Narendra Modi : నేను చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నా.. మానసికంగా రాముడికే అంకితమయ్యాను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు మీడియా చరిత్రలో తొలిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయోధ్య రామమందిరం 5వందల ఏళ్ల కల, ఆ రోజున మీ భావోద్వేగం ఎలా ఉంది..? అనే ప్రశ్నకు ప్రధాని మోడీ స్పందిస్తూ.. ‘మీరు నా భావోద్వేగానికి సంబంధించిన ప్రశ్న అడిగారు. ఓ రోజు ట్రస్టీలు నా దగ్గరకు వచ్చారు. అంతటి మహత్కార్యానికి సాక్షీభూతంగా నిలవడాన్ని నేను చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నా. నేను నా పరిచయస్తులతో దీనిపై చర్చించాను. ఇది 5వందల ఏళ్ల కల ఇందులో చాలామందికి భాగస్వామ్యం ఉంది. ఇది నా మీద గురుతర బాధ్యతగా భావించాను. నేనొక ప్రధానిగా, రాజకీయ నేతగా ఈ బాధ్యత తీసుకోలేదు. ఓ సామాన్య భక్తుడిగా ఈ దేశ సంస్కృతికి అంకితం అవుతూ ఈ బాధ్యత తీసుకున్నా. మానసికంగా మిగితా అన్ని విషయాలు పక్కన పెట్టేశా.. మానసికంగా రాముడికే అంకితమయ్యాను. అనుష్టానానికి సంబంధించి కొందరు పెద్దలు కొన్ని సలహాలు ఇచ్చారు.
నేను అంతకుమించి చేశాను. ప్రాణపత్రిష్ట సందర్భంగా నేను 11 రోజుల నిష్టతో ఉన్నాను. దక్షిణాదిలోనూ అనేక ఆలయాలు సందర్శించాను. రాముని భక్తిలో పూర్తిగా మమేకమయ్యాను. ప్రాణప్రతిష్ఠ రోజు అయోధ్యలో అడుగుపెట్టినప్పటి నుంచి క్షణక్షణం అలౌకిక భావానికి గురయ్యాను. సరిగ్గా రాముడి ముందు నిలబడి చూస్తుంటే ఆ కళ్లలో మెరుపు, మచ్చలేని ముఖం, చిన్న చిరునవ్వు.. 5వందల ఏళ్ల కల నిజంగా నా కళ్లముందు ప్రత్యక్షమైనట్లు కనిపించింది. ఆ పరిస్థితిని వర్ణించడానికి నా దగ్గర పదాలు లేవు. ఆ కళ్లలో సజీవ వ్యక్తిత్వం కదలాడింది. ఆ కళ్లు నాకేదో సందేశం ఇస్తున్నట్లు అనిపించింది. రాముడికి నాకు మధ్య అడ్డుతెరలు లేని ఏదో బంధం ఏర్పడింది. అప్పుడు నాకు ఏం అనిపించిందో ఎప్పటికీ స్పష్టంగా చెప్పలేను.
Also Read
- CM Revanth: తెలంగాణ రైజింగ్-2047తో ప్రపంచానికి గేట్వేగా తెలంగాణ.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం విజన్..!
- Team India Schedule: ఐపీఎల్ 2026 ఓవర్.. వాట్ నెక్స్ట్.? 2027 వరల్డ్ కప్ వరకు టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే.!
- TTD Record: రికార్డు స్థాయిలో శ్రీవారి దర్శనం.. టీటీడీ చరిత్రలోనే అరుదైన రికార్డు!
- Visakhapatnam Tragedy: విశాఖలో విషాదం.. చెవి ఆపరేషన్కు ముందు 13 ఏళ్ల బాలిక మృతి!
నేను మొన్న కూడా మరోసారి వెళ్లాను. కొన్ని కారణాల వల్ల గర్భగుడిలోకి వెళ్లలేకపోయాను. బయటి నుంచే పూజాదికాలు ముగించాను. ఈ సారి కూడా మొదటిసారి కలిగిన అనుభూతే మళ్లీ కలిగింది. అది ఓ రోజు, ఇది ఇంకో రోజు అన్న విషయమే గుర్తు రాలేదు. భక్తి భావంలో నాకు కోరికలేవి ఉండవు. నా మనసు నిండా140 కోట్ల దేశప్రజలే ఉంటారు. వారి సంక్షేమమే కోరుకుంటాను. అక్కడ ట్రస్టీలు నాతో ఓ విషయం చెప్పారు. ఇక్కడకు అనేక మంది భక్తులు వస్తారు. వాళ్లను ఆ స్థంభం నుంచి విడపించడమే కష్టమవుతుందట. అక్కడ వాలంటీర్లకు కూడా భక్తుల భావావేశాన్ని అదుపుచేయడం కష్టమవుతుంది.
తాజావార్తలు
-
Airtel: రూ.99కే ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్ ప్లే ప్రీమియం.. 20కి పైగా OTT యాప్లకు యాక్సెస్
-
Venkatesh Iyer: ట్రోలింగ్ నన్ను ప్రభావితం చేసింది.. ఆ మ్యాచ్ నా కెరీర్లో కీలక మలుపు!
-
Kollywood : రూట్ మార్చిన కోలీవుడ్ స్టార్స్.. మళ్లీ కమర్షియల్ జోన్లోకి సూర్య, విక్రమ్, ధనుష్, శివకార్తికేయన్!
-
PM Svanidhi: 55 లక్షల మందికి గుడ్ న్యూస్.. పీఎం స్వనిధి పథకంలో మరిన్ని ప్రయోజనాలు..పూర్తి వివరాలు ఇవే!
-
Trump Tariff Cut: ట్రంప్ కీలక నిర్ణయం.. టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు.. ఈ రంగాలకు ప్రయోజనం
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!