Narendra Modi : నేను చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నా.. మానసికంగా రాముడికే అంకితమయ్యాను
తెలుగు మీడియా చరిత్రలో తొలిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయోధ్య రామమందిరం 5వందల ఏళ్ల కల, ఆ రోజున మీ భావోద్వేగం ఎలా ఉంది..? అనే ప్రశ్నకు ప్రధాని మోడీ స్పందిస్తూ.. ‘మీరు నా భావోద్వేగానికి సంబంధించిన ప్రశ్న అడిగారు. ఓ రోజు ట్రస్టీలు నా దగ్గరకు వచ్చారు. అంతటి మహత్కార్యానికి సాక్షీభూతంగా నిలవడాన్ని నేను చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నా. నేను నా పరిచయస్తులతో దీనిపై చర్చించాను. ఇది 5వందల ఏళ్ల కల ఇందులో చాలామందికి భాగస్వామ్యం ఉంది. ఇది నా మీద గురుతర బాధ్యతగా భావించాను. నేనొక ప్రధానిగా, రాజకీయ నేతగా ఈ బాధ్యత తీసుకోలేదు. ఓ సామాన్య భక్తుడిగా ఈ దేశ సంస్కృతికి అంకితం అవుతూ ఈ బాధ్యత తీసుకున్నా. మానసికంగా మిగితా అన్ని విషయాలు పక్కన పెట్టేశా.. మానసికంగా రాముడికే అంకితమయ్యాను. అనుష్టానానికి సంబంధించి కొందరు పెద్దలు కొన్ని సలహాలు ఇచ్చారు.
నేను అంతకుమించి చేశాను. ప్రాణపత్రిష్ట సందర్భంగా నేను 11 రోజుల నిష్టతో ఉన్నాను. దక్షిణాదిలోనూ అనేక ఆలయాలు సందర్శించాను. రాముని భక్తిలో పూర్తిగా మమేకమయ్యాను. ప్రాణప్రతిష్ఠ రోజు అయోధ్యలో అడుగుపెట్టినప్పటి నుంచి క్షణక్షణం అలౌకిక భావానికి గురయ్యాను. సరిగ్గా రాముడి ముందు నిలబడి చూస్తుంటే ఆ కళ్లలో మెరుపు, మచ్చలేని ముఖం, చిన్న చిరునవ్వు.. 5వందల ఏళ్ల కల నిజంగా నా కళ్లముందు ప్రత్యక్షమైనట్లు కనిపించింది. ఆ పరిస్థితిని వర్ణించడానికి నా దగ్గర పదాలు లేవు. ఆ కళ్లలో సజీవ వ్యక్తిత్వం కదలాడింది. ఆ కళ్లు నాకేదో సందేశం ఇస్తున్నట్లు అనిపించింది. రాముడికి నాకు మధ్య అడ్డుతెరలు లేని ఏదో బంధం ఏర్పడింది. అప్పుడు నాకు ఏం అనిపించిందో ఎప్పటికీ స్పష్టంగా చెప్పలేను.
Also Read
- House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
- Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
- Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
- IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
నేను మొన్న కూడా మరోసారి వెళ్లాను. కొన్ని కారణాల వల్ల గర్భగుడిలోకి వెళ్లలేకపోయాను. బయటి నుంచే పూజాదికాలు ముగించాను. ఈ సారి కూడా మొదటిసారి కలిగిన అనుభూతే మళ్లీ కలిగింది. అది ఓ రోజు, ఇది ఇంకో రోజు అన్న విషయమే గుర్తు రాలేదు. భక్తి భావంలో నాకు కోరికలేవి ఉండవు. నా మనసు నిండా140 కోట్ల దేశప్రజలే ఉంటారు. వారి సంక్షేమమే కోరుకుంటాను. అక్కడ ట్రస్టీలు నాతో ఓ విషయం చెప్పారు. ఇక్కడకు అనేక మంది భక్తులు వస్తారు. వాళ్లను ఆ స్థంభం నుంచి విడపించడమే కష్టమవుతుందట. అక్కడ వాలంటీర్లకు కూడా భక్తుల భావావేశాన్ని అదుపుచేయడం కష్టమవుతుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!