PM Modi: బీజేపీకి 400 సీట్లు ఎందుకు కావాలంటే..? వివరించిన పీఎం మోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: లోక్సభ ఎన్నికల ఏడు దశల్లో ఈ రోజు మూడో దశ ముగిసింది. మరోవైపు పలు రాష్ట్రాల్లో పీఎం మోడీ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 543 ఎంసీ స్థానాల్లో బీజేపీ సొంతగా 370 సీట్లు, ఎన్డీయే కూటమిగా 400+ స్థానాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ‘‘ఆబ్కీ బార్ 400 పార్’’ నినాదంతో కాషాయ పార్టీ ఎన్నికల బరిలో నిలిచింది. అయితే, ఈ నినాదంపై ప్రతిపక్షాలు పలు ఆరోపణలు చేశాయి. బీజేపీకి 400 సీట్లు ఇస్తే వారు రాజ్యాంగాన్ని మార్చేస్తారని, రిజర్వేషన్లు తీసేస్తారని కాంగ్రెస్, ఇతర ఇండియా కూటమి నేతలు ఆరోపిస్తు్న్నారు. అయితే, తమపై ఇండియా కూటమి తప్పుడు ఆరోపణలు చేస్తోందని, ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తోందని, రిజర్వేషన్లు తీసేది లేదని, రాజ్యాంగాన్ని మార్చేది లేదని బీజేపీ స్పష్టం చేసింది.
Read Also: SS Rajamouli: ధోనీ మీద ప్రేమతో ప్రభాస్ ఫేస్ మార్చేశారు.. రాజమౌళి అసక్తికర వ్యాఖ్యలు
Also Read
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
- Woman Litters In Train: రైలు కోచ్లో చెత్త విసిరి, సీటు పక్కనే చేతులు కడిగిన మహిళ.. సివిక్ సెన్స్పై దేశవ్యాప్తంగా చర్చ
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
అయితే, తాము ఎందుకు 400 సీట్లు కావాలనే దానిపై ప్రధాని నరేంద్రమోడీ క్లారిటీ ఇచ్చారు. అయోధ్యంలో రామమందిరానికి కాంగ్రెస్ ‘‘బాబ్రీ తాళం’’ వేయకుండా నిరోధించడానికి ఈ ఎన్నికల్లో 400 సీట్లు గెలుచుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. మధ్యప్రదేశ్ లోని ధార్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేశారు. మోడీకి 400 సీట్లు కావాలి తద్వారా నేను కాంగ్రెస్ మరియు భారత కూటమి యొక్క అన్ని కుట్రలను ఆపగలను. ఆర్టికల్ 370ని కాంగ్రెస్ మళ్లీ తీసుకురాకుండా మోడీకి 400 సీట్లు కావాలి, అయోధ్యలోని రామ మందిరానికి కాంగ్రెస్ బాబ్రీ తాళం వేయకుండా ఉండటానికి మోడీ 400 సీట్లు కావాలి’’ అని అన్నారు.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 400 సీట్లు అవసరమని, దేశంలోని ఖాళీ భూములను, దీవులను కాంగ్రెస్ ఇతర దేశాలకు అప్పగించదని ప్రధాని అన్నారు. ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను కాంగ్రెస్ లాక్కుని తన ఓటు బ్యాంకుకు ఇవ్వకుండా తాను 400 సీట్లను కోరుతున్నానని చెప్పారు. లోక్సభ ఎన్నికలు 7 దశల్లో జరుగుతున్నాయి. ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ 1న ముగియనున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉండనుంది.
తాజావార్తలు
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
SUV Safety: ఎస్యూవీలతో పాదచారులకు ముప్పు.. 8 ఏళ్లలో 3,000కు పైగా మరణాలు!
-
Red Magic Tablet 5 Pro: రెడ్ మ్యాజిక్ టాబ్లెట్ 5 ప్రో వచ్చేస్తోంది.. 8300mAh బ్యాటరీ, 185Hz OLED డిస్ప్లే
-
Animation Universe: టాలీవుడ్లో కొత్త ట్రెండ్.. ‘ఆర్య’ కోసం యానిమేటెడ్ యూనివర్స్ సిద్ధం!
-
Back To Back Releases : మూడు నెలల్లో మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్న స్టార్ హీరో
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!