Working hours: ‘‘వారానికి 55-60 గంటలు పనిచేస్తే ఇక అంతే’’.. ఆర్థిక సర్వేలో కీలక విషయాలు..
- వారానికి 55-60 గంటలు పనిచేస్తే ఆరోగ్యంపై ప్రభావం..
- పని గంటల డిబేట్ మధ్య ఎకనామిక్ సర్వేలో కీలక విషయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Working hours: ఇటీవల పలు సంస్థల సీఈఓలు, కీలక అధికారులు ఉద్యోగులు పని గంటలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక ఉద్యోగి వారానికి 70-90 గంటలు పనిచేయలనే వాదన నేపథ్యంలో బడ్జెట్ ముందు కేంద్రం తీసుకువచ్చిన ‘‘ఆర్థిక సర్వే’’ కీలక విషయాలను చెప్పింది. వారానికి 55-60 గంటల కన్నా ఎక్కువ పనిచేయడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుందని పేర్కొంది. పలు అధ్యయనాలను ఉటంకిస్తూ.. డెస్క్ వద్ద ఎక్కువ గంటలు గడపడం వల్ల మానసిక శ్రేయస్సుకు హనికరమని పేర్కొంది. డెస్క్ వద్ద ప్రతీ రోజూ 12 లేదా అంతకన్నా ఎక్కువ గంటలు గడిపే వ్యక్తులు మానసిక పరిస్థితి దెబ్బతింటుందని చెప్పింది.
‘‘ సాధారణంగా పనిగంటలను ఉత్పాదకతకు కొలమానంగా పరిగణిస్తారు. మునుపటి అధ్యయనం వారానికి 55-60 గంటలు దాటితే ప్రతికూల ఆరోగ్య ప్రభావాలకు దారి తీసింది. ’’ అని డబ్ల్యూహెచ్ఓ అధ్యయనం ‘‘వర్క్-రిలేటెడ్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ అండ్ ఇంజురీ’’ ఫలితాలను ఉటంకిస్తూ ఎకనామిక్ సర్వే తెలిపింది. మరో అధ్యయనం అయిన ‘‘సేపియన్ ల్యాబ్స్ సెంటర్ ఫర్ హ్యూమన్ బ్రెయిన్ అండ్ మైండ్’’ డేటాని హైలెట్ చేస్తూ.. డెస్క్ వద్ద ప్రతీ రోజు 12 గంటలు అంతకన్నా ఎక్కువ గడిపే ఉద్యోగుల్లో మానసిక శ్రేయస్సు దెబ్బతింటుంది.’’ అని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా డిప్రెషన్, ఆందోళన కారణంగా ఏటా సుమారు 12 బిలియన్ రోజుల్ని కోల్పోతున్నామని, ఇది 1 ట్రిలియన్ డాలర్లకు సమామని డబ్ల్యూహెచ్ఓ చేసిన ఓ అధ్యయనాన్ని ఎకనామిక్ సర్వే చెప్పింది.
Also Read
Read Also: DeepSeek: ఉద్యోగులెవరూ ‘‘డీప్ సీక్’’ ఇన్స్టాల్ చేసుకోవద్దు.. యూఎస్ కాంగ్రెస్ నిషేధం..
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి పనిగంటలపై తన అభిప్రాయాన్ని వెల్లడించడంతో ఈ వివాదం ప్రారంభమైంది. ఇటీవల ఎల్ అండ్ టీ ఛైర్మన్, ఎండీ ఎస్ ఎన్ సుబ్రహ్మణ్యన్ మాట్లాడుతూ.. ఉద్యోగులు ఇంట్లో కూర్చోకుండా ఆదివారాలు సహా వారానికి 90 గంటలు పనిచేయాలని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఉద్యోగులతో పాటు సాధారణ ప్రజలు కూడా మండిపడ్డారు. తోటి పారిశ్రామిక దిగ్గజాలు కూడా ఆయన వ్యాఖ్యల్ని తప్పుపట్టారు.
మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ.. పని గంటల కన్నా పని నాణ్యత, ఉత్పాదకత ముఖ్యమని చెప్పారు. మరో పారిశ్రామిక దిగ్గజం హర్ష్ గోయెంకా కూడా పనిగంటలు విజయానికి సూచిక కాదని చెప్పారు. బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ మాట్లాడుతూ.. పనిగంటలు ముందు పై స్థాయి నుంచి అమలు చేయాలని సూచించారు. పని నాణ్యత ముఖ్యమని చెప్పారు.
తాజావార్తలు
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
WhatsApp: మెటాకు కేంద్రం షాక్.. కొత్త ఫీచర్ నిలిపివేయాలని ఆదేశం
-
Blood Sugar Test Timing: తిన్న ఎంతసేపటి తర్వాత షుగర్ చెక్ చేయాలి? చాలామంది చేసే పెద్ద తప్పు ఇదే!
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Sanae Takaichi: ఢిల్లీ చేరుకున్న జపాన్ ప్రధాని సనే తకైచి.. 3 రోజులు పర్యటన
ట్రెండింగ్
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!