Prashant Kishor: రాజకీయ పార్టీ పెడుతున్న ప్రశాంత్ కిషోర్ .. ‘జన్ సురాజ్ పార్టీ’గా పేరు..
- కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించబోతున్న ప్రశాంత్ కిషోర్..
- బీహార్ వేదికగా ‘జన్ సురాజ్’ పేరుతో కొత్త పార్టీ..
- అక్టోబర్ 2న ప్రారంభం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prashant Kishor: బీహార్ వేదికగా మరో పార్టీ రాబోతోంది. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున ‘జన్ సురాజ్’ పేరుతో పార్టీని స్థాపించబోతున్నట్లు ఆయన ఆదివారం వెల్లడించారు. లక్ష మంది ఆఫీస్ బేరర్లతో తన పార్టీ ప్రారంభం అవుతున్నాని వెల్లడించారు. పాట్నాలోని బాపు సభాఘర్లో జన్ సూరాజ్ ప్రచారం సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 2న పార్టీని ప్రారంభిస్తున్నామని చెప్పారు.
Read Also: Ministry of Finance: విదేశాలకు వెళ్లాలంటే ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్ అవసరమా..?
Also Read
- Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
- TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
- TVK Vijay: న్యాయ నిపుణులతో విజయ్ మంతనాలు.. ప్రభుత్వ ఏర్పాటుపై సమాలోచనలు.. నెక్ట్స్ ప్లాన్ ఇదేనా?
- West Bengal: మమతా బెనర్జీకి గవర్నర్ షాక్.. టీఎంసీ సర్కార్ బర్తరఫ్..
తాను జన్ సురాజ్ పార్టీకి నాయకత్వం వహించనని, పార్టీ సభ్యుల నుంచే నాయకులను ఎన్నుకుంటానని ఆయన చెప్పారు. మెరుగైన విద్య, ఉద్యోగాలు లేదా ఆరోగ్య సంరక్షణ కోసం బీహార్కు చెందిన తరువాతి తరం ప్రజలు రాష్ట్రం వెలుపలకు వెళ్లకుండా ఉండేలా కృషి చేయాలని ప్రశాంత్ కిషోర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాల కోసం మీరు కష్టపడాలని ప్రసంగంలో చెప్పారు. 2025లో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
పార్టీ నాయకత్వం గురించి మాట్లాడుతూ.. ఏడుగురు సభ్యుల కమిటీ ఆగస్టు 15 నుంచి 20 వరకు పార్టీలోని 25 అత్యున్నత పదవులకు ఎన్నికలు నిర్వహిస్తుందని చెప్పారు. ఈ కమిటీలో సమస్తిపూర్ నుంచి డాక్టర్ భూపేంద్ర యాదవ్, బెగుసరాయ్ నుంచి ఆర్ఎన్ సింగ్, రిటైర్డ్ ఐఏఎస్ సురేశ్ శర్మ, సివాన్ నుంచి న్యాయవాది గణేష్ రామ్, తూర్పు చంపారన్ నుంచి డాక్టర్ నసీమ్, భోజ్పూర్ నుంచి రిటైర్డ్ ఐఏఎస్ అరవింద్ సింగ్, ముజఫర్పూర్ నుంచి స్వర్ణలతా సాహ్ని ఉంటారని కిషోర్ తెలిపారు.
తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం