PM Modi: గత ఢిల్లీ పాలకులు ఈశాన్య రాష్ట్రాలను పట్టించుకోలేదు
- గత ఢిల్లీ పాలకులు ఈశాన్య రాష్ట్రాలను పట్టించుకోలేదు
- కాంగ్రెస్ మనస్తత్వం కారణంగానే ఇలా జరిగిందన్న మోడీ
గత ఢిల్లీ పాలకులు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిని పట్టించుకోలేదని ప్రధాని మోడీ విమర్శించారు. మోడీ సోమవారం అరుణాచల్ప్రదేశ్లో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఇటానగర్ సభలో మోడీ ప్రసంగించారు. సూర్యకిరణాలు ముందుగా పడే ప్రదేశం అరుణాచల్ ప్రదేశ్ అయినప్పటికీ.. వేగవంతమైన అభివృద్ధి కిరణాలు చేరుకోవడానికి చాలా దశాబ్దాలు పట్టిందని తెలిపారు. ఢిల్లీ నుంచి దేశాన్ని నడిపిన నాయకులు అరుణాచల్ అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ మనస్తత్వం కారణంగానే అరుణాచల్తో పాటు ఈశాన్య ప్రాంతాలకు తీవ్రమైన హాని జరిగిందన్నారు.
ఇది కూడా చదవండి: Supreme Court: దురదృష్టకరం.. ఎయిరిండియా ప్రమాద కథనాలపై సుప్రీంకోర్టు వ్యాఖ్య
Also Read
- May 1st Labor Day: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం.. ఈరోజే ఎందుకు.. పూర్తి వివరాలు
- West Bengal Elections 2026: ఫలితాలకు ముందే రణరంగా మారిన బెంగాల్.. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర దీదీ ధర్నా..
- Mamata Banerjee: బీహార్, మహారాష్ట్ర కాదు.. ఇది బెంగాల్.. ఎన్నికల సంఘంపై మమతా బెనర్జీ విమర్శలు
- West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
2014లో తనకు దేశానికి సేవ చేసే అవకాశం లభించిందని.. ఆ సమయంలోనే దేశాన్ని కాంగ్రెస్ మనస్తత్వం నుంచి విముక్తి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన అరుణాచల్ ప్రదేశ్.. 2014 నుంచి తమ పాలనలో అభివృద్ధి ప్రాధాన్యతా కేంద్రంగా మారిందని తెలిపారు. ఇక్కడ కాంగ్రెస్కు రెండు లోక్సభ స్థానాలు ఉండడంతోనే పెద్దగా పట్టించుకోలేదనుకుంటా? అని విమర్శించారు. ఇప్పుడు ఈశాన్య ప్రాంతం భారతదేశ శక్తి కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు.
ఇది కూడా చదవండి: Nitin Gadkari: బ్రాహ్మణులకు రిజర్వేషన్లు లేకపోవడం దేవుడు నాకిచ్చిన అతిపెద్ద వరం
అరుణాచల్ప్రదేశ్లో జలవిద్యుత్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. హియో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ (240 మెగావాట్లు), టాటో-ఐ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ (186 మెగావాట్లు) ప్రాజెక్ట్లకు శంకుస్థాపన చేశారు. మొత్తం రూ. 3,700 కోట్లకు పైగా పెట్టుబడితో ఈ ప్రాజెక్ట్లు చేపట్టనున్నారు. ఇక తవాంగ్లో 9,820 అడుగుల ఎత్తులో అత్యాధునిక కన్వెన్షన్ సెంటర్కు శంకుస్థాపన చేశారు. 1,500 మందికి పైగా అతిథులు కూర్చునే సామర్థ్యం ఉంటుంది.
VIDEO | Arunachal Pradesh: PM Modi (@narendramodi) takes a jibe on Congress. He says, “Although Arunachal Pradesh is where the sun’s rays fall first, it took several decades for the rays of rapid development to reach here… Those who were running the country from Delhi at that… pic.twitter.com/GiifBj7Tnh
— Press Trust of India (@PTI_News) September 22, 2025
The North East is fast emerging as India's powerhouse. Speaking at the launch of projects related to energy, connectivity and healthcare in Itanagar, Arunachal Pradesh. https://t.co/SIrXM5eumI
— Narendra Modi (@narendramodi) September 22, 2025
తాజావార్తలు
-
May 1st Labor Day: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం.. ఈరోజే ఎందుకు.. పూర్తి వివరాలు
-
PEDDI Press Meet : ‘పెద్ది’ షూటింగ్ ఫినిష్.. నేడు మేకర్స్ భారీ ప్రెస్ మీట్.. రిలీజ్ డేట్ ఛేంజ్
-
Virat Kohli: అంపైర్లతో విరాట్ కోహ్లీ వాగ్వాదం.. కింగ్ ఆగ్రహం సరైందేనా?, నిబంధనలు ఏమంటున్నాయి?
-
West Bengal Elections 2026: ఫలితాలకు ముందే రణరంగా మారిన బెంగాల్.. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర దీదీ ధర్నా..
-
TTD Laddu Report: తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక.. కీలక అంశాలు వెలుగులోకి తెచ్చిన ఏక సభ్య కమిటీ..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!