Bihar Elections: బీహార్ ఇండియా కూటమి సీఎం అభ్యర్థి ప్రకటన.. ఎవరంటే..!
- బీహార్ ఇండియా కూటమి సీఎం అభ్యర్థి ప్రకటన
- అధికారికంగా ప్రకటించిన అశోక్ గెహ్లాట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొత్తానికి ఇండియా కూటమిలో నెలకొన్న రాజకీయ సంక్షోభం సమిసిపోయింది. విభేదాలు పక్కన పెట్టి ఐక్యతా రాగం పలికాయి. తాజాగా బీహార్ మహాఘట్బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ పేరును అధికారికంగా ఇండియా కూటమి పార్టీలు సంయుక్త ప్రెస్మీట్ నిర్వహించి ప్రకటించాయి. తేజస్వి యాదవ్తో కలిసి అశోక్ గెహ్లోట్ విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తేజస్వి యాదవ్ పేరును అధికారికంగా వెల్లడించారు. ఇక డిప్యూటీ సీఎం అభ్యర్థిగా వికాస్షీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) చీఫ్ ముఖేష్ సహానీని ప్రకటించారు.

Also Read
- PM Kisan 23th Installment Update: పీఎం కిసాన్ 23వ విడత.. రైతుల ఖాతాల్లో రూ. 2,000 ఎప్పుడు జమ అవుతాయంటే?
- PM Modi: విదేశీ ప్రయాణాలపై పన్ను విధింపులంటూ వార్తలు.. ప్రధాని మోడీ కీలక ప్రకటన
- Dubai: విమానంలో ఫోటోలు తీస్తే 10 ఏళ్ల జైలా? దుబాయ్ కోర్టు సంచలన తీర్పు..
- Quadruplet Delivery: అరుదైన ఘటన.. 5 రోజుల వ్యవధిలో నలుగురు శిశువులకు జన్మనిచ్చిన మహిళ
బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందు వరకు ఇండియా కూటమి ఏకంగానే ఉంది. అయితే సీట్ల పంపకాల విషయంలో తేడా రావడంతో చివరి నిమిషంలో ఎవరి దారి వారిదే అన్నట్టుగా విడివిడిగా నామినేషన్లు వేశారు. దీంతో అధికారంలోకి వద్దామనుకున్న కూటమి ఆశలు గల్లంతయ్యాయి. మరోవైపు విపక్ష కూటమి బలహీనతను అధికార కూటమి క్యాష్ చేసుకుంటోంది. మరోసారి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ప్రణాళికలు వేసుకుంటోంది. దీంతో కాంగ్రెస్ అప్రమత్తం అయింది. సీనియర్ నాయకుడు. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ను రంగంలోకి దింపింది. అంతే హుటాహుటినా అశోక్ గెహ్లాట్ పాట్నాలో వాలిపోయారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఇంట్లో ఇండియా కూటమి పార్టీలతో చర్చలు జరిపారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ను ఏక కంఠంతో అంగీకారం తెలిపాయి. దీంతో కూటమిలో నెలకొన్న సంక్షోభం ఒక్కసారిగా పటాపంచలు అయింది. గురువారం అధికారికంగా తేజస్వి యాదవ్ పేరును ప్రకటించారు.
ఇక ఎన్నికల్లో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కీలక హామీలు కుమ్మరించారు. ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. అలాగే జీవికా దీదీలకు నెలకు రూ.30,000 జీతం ఇస్తామని వెల్లడించారు. పర్మినెంట్ చేయడంతో పాటు రుణాలు కూడా ఇస్తామని తెలిపారు.
బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి.
ఇది కూడా చదవండి: Modi vs Congress: ట్రంప్ను కలవలేకే సదస్సుకు మోడీ దూరం.. కాంగ్రెస్ విమర్శ
#WATCH | #BiharElection2025 | After announcing Tejashwi Yadav as the CM face of Mahagathbandhan, senior Congress leader Ashok Gehlot says, "Naturally, it was going to be Tejashwi's name…Rahul Gandhi and everyone else had his name on their minds…that Tejashwi Yadav will be our… pic.twitter.com/0hgCoTq4ho
— ANI (@ANI) October 23, 2025
#WATCH | #BiharElection2025 | "Tejashwi khud Bihar sarkaar nahi chalaega balki poora Bihar milkar Bihar sarkaar chalane ka kaam karega. Tejashwi CM banega toh saath mein sabhi Bihar ke log CM banenge…" says RJD leader and Mahagathbandhan's CM face, Tejashwi Yadav pic.twitter.com/QTS3Mr4ENh
— ANI (@ANI) October 23, 2025
తాజావార్తలు
-
Moto G37 Power, Moto G37: మోటో జి37 పవర్, మోటో జి37 రిలీజ్ డేట్ ఫిక్స్.. డైమెన్సిటీ 6400, 7,000mAh భారీ బ్యాటరీ
-
Ragi Ambali Recipe: పాల కంటే 3 రెట్లు ఎక్కువ కాల్షియం.. శరీరాన్ని కూల్గా ఉంచే రాగి అంబలి తయారి విధానం ఇలా..
-
Peddi : ‘పెద్ది’ కోసం జాన్వీ రిస్క్..
-
Best Flour for Roti: ఏ పిండి రొట్టె ఆరోగ్యానికి మంచిది..? గోధుమ, రాగి, జొన్నల్లో సరైన ఎంపిక ఏది..?
-
Ramcharan : రామ్ చరణ్ చేతికి గాయం?..అసలు ఏమైంది?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..