Mohan Bhagwat: 75 ఏళ్లకు రిటైర్ రావాలి, ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలపై వివాదం..
- 75 ఏళ్లకు రిటైర్ కావాలి..
- ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలపై వివాదం..
- ప్రధాని మోడీని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్షాలు..
Mohan Bhagwat: బీజేపీ సైద్ధాంతిక సంస్థ ఆర్ఎస్ఎస్ చీఫ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారాయి. ఇటీవల ఓ కార్యక్రమంలో మోహన్ భగవత్ మాట్లాడుతూ, 75 ఏళ్ల వయసు తర్వాత రిటైర్ కావాలని అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యల్ని ఉపయోగించుకుని కాంగ్రెస్, శివసేన(యూబీటీ) వంటి పార్టీలు బీజేపీని టార్గెట్ చేస్తున్నాయి. ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త మోరోపంత్ పింగలే తన 75వ పుట్టినరోజున చేసిన ప్రసంగాన్ని ప్రస్తావించాయి. అయితే, ఈ వ్యాఖ్యల కేవలం మోరోపంత్ పింగలేను మాత్రమే సూచిస్తున్నాయని, వాటితో మరెవరితో ముడిపెట్టకూడదని ఆర్ఎస్ఎస్ స్పష్టం చేసింది. ప్రతిపక్షాల విమర్శలకు బీజేపీ ఇంకా స్పందించలేదు.
Read Also: Indiramma Canteen : ఇందిరమ్మ క్యాంటీన్లలో అల్పాహారం.. మెనూ అదిరిందిగా
Also Read
- Tamilnadu Assembly Election 2026: సరికొత్త రికార్డు సృష్టించిన తమిళనాడు ఓటర్లు..
- West Bengal Election: 90 కొట్టిన బెంగాల్ ఓటర్లు.. తమిళనాడులో 82 శాతం.. రికార్డ్ స్థాయిలో పోలింగ్..
- TCS Nashik Case: ఛాతి వైపు అసభ్యంగా చూపులు… పిల్లల కోసం మౌల్వీని కలవమని ఒత్తిడి
- USA: డాలర్ కలలు కల్లలు.. అమెరికా నుంచి వెళ్లిపోవాలనుకుంటున్న భారతీయులు..
రెండు రోజుల క్రితం ఇంగ్లీషులో ‘మోరోపంత్ పింగలే: ది ఆర్కిటెక్ట్ ఆఫ్ హిందూ రిసర్జెన్స్’ అనే పుస్తకాన్ని అధికారికంగా ఆవిష్కరించే కార్యక్రమం జరిగింది. పింగలే తన 75 ఏళ్లు నిండిన తర్వాత చేసిన ప్రకటనను మోహన్ భగవత్ ప్రస్తావించారు. ‘‘75 సంవత్సరాల శాలువా మీపై కప్పబడి ఉంటే, మీరు ఒక నిర్దిష్ట వయస్సుకు చేరుకున్నారని, పక్కకు తప్పుకుని ఇతరులను పని చేయనివ్వాలని పింగలే ఒకసారి అన్నారు’’ అని మోహన్ భగవత్ నాగ్పూర్లో అన్నారు. ఇది యువతరం రావడానికి ఒక సంకేతమని ఆయన చెప్పారు.
ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు బీజేపీని ఇరకాటంలో పెడుతున్నాయి. ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తున్నాయి. సెప్టెంబర్ 17, 2025న ప్రధానిమోడీకి 75 ఏళ్లు నిండుతాయి. ఈ నేపథ్యంలో శివసేన ఠాక్రే వర్గం ఎంపీ ప్రియాంకా చతుర్వేది మాట్లాడుతూ.. ఇది స్పష్టమైన సందేశం అని, ఆర్ఎస్ఎస్ బీజేపీ మధ్య ఏం జరుగుతుందో దీని ద్వారా అర్థమవుతుందని అన్నారు. కాంగ్రెస్ నేత జై రాం రమేష్ మాట్లాడుతూ.. ‘‘ఒకే బాణం రెండు లక్ష్యాలు’’ ప్రధాని మోడీతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్కు కూడా ఈ ఏడాదితో 75 ఏళ్లు నిండుతున్నాయని గుర్తు చేశారు.
తాజావార్తలు
-
Tamilnadu Assembly Election 2026: సరికొత్త రికార్డు సృష్టించిన తమిళనాడు ఓటర్లు..
-
Anantapur Honey Trap Case: అనంతపురం హనీ ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్..!
-
West Bengal Election: 90 కొట్టిన బెంగాల్ ఓటర్లు.. తమిళనాడులో 82 శాతం.. రికార్డ్ స్థాయిలో పోలింగ్..
-
TCS Nashik Case: ఛాతి వైపు అసభ్యంగా చూపులు… పిల్లల కోసం మౌల్వీని కలవమని ఒత్తిడి
-
Driver Subrahmanyam Case: మూడు రోజులకే సర్పవరం సీఐపై బదిలీ వేటు..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!