PM Modi: నేడు డీజీపీల సదస్సులో ప్రసంగించనున్న ప్రధాని మోడీ
- దేశ భద్రతా వ్యవహారాలపై భువనేశ్వర్లో డీజీపీ-ఐజీపీల సదస్సు..
- ఈ సమావేశంలో పాల్గొననున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ..
- ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదం, తీర ప్రాంత, జాతీయ భద్రతపై చర్చించే ఛాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: దేశ భద్రతా వ్యవహారాలపై ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్లోని లోక్సేవాభవన్ కన్వెన్షన్ సమావేశ మందిరంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న సదస్సు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్ అయింది. దీన్ని కేంద్ర హోం మంత్రి అమిత్షా ఆరంభించారు. ఈ కార్యక్రమంలో జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు అజిత్ దోభాల్ తో పాటు అన్ని రాష్ట్రాల డీజీపీలు, ఐజీలు, ఇంటిలిజెన్స్, కోస్ట్గార్డ్, సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్ శాఖల ఉన్నతాధికారులు సైతం పాల్గొన్నారు. కాగా, ఈ సదస్సులో ఈరోజు ( నవంబర్ 30) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు.
Read Also: Off The Record: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు లేనట్టేనా..?
Also Read
ఇక, ఇటీవల కాలంలో సైబర్ నేరాలు బాగా పెరిగిపోయాయి. మహిళలపై హత్యాచార ఘటనలు క్రమంగా పెరిగాయి. దీంతో బ్రిటిష్ కాలం నాటి చట్టాలను భూస్థాపితం చేసి భారతీయ న్యాయ సంహిత పేరిట కొత్త చట్టాలు తీసుకొచ్చింది భారత ప్రభుత్వం. వీటన్నింటిపై డీజీపీ, ఐజీల సదస్సులో సుధీర్ఘంగా చర్చ కొనసాగనుంది. అయితే, కొన్ని భద్రతా కారణాల రీత్యా ఈ సదస్సుకు మీడియాను దూరం పెట్టారు. దీనిపై అధికారులెవరూ ఎలాంటి వివరణ ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఈరోజు ప్రధాని మోడీ కార్యక్రమంలో పాల్గొన్న తరువాత ఆయన చేసే వ్యాఖ్యలు అధికార ప్రతినిధులు మీడియాకు తెలియజేయనున్నారని సమాచారం. ఇక, భువనేశ్వర్లో వీవీఐపీల తాకిడి దృష్టిలో పెట్టుకున్న పోలీసు యంత్రాంగం అడుగడుగునా భారీ బందోబస్తును మోహరించింది.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?