Modi Israel Visit: ‘‘హిందుత్వం-జియోనిజం’’.. మోడీ ఇజ్రాయిల్ పర్యటనపై ముస్లిం దేశాల మీడియా అక్కసు..
- మోడీ ఇజ్రాయిల్ పర్యటనపై ప్రపంచం ఆసక్తి..
- మోడీ విజిట్పై ముస్లిం దేశాల మీడియా అక్కసు..
- హిందుత్వ-జియోనిజం కలిశాయని విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Modi Israel Visit: భారత ప్రధాని నరేంద్రమోడీ ఇజ్రాయిల్ పర్యటన ప్రపంచదేశాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్, అరబ్ దేశాలలో ఈ పర్యటన పట్ల చాలా ఆసక్తి నెలకొంది. ఇజ్రాయిల్ ప్రధాని మోడీని ఘనంగా స్వాగతించింది. ఇజ్రాయెల్ పార్లమెంట్, నెస్సెట్ను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ఇలా ఒక భారత ప్రధాని ఆ దేశ పార్లమెంట్లో మాట్లాడటం ఇదే మొదటిసారి. ప్రధాని మోడీకి ‘‘మెడల్ ఆఫ్ దిన నెస్సెట్’’ను ఇజ్రాయిల్ బహూకరించింది. రెండు దేశాలు కూడా తమ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నాయి.
అక్టోబర్ 07, 2023న ఇజ్రాయిల్పై హమాస్ చేసిన దాడిని ప్రధాని మోడీ తీవ్రంగా ఖండించారు. ఇజ్రాయిల్ బాధల్లో భారత్ అండగా ఉంటుందని చెప్పారు. యూదు, హిందూ ధర్మాల సారూప్యాన్ని కొనియాడారు. అరబ్ దేశాలతో ఇజ్రాయిల్ చేసుకున్న ‘‘అబ్రహం ఒప్పందాన్ని’’ ప్రధాని ప్రశంసించారు. 2U2 (భారతదేశం-ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్-యుఎఇ),IMEC (భారతదేశం-మధ్యప్రాచ్యం-యూరప్ ఆర్థిక కారిడార్) వంటి వేదికల ద్వారా భారత్-ఇజ్రాయిల్ సహకారాన్ని పెంచుకోవాలని మోడీ పిలుపునిచ్చారు.
Also Read
- India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
- Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
- NEET PG 2026 Exam: నేడే నీట్ పీజీ 2026 ప్రవేశ పరీక్ష.. అభ్యర్థులు ఈ తప్పులు చేయకండి.. కీలక మార్గదర్శకాలు
- Mohan Bhagwat: ‘భారత్లో ముస్లింలు ఉండకూడదనేవారు హిందువులే కాదు’.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
* ఇదిలా ఉంటే.. గల్ఫ్, మిడిల్ ఈస్ట్లోని ఇస్లాం దేశాల మీడియా ప్రధాని మోడీ ఇజ్రాయిల్ పర్యటనపై తమ అక్కసును వెళ్లగక్కాయి. “భారతదేశ ప్రధాని మోడీ నెస్సెట్లో ఇజ్రాయెల్ను బహిరంగంగా ప్రశంసించారు, ఇది గాజా యుద్ధం కారణంగా అంతర్జాతీయ ఒత్తిడిని ఎదుర్కొంటున్న నెతన్యాహుకు ప్రధాన దౌత్య విజయంగా పరిగణించబడుతుంది.” అని టర్కిష్ మీడియా సంస్థ టీఆర్టీ వరల్డ్ నివేదించింది. అంతర్జాతీయ న్యాయస్థానం ప్రకటించిన నేరస్తుడు నెతన్యాహును మోడీ ఆలింగనం చేసుకున్నారు. హమాస్ను ఖండించారు. కానీ గాజా గురించి ప్రస్తావించలేదు. గాజాలో ఇజ్రాయిల్ చేసిన మరణాలు, భారీ నష్టాల గురించి మోడీ మౌనంగా ఉన్నారు’’ అని నివేదించింది.
* ‘‘ఈ పర్యటన భారతదేశ సాంప్రదాయ పాలస్తీనా అనుకూల విధానం నుంచి ఒక ప్రధాన సైద్ధాంతిక మార్పును సూచిస్తుంది. గాజాలో మానవతా సంక్షోభం కన్నా వ్యూహాత్మక లాభాలకే ఎక్కువ ప్రాధాన్తయ ఇచ్చారు. నెతన్యాహూ, మోడీ, ఇద్దరూ జాతీయవాదు, ప్రజాదరణ పొందిన వారు. కాశ్మీర్, పాలస్తీనా, వెస్ట్ బ్యాంక్ వంటి వివాదాలు రెండు దేశాలకు ఉన్నాయి’’ అని అల్ జజీరా కవరేజ్ ఇచ్చింది.
* మిడిల్ ఈస్ట్ ఐ మీడియా.. ‘‘ నెస్సెట్లో మోడీ ప్రసంగం భారత్ దీర్ఘకాలిక విదేశాంగ విధానం నుంచి నిష్క్రమణను సూచిస్తుంది. హిందుత్వ-జియోనిజం మధ్య సైద్ధాంతిక కలయికకు నిదర్శనం’’ అని రాసింది.
* ‘‘ఇజ్రాయిల్ గాజాలో సైనిక కార్యకలాపాలు కొనసాగిస్తు్న్న సమయంలో మోడీకి ఆ దేశ పార్లమెంట్లో స్టాండింగ్ ఒవేషన్ కేవలం లాంఛనప్రాయం కాదు. రాజకీయ సందేశం. యుద్ధ నేరాల ఆరోపణల నేపథ్యంలో మోడీ ఆ దేశానికి వెళ్లడం ద్వారా ఇజ్రాయిల్ పూర్తిగా ఒంటరిగా లేదని సూచిస్తుంది’’ అని పాలస్తీనా క్రానికల్ రాసింది.
* ప్రధాని మోదీ ప్రసంగం గురించి పాకిస్తాన్ వార్తాపత్రిక డాన్ .. “తన ప్రసంగంలో, గాజాలో రెండు సంవత్సరాలకు పైగా జరిగిన యుద్ధంలో మరణించిన వేలాది మంది పాలస్తీనియన్ల గురించి మోడీ ప్రస్తావించలేదు. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం కోసం భారతదేశం చేసే ప్రతి ప్రయత్నానికి మద్దతు ఇస్తుందని ఆయన అన్నారు. ఈ పర్యటనలో ఆయన ఏ పాలస్తీనా నాయకులను కలవలేదు.” అని రాసింది.
తాజావార్తలు
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
Kiara Advani: ‘టాక్సిక్’ తర్వాత కియారా చేతికి బంపర్ ఆఫర్.. పదేళ్ల తర్వాత వస్తున్న సీక్వెల్లో ఛాన్స్?
-
Bank Holidays September 2026: సెప్టెంబర్ 2026 బ్యాంక్ సెలవులు ఇవే.. బ్యాంకుకు వెళ్లే ముందు లిస్ట్ చెక్ చేయండి
-
Tirupati: శేషాచలం అడవుల్లో రెండుగా విడిపోయిన ఏనుగుల గుంపు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
-
Toxic Flop : యశ్ చేసిన తప్పే ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేశ్, ప్రభాస్ చేస్తున్నారా?
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!