PM Modi: గత ఢిల్లీ పాలకులు ఈశాన్య రాష్ట్రాలను పట్టించుకోలేదు
- గత ఢిల్లీ పాలకులు ఈశాన్య రాష్ట్రాలను పట్టించుకోలేదు
- కాంగ్రెస్ మనస్తత్వం కారణంగానే ఇలా జరిగిందన్న మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత ఢిల్లీ పాలకులు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిని పట్టించుకోలేదని ప్రధాని మోడీ విమర్శించారు. మోడీ సోమవారం అరుణాచల్ప్రదేశ్లో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఇటానగర్ సభలో మోడీ ప్రసంగించారు. సూర్యకిరణాలు ముందుగా పడే ప్రదేశం అరుణాచల్ ప్రదేశ్ అయినప్పటికీ.. వేగవంతమైన అభివృద్ధి కిరణాలు చేరుకోవడానికి చాలా దశాబ్దాలు పట్టిందని తెలిపారు. ఢిల్లీ నుంచి దేశాన్ని నడిపిన నాయకులు అరుణాచల్ అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ మనస్తత్వం కారణంగానే అరుణాచల్తో పాటు ఈశాన్య ప్రాంతాలకు తీవ్రమైన హాని జరిగిందన్నారు.
ఇది కూడా చదవండి: Supreme Court: దురదృష్టకరం.. ఎయిరిండియా ప్రమాద కథనాలపై సుప్రీంకోర్టు వ్యాఖ్య
Also Read
- Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
- Tamil Nadu: "విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?" అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
- Tamil Nadu: "తమిళం నేర్పలేనిది క్రైస్తవ మతం నేర్పింది".. విజయ్ మంత్రి వ్యాఖ్యల కలకలం..
- FCRA Amendment Bill: FCRA బిల్లును JPCకి పంపనున్న మోదీ సర్కార్?
2014లో తనకు దేశానికి సేవ చేసే అవకాశం లభించిందని.. ఆ సమయంలోనే దేశాన్ని కాంగ్రెస్ మనస్తత్వం నుంచి విముక్తి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన అరుణాచల్ ప్రదేశ్.. 2014 నుంచి తమ పాలనలో అభివృద్ధి ప్రాధాన్యతా కేంద్రంగా మారిందని తెలిపారు. ఇక్కడ కాంగ్రెస్కు రెండు లోక్సభ స్థానాలు ఉండడంతోనే పెద్దగా పట్టించుకోలేదనుకుంటా? అని విమర్శించారు. ఇప్పుడు ఈశాన్య ప్రాంతం భారతదేశ శక్తి కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు.
ఇది కూడా చదవండి: Nitin Gadkari: బ్రాహ్మణులకు రిజర్వేషన్లు లేకపోవడం దేవుడు నాకిచ్చిన అతిపెద్ద వరం
అరుణాచల్ప్రదేశ్లో జలవిద్యుత్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. హియో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ (240 మెగావాట్లు), టాటో-ఐ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ (186 మెగావాట్లు) ప్రాజెక్ట్లకు శంకుస్థాపన చేశారు. మొత్తం రూ. 3,700 కోట్లకు పైగా పెట్టుబడితో ఈ ప్రాజెక్ట్లు చేపట్టనున్నారు. ఇక తవాంగ్లో 9,820 అడుగుల ఎత్తులో అత్యాధునిక కన్వెన్షన్ సెంటర్కు శంకుస్థాపన చేశారు. 1,500 మందికి పైగా అతిథులు కూర్చునే సామర్థ్యం ఉంటుంది.
VIDEO | Arunachal Pradesh: PM Modi (@narendramodi) takes a jibe on Congress. He says, “Although Arunachal Pradesh is where the sun’s rays fall first, it took several decades for the rays of rapid development to reach here… Those who were running the country from Delhi at that… pic.twitter.com/GiifBj7Tnh
— Press Trust of India (@PTI_News) September 22, 2025
The North East is fast emerging as India's powerhouse. Speaking at the launch of projects related to energy, connectivity and healthcare in Itanagar, Arunachal Pradesh. https://t.co/SIrXM5eumI
— Narendra Modi (@narendramodi) September 22, 2025
తాజావార్తలు
-
KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
-
Liquor Policy: మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..
-
M.S Raju : ఎన్టీఆర్ చికెన్ కామెంట్స్ పై ఎం.ఎస్ రాజు వివరణ.. నాకు ఎంతో స్పూర్తి!
-
M.S Raju : ‘అగధ’ కంటెంట్ చూసి ‘ఈ సారి కొడుతున్నారు సార్’ అని మహేష్, ‘కొడుతున్నావ్ బావ’ అని ప్రభాస్ అన్నారు!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..