Tirupati: శేషాచలం అడవుల్లో రెండుగా విడిపోయిన ఏనుగుల గుంపు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirupati Elephant Alert: తిరుపతి శేషాచలం అటవీ ప్రాంతంలో ఏనుగుల కదలికలు కలకలం రేపుతున్నాయి. ఏనుగుల మంద రెండుగా విడిపోవడంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఓ గుంపు చంద్రగిరి వైపు కదులుతుండగా.. మరో గుంపు తిరుమల వైపు పయనిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. భాకరాపేట, దిగువూరు వైపు నుంచి సుమారు 13 ఏనుగులతో కూడిన మంద చంద్రగిరి దిశగా కదులుతోంది. మరో 22 ఏనుగులు అటవీ మార్గంలో తిరుమల వైపు వెళ్తున్నాయి. దీంతో ఏనుగుల సంచార మార్గాలకు సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఏనుగుల కదలికలను అటవీ శాఖ అధికారులు అత్యాధునిక డ్రోన్ కెమెరాల సహాయంతో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఏనుగుల గుంపులు ఏ ప్రాంతంలో ఉన్నాయి?.. వాటి కదలికలు ఏ దిశగా సాగుతున్నాయి?.. అనే అంశాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైన చర్యలకు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా భీమవరం, చిన్న రామాపురం, కొండ్రెడ్డి కండ్రిగ గ్రామాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ హెచ్చరించింది. అనవసరంగా అటవీ ప్రాంతాల్లోకి వెళ్లవద్దని, ఒంటరిగా అడవి మార్గాల్లో సంచరించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
Also Read
- Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
- Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
- మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో 'కాజూ కట్లీ' తయారీ చేయండి ఇలా.!
- Asim Munir: పాకిస్థాన్ మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతోందా? ఆయుధ కర్మాగారాన్ని సందర్శించిన మునీర్..
ఏనుగుల సంచారం కనిపించినప్పుడు వాటికి దగ్గరగా వెళ్లడం, వాటిని తరిమే ప్రయత్నం చేయడం లేదా ఫొటోలు, వీడియోల కోసం సమీపించడం వంటి చర్యలకు పాల్పడవద్దని అధికారులు స్పష్టం చేశారు. ఏనుగులు కనిపిస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ప్రస్తుతం డ్రోన్ల ద్వారా ఏనుగుల గుంపుల కదలికలను నిశితంగా పరిశీలిస్తున్న అధికారులు.. వాటి సంచారం వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. గ్రామాల ప్రజలు అటవీ శాఖ సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Tirupati: శేషాచలం అడవుల్లో రెండుగా విడిపోయిన ఏనుగుల గుంపు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
-
Toxic Flop : యశ్ చేసిన తప్పే ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేశ్, ప్రభాస్ చేస్తున్నారా?
-
September 1, 2026 New Rules: సెప్టెంబర్ 2026 నుంచి కీలక మార్పులు.. ITR, LPG e-KYC, FD రూల్స్ వరకు పూర్తి లిస్ట్ ఇదే
-
Asia Cup 2026: పాకిస్థాన్తో హ్యాండ్షేక్ ఉంటుందా?.. టీమిండియా కోచ్ ఏం చెప్పాడంటే?
-
King100: నాగార్జున ‘కింగ్ 100’లో మరో స్టార్ హీరోయిన్.. ఐశ్వర్య రాజేష్ ఎంట్రీ కన్ఫర్మ్!
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!