Modi-Khamenei: ఖమేనీ అంత్యక్రియలకు హాజరుకానున్న భారత్.. ఎవరెళ్తున్నారంటే..!
- ఖమేనీ అంత్యక్రియలకు హాజరుకానున్న భారత్
- ముందస్తు షెడ్యూల్ కారణంగా మోడీ గైర్హాజరు
- భారత్ నుంచి ఇద్దరు ప్రతినిధులు హాజరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్, దివంగత నేత అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోడీ గైర్హాజరవుతున్నారు. అంత్యక్రియల సమయంలో ముందస్తు విదేశీ పర్యటనలు ఉండడంతో మోడీ వెళ్లడం లేదు. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనలతో బిజీ షెడ్యూల్ ఉండటంతో మోడీ గైర్హాజరు కానున్నారు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ప్రత్యేకంగా ప్రధాని మోడీని ఆహ్వానించినా.. బిజీ షెడ్యూల్ కారణంగా హాజరుకాలేకపోతున్నారు. అయితే భారత్ నుంచి మోడీ తరపున ఇద్దరు ప్రతినిధులు హాజరుకాబోతున్నారు.
ఇద్దరు ప్రతినిధులు
భారత్ తరఫున బీహార్ గవర్నర్, లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అతా హస్నైన్, విదేశాంగ శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గెరిటా జూలై 4 నుంచి ప్రారంభమయ్యే అధికారిక అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. భారత ప్రభుత్వ ప్రతినిధులుగా ఇరాన్కు వెళ్లనున్నారు.
Also Read
- UN Warns: ముంబై, కోల్కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
- Eknath Shinde: మోడీ అనుకుంటే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ ఖతం.. డిప్యూటీ సీఎం వార్నింగ్..
- High Court: కొడుకు చనిపోయాక అత్తమామలకు కోడలు భరణం ఇవ్వాలా? హైకోర్టు కీలక తీర్పు
- Jeetendra Mishra: ఆపరేషన్ సిందూర్ హీరో.. రామ మందిర కొత్త సీఈఓ జితేంద్ర మిశ్రా ఎవరు.?
ఖమేనీ మరణం అనంతరం భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయాన్ని సందర్శించి సంతాప పుస్తకంలో సంతకం చేశారు. ఇటీవల జరిగిన 40 రోజుల ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ సమయంలో ప్రధాని మోడీ, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తమ ఇరాన్ ప్రత్యర్థులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించారు. ఇటీవలే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ కూడా బ్రిక్స్ సమావేశాల కోసం భారత్కు వచ్చి జైశంకర్, ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. అలాగే ఇరాన్కు చెందిన పలువురు ఉన్నతాధికారులు కూడా ఇటీవలి నెలల్లో భారత్ను సందర్శించడం ద్వారా ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు కొనసాగుతున్నాయి.
ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యారు. చనిపోయి దాదాపు 100 రోజులకు పైగా అయింది. అయితే అంత్యక్రియల సమయంలో మళ్లీ దాడులు జరగవచ్చన్న సంకేతాలు నేపథ్యంలో అప్పుడు నిర్వహించలేదు. ప్రస్తుతం ఇరాన్-అమెరికా మధ్య శాంతి ఒప్పందం జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం పశ్చిమాసియాలో పరిస్థితులు సద్దుమణిగాయి. ఈ నేపథ్యంలో ఖమేనీ అంత్యక్రియలు నిర్వహించాలని ఇరాన్ ప్రభుత్వం ఆలోచించింది. ఈ నేపథ్యంలో జూలై 4 నుంచి వారం రోజుల పాటు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రపంచ నలుమూలల నుంచి దాదాపు 20 కోట్ల వరకు రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఆయా దేశాల నుంచి అతిథులను ఇరాన్ ఆహ్వానించింది. ఇందులో భాగంగా ప్రధాని మోడీని కూడా ఆహ్వానించారు. అయితే ముందస్తు షెడ్యూల్ కారణంగా మోడీ హాజరు కావడం లేదు. ఖమేనీ అంత్యక్రియలకు ఇరాక్, పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్, రష్యా, చైనా, మధ్య ఆసియా దేశాలకు చెందిన ప్రతినిధి బృందాలు కూడా హాజరుకానున్నారు. 2024లో ఇరాన్ మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణించినప్పుడు కూడా భారత్ తరఫున అప్పటి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అధికారిక సంతాప కార్యక్రమాలకు హాజరయ్యారు.
తాజావార్తలు
-
ICC Women’s Champions Trophy 2027: మహిళల క్రికెట్లో కొత్త చరిత్ర.. ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం.. తేదీలు ఖరారు
-
Cyberabad Constable : సోషల్ మీడియాలో పోలీస్ కామెంట్స్.. కానిస్టేబుల్పై సీపీ వేటు
-
UN Warns: ముంబై, కోల్కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
-
CM Chandrababu: 2028 నాటికి 12 ప్రాజెక్టులు పూర్తి.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
-
Eknath Shinde: మోడీ అనుకుంటే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ ఖతం.. డిప్యూటీ సీఎం వార్నింగ్..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!