PM Modi: బీజేపీకి 400 సీట్లు ఎందుకు కావాలంటే..? వివరించిన పీఎం మోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: లోక్సభ ఎన్నికల ఏడు దశల్లో ఈ రోజు మూడో దశ ముగిసింది. మరోవైపు పలు రాష్ట్రాల్లో పీఎం మోడీ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 543 ఎంసీ స్థానాల్లో బీజేపీ సొంతగా 370 సీట్లు, ఎన్డీయే కూటమిగా 400+ స్థానాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ‘‘ఆబ్కీ బార్ 400 పార్’’ నినాదంతో కాషాయ పార్టీ ఎన్నికల బరిలో నిలిచింది. అయితే, ఈ నినాదంపై ప్రతిపక్షాలు పలు ఆరోపణలు చేశాయి. బీజేపీకి 400 సీట్లు ఇస్తే వారు రాజ్యాంగాన్ని మార్చేస్తారని, రిజర్వేషన్లు తీసేస్తారని కాంగ్రెస్, ఇతర ఇండియా కూటమి నేతలు ఆరోపిస్తు్న్నారు. అయితే, తమపై ఇండియా కూటమి తప్పుడు ఆరోపణలు చేస్తోందని, ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తోందని, రిజర్వేషన్లు తీసేది లేదని, రాజ్యాంగాన్ని మార్చేది లేదని బీజేపీ స్పష్టం చేసింది.
Read Also: SS Rajamouli: ధోనీ మీద ప్రేమతో ప్రభాస్ ఫేస్ మార్చేశారు.. రాజమౌళి అసక్తికర వ్యాఖ్యలు
Also Read
- Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
అయితే, తాము ఎందుకు 400 సీట్లు కావాలనే దానిపై ప్రధాని నరేంద్రమోడీ క్లారిటీ ఇచ్చారు. అయోధ్యంలో రామమందిరానికి కాంగ్రెస్ ‘‘బాబ్రీ తాళం’’ వేయకుండా నిరోధించడానికి ఈ ఎన్నికల్లో 400 సీట్లు గెలుచుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. మధ్యప్రదేశ్ లోని ధార్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేశారు. మోడీకి 400 సీట్లు కావాలి తద్వారా నేను కాంగ్రెస్ మరియు భారత కూటమి యొక్క అన్ని కుట్రలను ఆపగలను. ఆర్టికల్ 370ని కాంగ్రెస్ మళ్లీ తీసుకురాకుండా మోడీకి 400 సీట్లు కావాలి, అయోధ్యలోని రామ మందిరానికి కాంగ్రెస్ బాబ్రీ తాళం వేయకుండా ఉండటానికి మోడీ 400 సీట్లు కావాలి’’ అని అన్నారు.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 400 సీట్లు అవసరమని, దేశంలోని ఖాళీ భూములను, దీవులను కాంగ్రెస్ ఇతర దేశాలకు అప్పగించదని ప్రధాని అన్నారు. ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను కాంగ్రెస్ లాక్కుని తన ఓటు బ్యాంకుకు ఇవ్వకుండా తాను 400 సీట్లను కోరుతున్నానని చెప్పారు. లోక్సభ ఎన్నికలు 7 దశల్లో జరుగుతున్నాయి. ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ 1న ముగియనున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉండనుంది.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!