Waqf Bill: కాంగ్రెస్ ఉంటే పార్లమెంట్ని కూడా “వక్ఫ్” స్వాధీనం చేసుకునేది..
- బీజేపీ అధికారంలోకి రాకుంటే పార్లమెంట్ వక్ఫ్ వశమయ్యేది..
- 123 స్థలాలను కాంగ్రెస్ వక్ఫ్కి కట్టబెట్టింది..
- పార్లమెంట్ని వక్ఫ్ నుంచి మోడీ కాపాడారు..
- కాంగ్రెస్పై నిప్పులు చెరిగిన కిరణ్ రిజిజు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Waqf Bill: చారిత్రాత్మక వక్ఫ్ బిల్లును కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టింది. పార్లమెంటరీ, మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బిల్లును సభ ముందుంచారు. రిజిజు ప్రసంగం ప్రారంభించిన వెంటనే ప్రతిపక్షాలు అడ్డుకోవడానికి ప్రయత్నించాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్పై కేంద్రమంత్రి నిప్పులు చెరిగారు. 2014లో బీజేపీ అధికారంలోకి రాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్, విమానాశ్రయ భూములను వక్ఫ్ ఇచ్చేదని అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంట్ని వక్ఫ్ స్వాధీనం చేసుకోవడాన్ని ఆపేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చట్టానికి చేసిన మార్పులు ఇతర చట్టాల కన్నా అధిక ప్రభావం చూపించినందున వక్ఫ్ బిల్లుకు కొత్త సవరణలు అవసరమని రిజిజు అన్నారు.
Read Also: Waqf Bill: వక్ఫ్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్రం..
Also Read
- UP: రాయ్బరేలీ ఆస్పత్రిలో అమానుషం.. రోగిని కాలుతో తన్నిన సిబ్బంది.. ప్రజలు ఆగ్రహం
- Tamil Nadu: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
- Monsoon Shock: 125 ఏళ్ల తర్వాత ముఖం చాటేసిన వరుణుడు.. ఐదో అత్యంత పొడి జూన్గా రికార్డ్
ఈ బిల్లు వల్ల ముస్లింలకు వచ్చే నష్టమేమీ లేదని, ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న వారు తెలుసుకోవాలని కేంద్రమంత్రి సూచించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలో ఉంటే ఢిల్లీలోని కీలక స్థలాలు వక్ఫ్ సొంతమయ్యేవని అన్నారు. 123 ఆస్తుల్ని కాంగ్రెస్ వక్ఫ్ బోర్డుకు కట్టబెట్టిందని చెప్పారు. వక్ఫ్ చట్టంలోని లోపాలు అనేక ఉల్లంఘనలకు కారణమైందని అన్నారు. ఈ బిల్లు పేద ముస్లింలు, పిల్లలు, మహిళలకు ప్రయోజనాలు చేకూరుస్తుందని, వక్ఫ్ బోర్డు కింద ఆస్తుల నిర్వహణలో జవాబుదారీతనం, పారదర్శకతను నిర్ధారిస్తుందని కిరణ్ రిజిజు వెల్లడించారు.
1970 నుండి ఢిల్లీలో పార్లమెంట్ భవనంతో సహా అనేక ఆస్తులకు సంబంధించిన కేసులు నడుస్తున్నాయని, ఢిల్లీ వక్ఫ్ బోర్డు వీటిని క్లెయిమ్ చేసింది, ఈ కేసు కోర్టులో ఉంది, అప్పటి యూపీఏ ప్రభుత్వం 123 ఆస్తుల్ని డీనోటిఫై చేసి వక్ఫ్ బోర్డుకు ఇచ్చిందని కిరణ్ రిజిజు అన్నారు. ఈ రోజు ఈ బిల్లు ప్రవేశపెట్టకపోతే, మనం కూర్చున్న పార్లమెంట్ కూడా వక్ఫ్ ఆస్తిగా క్లెయిమ్ చేస్తారని అన్నారు. ప్రధాని మోడీ అధికారంలోకి రాకుంటే మిగతా ఆస్తుల్ని కూడా వక్ఫ్ బోర్డుకు అప్పగించేవారని ఆయన చెప్పారు.
తాజావార్తలు
-
Trisha: త్రిష పొలిటికల్ ఎంట్రీ ఫిక్స్? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్!
-
Brahmanandam: బ్రహ్మాజీ పరువు తీసేసిన బ్రహ్మానందం!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Gudivada Amarnath: జగన్ పాదయాత్రతో కూటమికి ‘పాడే యాత్రే’.!
-
Lenin Trailer : అక్కినేని ఫ్యాన్స్కు పూనకాలే.. ‘లెనిన్’ ట్రైలర్లో కరుక్షేత్రం చూశారా?
ట్రెండింగ్
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ