతిని సోనియా గౌరవించారు.. మీడియా మాత్రం వక్రీకరించింది
- రాష్ట్రపతిని సోనియా గౌరవించారు.. మీడియా మాత్రం వక్రీకరించింది
- తల్లికి మద్దతుగా నిలిచిన వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంటలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగంపై సోనియాగాంధీ స్పందించిన తీరు తీవ్ర వివాదాస్పదమైంది. అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సోనియా క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ డిమాండ్ చేసింది. అంతేకాకుండా రాష్ట్రపతి భవన్ కూడా సోనియా వ్యా్ఖ్యలను ఖండించింది. సోనియా వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. వివాదం ముదురుతున్న వేళ వయనాడ్ ఎంపీ, సోనియా కుమార్తె ప్రియాంక స్పందించారు. తన తల్లికి రాష్ట్రపతి అంటే అపారమైన గౌరవం ఉందని.. తన తల్లి వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని తప్పుపట్టారు. క్షమాపణ చెప్పాల్సింది తన తల్లి కాదు.. దేశాన్ని నాశనం చేసిన బీజేపీ క్షమాపణ చెప్పాలని అన్నారు. తన తల్లికి ఇప్పుడు 78 ఏళ్లు.. అలాగే రాష్ట్రపతి కూడా పెద్ద వయసు వారు. వారిద్దరూ గౌరవనీయమైన వ్యక్తులు అని ప్రియాంక పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: AP DGP: ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబుకు ధన్యవాదాలు.. వారిని మాత్రం విదిలి పెట్టం..
Also Read
శుక్రవారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసగించారు. అనంతరం పార్లమెంట్ హాల్ నుంచి సోనియా, రాహుల్, ప్రియాంక బయటకు వచ్చారు. అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు.. రాష్ట్రపతి ప్రసంగంపై ప్రశ్నించారు. దీనికి సోనియా బదులిస్తూ… ప్రసంగం చివరకు వచ్చేసరికి రాష్ట్రపతి బాగా అలసిపోయారని.. ఆమె మాట్లాడలేకపోయారని.. పాపం అంటూ ఆమె వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సోనియా వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. అత్యున్నత స్థానంలో ఉన్న గిరిజన మహిళను అవమానించారని.. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Working hours: ‘‘వారానికి 55-60 గంటలు పనిచేస్తే ఇక అంతే’’.. ఆర్థిక సర్వేలో కీలక విషయాలు..
తాజాగా ఇదే అంశంపై రాష్ట్రపతి భవన్ స్పందించింది. సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. రాష్ట్రపతి ఏ సమయంలోనూ అలసిపోలేదని స్పష్టం చేసింది. కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలు దురదృష్టకరమని… మాట్లాడకుండా ఉండాల్సిందని హితవు పలికింది. అణగారిన వర్గాలు, మహిళలు, రైతుల కోసం మాట్లాడుతున్నప్పుడు రాష్ట్రపతికి అలసట దరిచేరదని.. రాష్ట్రపతి ప్రసంగంపై వ్యాఖ్యలు చేసిన నాయకులకు భారతీయ భాష, యాసలతో పరిచయం లేకపోయి ఉండొచ్చని పేర్కొంది. అందుకే రాష్ట్రపతి అలసిపోయినట్లు వాళ్లకు అనిపించొచ్చని.. ఏదేమైనా రాజ్యాంగబద్ధంగా అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో తెలిపింది.
ఇది కూడా చదవండి: BSNL New Plan: బీఎస్ఎన్ఎల్ న్యూ రీఛార్జ్ ప్లాన్.. జస్ట్ రూ. 99కే అదిరిపోయే బెనిఫిట్స్
తాజావార్తలు
-
Philippines Earthquake: ఫిలిప్పీన్స్లో 7.8 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!