PM Modi: రేపటి నుంచే బీహార్లో మోడీ ఎన్నికల ప్రచారం.. ఎక్కడ నుంచంటే..!
- రేపటి నుంచే బీహార్లో మోడీ ఎన్నికల ప్రచారం
- భారతరత్న గ్రహిత గ్రామం నుంచి ప్రచారం ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ శుక్రవారం బీహార్లో ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. రాష్ట్రంలో పలుచోట్ల ఎన్నికల ర్యాలీలు నిర్వహించనున్నారు. అయితే ఎన్నికల ప్రచారాన్ని దివంగత మాజీ ముఖ్యమంత్రి, భారతరత్న కర్పూరి ఠాకూర్ గ్రామం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. సమస్తిపూర్లో భారతరత్న కర్పూరి ఠాకూర్కు మోడీ నివాళులర్పించనున్నారు. అనంతరం సమస్తిపూర్, బెగుసరాయ్ల్లో ఎన్నికల ర్యాలీలు చేపట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ వెల్లడించారు.
కర్పూరి ఠాకూర్ కుమారుడు, కేంద్ర మంత్రి, జేడీయూ నేత రామ్నాథ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ పర్యటన ఆకస్మిక ప్రణాళిక అని.. ఇది ఎన్నికలకు ఉత్సాహాన్ని ఇస్తుందని అన్నారు. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా మోడీ ర్యాలీలు ఉంటాయని తెలిపారు.
Also Read
కర్పూరి ఠాకూర్కు గత సంవత్సరం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న లభించింది. ఆయన మరణించిన 35 సంవత్సరాల ఈ పురస్కరం లభిచింది. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు ఈ అవార్డు లభించింది. కర్పూరి ఠాకూర్ ఫిబ్రవరి 17, 1988న మరణించారు.
కర్పూరి ఠాకూర్ ఎవరు?
‘జన్నాయక్’ లేదా పీపుల్స్ లీడర్గా ఠాకూర్ పేరు సంపాదించారు. నాయి (బార్బర్) వర్గానికి చెందిన ఒక చిన్నకారు రైతు కుమారుడు. రెండుసార్లు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. డిసెంబర్ 1970- జూన్ 1971 మధ్య భారతీయ క్రాంతి దళ్లో భాగంగా సీఎంగా పని చేశారు. డిసెంబర్ 1977-ఏప్రిల్ 1979 మధ్య జనతా పార్టీ తరపున ముఖ్యమంత్రిగా పని చేశారు. 1978లో ప్రభుత్వ సేవల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించడం ద్వారా అత్యంత వెనుకబడిన తరగతుల (ఇబీసీలు) (ముస్లింలలోని బలహీన వర్గాలతో సహా) వర్గాన్ని తగ్గించడంలో ఠాకూర్ కీలక పాత్ర పోషించారు. మెట్రిక్యులేషన్ పరీక్షలకు తప్పనిసరి సబ్జెక్టుగా ఇంగ్లీషును తొలగించడం. మద్యపాన నిషేధానికి కూడా ఠాకూర్ ప్రసిద్ధి చెందారు. ఠాకూర్ ప్రజలచే ప్రేమించబడటమే కాకుండా ప్రతిపక్షాలచే కూడా గౌరవింపబడ్డారు.
కర్పురి గ్రామమే ఎందుకు ముఖ్యమైనది?
2022లో నిర్వహించిన కుల గణన ప్రకారం రాష్ట్ర జనాభాలో ఈబీసీలు 36 శాతం ఉన్నారు. EBCలకు తరచుగా విద్య, రాజకీయ ప్రాతినిధ్యం, ఆర్థిక అవకాశం, ప్రాథమిక సామాజిక సేవలు అందుబాటులో ఉండవు. EBCలు SC లేదా ST లాగా ప్రత్యేక రాజ్యాంగ వర్గం కాదు. వారు సాధారణంగా OBC (ఇతర వెనుకబడిన తరగతులు) వర్గంలోని ఉప సమూహం. OBCలలో అత్యంత అణగారిన కులాలను గుర్తించడానికి ఇది సృష్టించబడింది. కర్పూరి గ్రామంంలో ఈబీసీలు ఎక్కువగా ఉండడంతో మోడీ ఈ గ్రామాన్ని ఎంచుకున్నారు.
ఇది కూాడా చదవండి: Bihar Elections: బీహార్ ఇండియా కూటమి సీఎం అభ్యర్థి ప్రకటన.. ఎవరంటే..!
తాజావార్తలు
-
Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే!
-
Virat Kohli Anushka: లండన్లో ఉన్నా భారత్లో పెట్టుబడులు.. మరో లగ్జరీ ఇల్లు సొంతం చేసుకున్న విరాట్, అనుష్క
-
Justin Greaves: టెస్ట్ చరిత్రలో అరుదైన రికార్డు.. ఒక్క పరుగు ఇవ్వకుండా 5 వికెట్లు నేలకూల్చిన వెస్టిండీస్ పేసర్.!
-
Sharmila Dhankhar: పోలియోను జయించి చరిత్ర సృష్టించిన షర్మిలా ధన్ఖర్.. పారా షాట్పుట్లో స్వర్ణం
-
Pavala Shyamala: టాలీవుడ్ లో విషాదం.. సీనియర్ నటి కన్నుమూత..!
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!