PM Modi: బీజేపీ ప్రభుత్వాల అభివృద్ధిని ఇతరుల పాలనతో పోల్చొద్దు
- బీజేపీ ప్రభుత్వాల అభివృద్ధిని ఇతరుల పాలనతో పోల్చొద్దు
- కెన్-బెట్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు మోడీ శంకుస్థాపన
- ప్రధాని మోడీ బుధవారం మధ్యప్రదేశ్లో పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ ప్రభుత్వాలు చేసిన అభివృద్ధిని ఇతర పార్టీల పాలనతో పోల్చవద్దని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ బుధవారం మధ్యప్రదేశ్లో పర్యటించారు. ఈ సందర్భంగా కెన్-బెట్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి ఖజురహోలో జరిగిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిందని తెలిపారు. ఏడాదిలో జరిగిన అభివృద్ధి కొత్త రూపు సంతరించుకుందన్నారు. రూ.వేల కోట్ల విలువైన కార్యక్రమాలు మొదలయ్యాయని తెలిపారు. నేడు కెన్-బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టు శంకుస్థాపన జరిగిందని చెప్పారు. దేశాభివృద్ధిలో వాజ్పేయ్ కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. సుశాసన్ దినోత్సవం ప్రభుత్వానికి ఒక్కరోజు కార్యక్రమం కాదని.. అది తమ గుర్తింపు అని పేర్కొన్నారు.
దేశ ప్రజలు హ్యాట్రిక్గా కేంద్రంలో ఎన్డీయే సర్కారును ఎన్నుకున్నారని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశంలోని మేధావులు కొన్ని ప్రమాణాలను తీసుకుని.. కాంగ్రెస్, లెఫ్ట్, కుటుంబ, సంకీర్ణ పార్టీల పాలనలో ఏం పనులు జరిగాయి..? బీజేపీ ఉన్న చోట్ల అభివృద్ధి ఎలా జరిగిందో విశ్లేషించాలని కోరారు. బీజేపీ ప్రజల కోసం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రభుత్వ ఫలాలు ప్రజలకు ఎంత వరకు చేరాయి అన్నదే ప్రామాణికం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం అభివృద్ధి ప్రకటనల హడావుడికే పరిమితం అయిందని ధ్వజమెత్తారు.
Also Read
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
కెన్-బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు మోడీ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా 103 మెగావాట్ల జలవిద్యుత్, 27 మెగావాట్ల సౌరశక్తిని ఉత్పత్తి చేయనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 2,000 గ్రామాలకు చెందిన దాదాపు 7.18 లక్షల రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. రైతులకు సాగునీరు పుష్కలంగా అందడంతో పాటు తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు సరిపడా నీరు అందుతుంది. ఈ ప్రాంతం ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందడంతో పాటు టూరిజం కూడా అభివృద్ధి చెంది కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. ప్రాజెక్ట్ కింద పన్నా టైగర్ రిజర్వ్లోని కెన్ నదిపై 77 మీటర్ల ఎత్తు మరియు 2.13 కిలోమీటర్ల పొడవు గల దౌధన్ ఆనకట్ట, రెండు సొరంగాలు నిర్మించనున్నారు.
#WATCH | Khajuraho, Madhya Pradesh | Prime Minister Narendra Modi says "Congress governments ruled the country for a long time. Congress considers government as its birthright but has always been against governance…Congress never thought about solving the water crisis…After… pic.twitter.com/Qo7U1UE16a
— ANI (@ANI) December 25, 2024
తాజావార్తలు
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
-
Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
-
Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
-
Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
-
Telangana High Court : కల్యాణలక్ష్మికి హైకోర్టు షాక్.. రేపే కీలకం.!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!