Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్కుమార్పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
- రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు
- నితీష్కుమార్పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
- పోరాటం కొనసాగుతుందని ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ ఎంపీ నితీష్ కుమార్పై మరోసారి జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. మహిళల ఓట్లను రూ.10 వేలతో కొనుగోలు చేసి గెలిచారంటూ ధ్వజమెత్తారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే మహిళల ఓట్లను డబ్బుతో ప్రభావితం చేశారని ఆరోపించారు.
ప్రశాంత్ కిషోర్ మీడియాతో మాట్లాడుతూ.. “బీహార్ ఎన్నికలకు ముందు మహిళలకు రూ.2 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ చివరకు కేవలం రూ.10 వేలే ఇచ్చి వారి ఓట్లను కొనుగోలు చేశారు. మహిళలను ఆకర్షించి వారి ఓట్లను ప్రభావితం చేశారు. ఈ అంశంపై జనసురాజ్ పార్టీ గతంలో కూడా గొంతెత్తింది.. ఇకపై కూడా పోరాడుతూనే ఉంటుంది” అని అన్నారు. అంతేకాకుండా నితీశ్ కుమార్పై వ్యక్తిగతంగా కూడా విమర్శలు గుప్పించారు. “మహిళలకు రూ.2 లక్షల ఆశ చూపించి వారి ఓట్లు పొందిన నితీశ్ కుమార్ ఇప్పుడు ఢిల్లీకి వెళ్లిపోయారు. రాష్ట్ర పాలనను తన పిల్లలు, సన్నిహితులు, అనుచరుల చేతుల్లో పెట్టారు” అని ఆరోపించారు.
Also Read
- Sana Malik: పాకిస్తాన్లోని ఇస్లామిక్ చట్టాన్ని భారత్ లో అమలు చేయాలి.. ఎమ్మెల్యే సనా మాలిక్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Murder: 6 నెలల ప్లానింగ్.. 2004 ఫోన్ కాల్స్, 238 గంటల టాక్ టైమ్.. వణుకు పుట్టిస్తున్న మర్డర్ స్కెచ్..
- PM Modi: వెనెజువెలాకు భారత్ అండ.. సహాయ సహకారాలు అందిస్తామన్న ప్రధాని మోడీ..
- Ayodhya: రామాలయ నిధుల వివాదంలో కొత్త ట్విస్ట్.. PMOకు సైతం లెక్కలు ఇవ్వని రామ్ మందిర్ ట్రస్ట్!
బీహార్లో అధికార పక్షం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని.. ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో పారదర్శక పాలన, ప్రజల సంక్షేమం కోసం జనసురాజ్ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ చేసిన ఈ వ్యాఖ్యలు బీహార్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. అధికార జేడీయూ, ఎన్డీయే కూటమి నేతలు ఈ ఆరోపణలకు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
#WATCH | West Champaran: Prashant Kishor, founder of Jan Suraaj Party, says, "Before the Bihar elections, women were lured with promises of Rs 2 lakh, but given only Rs 10,000 to influence their votes; their votes were bought. Jan Suraaj has raised its voice against this before… pic.twitter.com/mOet6CSbmN
— ANI (@ANI) June 6, 2026
తాజావార్తలు
-
OTT Movies: ఈ వారం ఓటీటీలో అదిరిపోయే తెలుగు, తమిళ సినిమాలు
-
YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
-
iQOO Neo11s: ఐకూ Neo11s వచ్చేస్తోంది.. 8000mAh భారీ బ్యాటరీ, 144Hz 2K డిస్ప్లేతో గేమర్లకు కొత్త పవర్హౌస్!
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
OG Universe : OG – 2 ఊచకోతకు శ్రీకారం చుట్టిన పవర్ స్టార్ – సుజీత్
ట్రెండింగ్
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!
-
ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..