PM Modi: ప్రధాని మోడీ, ప్రియాంకా గాంధీల మధ్య సరదా సంభాషణ..‘‘మీరు మారిపోయారు’’ అని ఖర్గే కౌంటర్..
- ప్రధాని మోడీ, ప్రియాంకా గాంధీల మధ్య సరదా సంభాషణ..
- ‘‘మీరు మారిపోయారు’’ అంటూ ఖర్గే కౌంటర్.. వైరల్ అవుతున్న వీడియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ఎన్సిపి (ఎస్పి) నాయకురాలు సుప్రియా సూలే కుమార్తె వివాహ విందుకు పలువురు రాజకీయ నాయకులు హాజరయ్యారు. న్యూఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే వంటి వారు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నేతలు తమ రాజకీయ విభేదాలను పక్కన పెట్టి సరదాగా కాసేపు మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ, ప్రియాంకాగాంధీ, ఖర్గేల మధ్య సరదా సంభాషణ జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ ‘‘ప్రియాంకా గాంధీ గారు మీరు ఎలా ఉన్నారు.?’’ అని ప్రశ్నించారు. దీనికి బదులుగా ప్రియాంకాగాంధీ ‘‘నేను బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు?’’ అని అడిగారు. దీనికి మోడీ స్పందిస్తూ.. ‘‘నేను అంతే’’ అంటూ బదులిచ్చారు. ఇదే సమయంలో ఖర్గే చర్చలోకి చేరి ప్రధాని మోడీతో ‘‘సోదరా మీరు కొంచెం మారారు’’ అని అన్నారు. దీనికి ప్రధాని మోడీ స్పందిస్తూ.. ‘‘అచ్చా’’ అని అన్నారు. దీంతో అక్కడ ఉన్న నేతల మధ్య నవ్వులు విరబూశాయి. దీని తర్వాత ప్రధాని మోడీ అందరికి చేతులు జోడించి అభివాదం చేసి అక్కడి నుంచి వెళ్లారు. ఈ సమయంలో రాహుల్ గాంధీ కూడా అక్కడే ఉన్నారు. మోదీ, ఖర్గే మధ్య జరిగిన సంభాషణను విని రాహుల్ కూడా చిరునవ్వుతో కనిపించారు.
Also Read
- Independence Day 2026: యుద్ధాలు.. జనాభా మార్పులు..! మన ముందు తరాలు చూడబోయే భారతావని ఎలా ఉండబోతోంది?
- Amit Shah-Om Birla: లోక్సభ స్పీకర్కు అమిత్ షా లేఖ.. దేనికోసమంటే..!
- NEET Case: నీట్ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై 20 వేల పేజీల ఛార్జ్షీట్
- Kangana Ranaut: ‘‘నక్కగా ఉండే కన్నా కుక్కగా ఉండటం బెటర్’’ నసీరుద్ధీన్ షాపై కంగనా ఫైర్..
ఖర్గే చేసిన ‘మీరు మారిపోయారు’’ అనే వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా డీకోడ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏ సందర్భానుసారం ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారా అని ఆలోచిస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో విద్యార్ధుల నిరసన నేపథ్యంలో ‘‘జెన్ జీ’’ యువతను ఆకట్టుకోవడానికి మోడీ సెల్ఫీ తరహా ఇన్స్టాగ్రామ్ వీడియోలు చేశారు. ఈ ధోరణిపై ఖర్గే అన్నారని భావిస్తున్నారు. మరోవైపు, ఈ కార్యక్రమంలో ఎన్సీసీ ఎస్పీ నేత శరద్ పవార్తో మోడీ మాట్లాడుతూ కనిపించారు. ఎన్సీపీ ఎస్పీకి చెందిన ఎంపీలు ఎన్డీయే కూటమిలో చేరుతారనే వార్తలు వినిపించిన నేపథ్యంలో ఈ కలయిక ఆసక్తికరంగా మారింది.
Modiji interacting with Priyanka G & Kharge ji while RaGa stands there like a lost child! pic.twitter.com/q3JO9uSPkm
— 🦋Anjna🦋 (@SaffronQueen_) August 12, 2026
తాజావార్తలు
-
PM Modi: ప్రధాని మోడీ, ప్రియాంకా గాంధీల మధ్య సరదా సంభాషణ..‘‘మీరు మారిపోయారు’’ అని ఖర్గే కౌంటర్..
-
Independence Day 2026: యుద్ధాలు.. జనాభా మార్పులు..! మన ముందు తరాలు చూడబోయే భారతావని ఎలా ఉండబోతోంది?
-
Vangalapudi Anitha: రోడ్డెక్కడం కాదు.. అసెంబ్లీకి రావాలి.. వైసీపీకి అనిత సూచన
-
Explainer: తమిళ మీడియం కుర్రాడు.. టాటా గ్రూప్ను ఎలా నడిపించారు?
-
Karimnagar : కరీంనగర్లో పొలిటికల్ హీట్.. నేతల అరెస్టులు, వరుస ఘటనలతో టెన్షన్.!
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..