PM Modi: బీజేపీకి 400 సీట్లు ఎందుకు కావాలంటే..? వివరించిన పీఎం మోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: లోక్సభ ఎన్నికల ఏడు దశల్లో ఈ రోజు మూడో దశ ముగిసింది. మరోవైపు పలు రాష్ట్రాల్లో పీఎం మోడీ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 543 ఎంసీ స్థానాల్లో బీజేపీ సొంతగా 370 సీట్లు, ఎన్డీయే కూటమిగా 400+ స్థానాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ‘‘ఆబ్కీ బార్ 400 పార్’’ నినాదంతో కాషాయ పార్టీ ఎన్నికల బరిలో నిలిచింది. అయితే, ఈ నినాదంపై ప్రతిపక్షాలు పలు ఆరోపణలు చేశాయి. బీజేపీకి 400 సీట్లు ఇస్తే వారు రాజ్యాంగాన్ని మార్చేస్తారని, రిజర్వేషన్లు తీసేస్తారని కాంగ్రెస్, ఇతర ఇండియా కూటమి నేతలు ఆరోపిస్తు్న్నారు. అయితే, తమపై ఇండియా కూటమి తప్పుడు ఆరోపణలు చేస్తోందని, ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తోందని, రిజర్వేషన్లు తీసేది లేదని, రాజ్యాంగాన్ని మార్చేది లేదని బీజేపీ స్పష్టం చేసింది.
Read Also: SS Rajamouli: ధోనీ మీద ప్రేమతో ప్రభాస్ ఫేస్ మార్చేశారు.. రాజమౌళి అసక్తికర వ్యాఖ్యలు
Also Read
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
- Putin: మరోసారి భారత్ టూర్కు పుతిన్.. ఎప్పుడంటే..!
- PM Modi: ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రాన్ మ్జోల్తో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
అయితే, తాము ఎందుకు 400 సీట్లు కావాలనే దానిపై ప్రధాని నరేంద్రమోడీ క్లారిటీ ఇచ్చారు. అయోధ్యంలో రామమందిరానికి కాంగ్రెస్ ‘‘బాబ్రీ తాళం’’ వేయకుండా నిరోధించడానికి ఈ ఎన్నికల్లో 400 సీట్లు గెలుచుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. మధ్యప్రదేశ్ లోని ధార్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేశారు. మోడీకి 400 సీట్లు కావాలి తద్వారా నేను కాంగ్రెస్ మరియు భారత కూటమి యొక్క అన్ని కుట్రలను ఆపగలను. ఆర్టికల్ 370ని కాంగ్రెస్ మళ్లీ తీసుకురాకుండా మోడీకి 400 సీట్లు కావాలి, అయోధ్యలోని రామ మందిరానికి కాంగ్రెస్ బాబ్రీ తాళం వేయకుండా ఉండటానికి మోడీ 400 సీట్లు కావాలి’’ అని అన్నారు.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 400 సీట్లు అవసరమని, దేశంలోని ఖాళీ భూములను, దీవులను కాంగ్రెస్ ఇతర దేశాలకు అప్పగించదని ప్రధాని అన్నారు. ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను కాంగ్రెస్ లాక్కుని తన ఓటు బ్యాంకుకు ఇవ్వకుండా తాను 400 సీట్లను కోరుతున్నానని చెప్పారు. లోక్సభ ఎన్నికలు 7 దశల్లో జరుగుతున్నాయి. ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ 1న ముగియనున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉండనుంది.
తాజావార్తలు
-
PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
-
RR vs LSG: ప్లేఆఫ్ స్థానం కోసం రాజస్థాన్.. పరువు కోసం లఖ్నవూ సూపర్ జెయింట్స్.. గెలిచేదెవరో.?
-
Donald Trump : ‘మేక్ అమెరికా క్రిస్టియన్’.. అమెరికా రాజకీయాల్లో కొత్త ట్రెండ్.?
-
Airtel: ఎయిర్టెల్ వినియోగదారులకు అదిరే న్యూస్.. కేవలం రూ.449లకే మరో కొత్త సర్వీస్ అందుబాటులోకి..
-
CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!