PM Modi: ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల కోటా తగ్గించి మత రిజర్వేషన్లు అమలు చేసేందుకు కాంగ్రెస్ యత్నం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: మత ప్రాతిపదికన కాంగ్రెస్ రిజర్వేషన్ తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోందని, ఇది బాబాసాహెబ్ అంబేద్కర్కి వెన్నుపోటు పొడవడమే అని ప్రధాని నరేంద్రమోడీ బుధవారం కాంగ్రెస్పై మరోసారి విరుచుకుపడ్డారు. అంబేద్కర్ ఇలాంటి చర్యల్ని వ్యతిరేకించారని మోడీ అన్నారు. ఇటువంటి రిజర్వేషన్లను రాజ్యాంగం స్పష్టంగా నిషేధిస్తోందని చెప్పారు. మధ్యప్రదేశ్ లోని సాగర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఓబీసీ కోటాలో ముస్లింలను చేర్చే ప్రతిపాదను తీసుకువచ్చిందని, కాంగ్రెస్ ఓబీసీలకు పెద్ద శతృవుగా మారిందని, మీ భవిష్యత్ తరాలను నాశనం చేసే ఆట ఆడుతోందని దుయ్యబట్టారు.
మతం ఆధారంగా రిజర్వేషన్లను మన రాజ్యాంగంలో స్పష్టంగా నిషేధిస్తుంది, బాబాసాహెబ్ దీనికి వ్యతిరేకమని, కానీ కాంగ్రెస్ దీనికి పూర్తి విరుద్ధంగా ప్రజలను మోసం చేయడానికి ఆట ఆడుతోందని ప్రధాని మోడీ మండిపడ్డారు. 2009, 2014 ఎన్నికల్లో కూడా తమ మేనిఫెస్టోలో మతపరమైన రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని ప్రధాని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల 15 శాతం కోటాని తగ్గించి మతం ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోందని ప్రధాని మోడీ ఆరోపించారు.
Also Read
- Petrol Diesel Purchase: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక వారికి బంకుల్లో నో పెట్రోల్, డీజిల్!
- Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
- Cyber Crime: ఆన్లైన్ డేటింగ్ ఉచ్చులో మహిళా న్యాయమూర్తి.. జడ్జిగారి 'రోమాన్స్ స్కామ్' కథ వింటే నోరెళ్లబెడతారు!
- Air India Plane Crash Anniversary: 260 మంది ప్రాణాలు గాల్లో కలిసిన వేళ.. ఏడాది గడిచినా వీడని సస్పెన్స్?
Read Also: UK Army: రద్దీ రోడ్లపై ఆగకుండా పరుగులు పెట్టిన ఆర్మీ గుర్రాలు.. వీడియో వైరల్..
దేశాన్ని బలహీనపరిచేందుకు కాంగ్రెస్ యత్నిస్తోందని ఆరోపించిన ఆయన.. అయోధ్యలో రామ మందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమ ఆహ్వానాన్ని తిరస్కరించడాన్ని ఉదహరించారు. ‘‘దేశ రాజ్యాంగాన్ని కాంగ్రెస్ ద్వేషిస్తోంది. వారు భారతదేశాన్ని ద్వేషిస్తున్నారు. దేశాన్ని బలహీనపరిచేందుకు అన్ని పనులు చేస్తున్నారు. సమాజంలో పోరాటాన్ని ప్రేరేపించేందుకు కొత్త మార్గాన్ని వెతుకుతున్నారు. అయోధ్యంలో రామమందిర ప్రాణప్రతిష్టం కార్యక్రమంలో కాంగ్రెస్ ఏం చేసిందో దేశం అంతా చూసింది. రాముడు ఊహాత్మక వ్యక్తి అని కాంగ్రెస్ ఆహ్వానాన్ని తిరస్కరించింది’’ అని ప్రధాని అన్నారు.
మరోవైపు శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. కాంగ్రెస్ ఇప్పుడు మరో రహస్య ఎజెండాను ముందుకు తీసుకువచ్చింది. వారసత్వ పన్నులు విధిస్తామని కాంగ్రెస్ అంటుందని, తల్లిదండ్రుల నుంచి పొందే వారసత్వంపై కూడా పన్ను విధిస్తామని కాంగ్రెస్ చెబుతోందని ప్రధాని అన్నారు. మీరు కష్టపడిన సొమ్మును లాక్కునేందుకు కాంగ్రెస్ యత్నిస్తోందని, మీరు మీ పిల్లలకు ఇవ్వాలని కూడబెట్టిన సొమ్మును లాక్కోవాలని ప్రయత్నిస్తోందని, భారత కుటుంబ విలువల గురించి కాంగ్రెస్కి ఏమాత్రం అవగాహన లేదని ఆయన విమర్శించారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: అర్ధరాత్రి 2 గంటలకు గదిలో లేని వైభవ్.. టెన్షన్ పడిపోయిన బుడ్డోడి తల్లి!
-
FIFA World Cup 2026: 16 ఏళ్ల తర్వాత తొలి విజయం.. చెక్ రిపబ్లిక్ పై ‘దక్షిణ కొరియా’ సంచలన విజయం.!
-
Sing Geetham Review : సింగ్ గీతం రివ్యూ.. సింగీతం ప్రయోగం ఎలా ఉందంటే?
-
SPIRIT : ప్రభాస్ కోసం అసలు సిసలైన డ్యూటీ చేస్తున్న సందీప్ రెడ్డి
-
Petrol Diesel Purchase: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక వారికి బంకుల్లో నో పెట్రోల్, డీజిల్!
ట్రెండింగ్
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!