Mallikarjun Kharge: ‘‘ముందస్తు ప్లాన్ ప్రకారమే’’.. నితీష్-బీజేపీ పొత్తుపై కాంగ్రెస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mallikarjun Kharge: సీఎం నితీష్ కుమార్ ఇండియా కూటమిని వదిలి, బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జన ఖర్గే ఆరోపించారు. జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ ఇండియా కూటమిని చీకట్లో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ, జేడీయూ కలిసి ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేయడానికి ప్లాన్ చేశారని ఆదివారం దుయ్యబట్టారు.
‘‘ఇలాంటి నిర్ణయాలు తొందరపడి తీసుకోలేం. ఇదంతా ముందస్తు ప్రణాళికతో జరిగిందని తెలియజేస్తోంది. ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ-జేడీయూ ఇదంతా ప్లాన్ చేసింది. నితీష్ కుమార్ మమ్మల్ని, లాలూ ప్రసాద్ యాదవ్ని చీకట్లో ఉంచాడు’’ అని ఖర్గే అన్నారు.
Also Read
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
- UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
- Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
- Nepal Floods: నేపాల్ జలప్రళయానికి ముందు భూకంపం.. 7 నిమిషాల్లోనే ఫ్లాష్ ఫ్లడ్స్!
Read Also: Google Maps: గూగుల్ తల్లిని నమ్ముకుంటే.. చివరకు కారుని ఎక్కడికి తీసుకెళ్లిందో చూడండి..
లోక్సభ ఎన్నికల ముందు బీజేపీని, ప్రధాని మోడీని ఎదుర్కొనేందుకు నితీష్ కుమార్ ఆధ్వర్యంలోనే ఇండియా కూటమికి రూపకల్పన జరిగింది. తొలి సమావేశం పాట్నాలో నితీష్ నిర్వహించారు. అయితే, అనూహ్యంగా ఇండియా కూటమి, బీహార్లో ఆర్జేడీతో పొత్తును ఉపసంహరించుకున్నాడు. తన పాతమిత్రులు బీజేపీతో కలిసి ఆదివారం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ఒక్కసారిగా ఇండియా కూటమికి ఎదురుదెబ్బ తగిలినట్లైంది.
2000లో ఆర్జేడీ లాలూ ప్రసాద్ యాదవ్ ‘జంగిల్ రాజ్’కి వ్యతిరేకంగా ప్రచారం చేసి తొలిసారిగా నితీష్ కుమార్ సీఎం అయ్యారు. 2013లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోడీని ప్రకటించిన తర్వాత 17 ఏళ్ల పొత్తు తర్వాత నితీష్ ఎన్డీయేతో తెగతెంపులు చేసుకున్నారు. 2017లో ఆర్జేడీ-జేడీయూతో మహాకూటమి ఏర్పాటు చేశారు, తిరిగి మళ్లీ 2019 లోక్సభ ఎన్నికల ముందు బీజేపీతో జట్టుకట్టారు. 2022లో మరోసారి బీజేపీతో బంధాన్ని తెంచుకుని ఆర్జేడీతో పొత్తు పెట్టుకున్నారు. తాజాగా మరోమారు బీజేపీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదల్లో 160 మంది మృతి, 750 మందికి పైగా గల్లంతు
-
NTR Dragon: ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ మూవీ క్రేజీ అప్డేట్.. ఫ్లాష్బ్యాక్లో ఊహించని ట్విస్ట్!
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..