PM Modi: ఈజిప్టు పర్యటనకు బయలుదేరిన ప్రధాని.. 1997 తర్వాత ఇదే తొలిసారి..
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటన ముగిసింది. మూడు రోజలు పాటు ఈయన అమెరికాలో బిజీబీజీగా పర్యటించారు. ఈ రోజు ఆయన ఈజిప్టు పర్యటనకు బయలుదేరారు. రెండు రోజుల పాటు ఆయన ఈజిప్టులో పర్యటించనున్నారు. 1997 తర్వాత తొలిసారిగా భారత ప్రధాని ఈజిప్టు పర్యటనకు వెళ్తున్నారు. ప్రధాని మోడీ ఈజిప్టులో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ ఏడాది గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్ సిసి హాజరయ్యారు. ఆ సమయంలో ప్రధాని మోడీని ఈజిప్టులో పర్యటించాల్సిందిగా కోరారు. అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్ సిసి ఆహ్వానం మేరకు ప్రధాని ఈజిప్టు వెళ్తున్నారు.
Read Also: El Nino: ప్రాణాంతక వైరస్ల ప్రమాదం.. కారణం ఎల్ నినో.. డబ్ల్యూహెచ్ఓ వార్నింగ్
Also Read
ఈ పర్యటనలో ఈజిప్టులోని భారత సంతతిని, ప్రముఖ వ్యక్తులను కలుసుకోవడంతో పాటు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల మరింతగా బలపడేందుకు ప్రధాని మోడీ, ఎల్ సిసితో చర్చలు జరపనున్నారు. కైరోలోని హీలియోపోలిస్ కామన్వెల్త్ వార్ గ్రేవ్ శ్మశానవాటికను ప్రధాని సందర్శిస్తారు, ఇది మొదటి ప్రపంచ యుద్ధంలో ఈజిప్ట్ మరియు పాలస్తీనాలో సేవ చేసి మరణించిన భారతీయ సైన్యానికి చెందిన దాదాపు 4,000 మంది సైనికులకు స్మారక చిహ్నంగా ఉంది. దావూదీ బోహ్రా కమ్యూనిటి సాయంతో పునరుద్ధరించిన 11వ శతాబ్ధపు అల్-హకీమ్ మసీదును కూడా ఆయన సందర్శిస్తారు.
అంతకుముందు ప్రధాని జూన్ 21 నుంచి 23 వరకు అమెరికాలో పర్యటించారు. అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వనం మేరకు ప్రధాని స్టేట్ విజిట్ కు వెళ్లారు. వైట్ హౌజులో బైడెన్ దంపతులు మోడీకి విందు ఇచ్చారు. అమెరికా ఉభయసభల సంయుక్త సమావేశంలో ఆయన ప్రసంగిచారు. ఈ పర్యటనలో భారత్ అమెరికా మధ్య రక్షణ, స్పేస్, టెక్నాలజీ రంగాల్లో పలు ఒప్పందాలు కుదిరాయి. ప్రముఖ చిప్ కంపెనీ మైక్రాన్ భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఒకే చెప్పింది. దీంతో పలు జనరల్ ఎలక్ట్రానిక్స్, గూగుల్ ఇతర ప్రముఖ కంపెనీల సీఈఓలతో మోడీ భేటీ అయ్యారు. భారత కమ్యూనిటీ ప్రజలు ఉద్దేశించి ప్రసంగించారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో