PM Kisan Tractor Yojana: కేంద్రం అద్భుత స్కీం.. రైతులకు సగం ధరకే ట్రాక్టర్లు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Kisan Tractor Yojana: రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎన్నో అద్భుతమైన పథకాలను తీసుకొచ్చింది. వివిధ మార్గాల్లో మద్దతునిస్తుంది మరియు అన్నదాతకు భరోసాను అందిస్తుంది. కానీ గతంతో పోలిస్తే వ్యవసాయంలో ఆధునికీకరణ, పెరుగుతున్న సాంకేతికత కారణంగా సాగుకు యంత్రాల వినియోగం విపరీతంగా పెరగడాన్ని మనం గమనించవచ్చు. వ్యవసాయంలో రైతులకు మద్దతు ఇచ్చే ప్రధాన యంత్రాలలో ట్రాక్టర్ ఒకటి. దున్నడం నుంచి అనేక అవసరాలకు ట్రాక్టర్ అవసరం. అయితే దీన్ని కొనుగోలు చేయడం రైతులకు భారంగానే ఉంది. లక్షల రూపాయలు వెచ్చించి ట్రాక్టర్ కొనాలంటే… భయపడుతున్నారు. అలాంటి రైతులకు కేంద్రం కూడా అండగా నిలుస్తోంది. రైతులు ట్రాక్టర్ను సగం ధరకే సొంతం చేసుకునేలా కేంద్ర ప్రభుత్వం పథకాన్ని అమలు చేస్తోంది. ఇది ప్రధాన మంత్రి ట్రాక్టర్ యోజన. ఈ పథకం ఏమిటి? దాని కోసం ఎలా దరఖాస్తు చేయాలి? ఏ పత్రాలు అవసరం? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Read alsdo: PM Kisan Tractor Yojana: కేంద్రం అద్భుత స్కీం.. రైతులకు సగం ధరకే ట్రాక్టర్లు..!
Also Read
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
- India Rank: ప్రపంచ టాప్-5 సైనిక శక్తుల్లో భారత్.. భారీగా అణ్వాయుధాలు, రక్షణ వ్యయం..
రైతులకు తక్కువ ధరకు వ్యవసాయ పనిముట్లను అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ట్రాక్టర్ యోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకంలో భాగంగా, రైతులు ట్రాక్టర్ను 50 శాతం తక్కువ ధరకు (సబ్సిడీ) కొనుగోలు చేయవచ్చు. ట్రాక్టర్ను సగం ధర చెల్లించి కొనుగోలు చేసేందుకు కేంద్రం అవకాశం కల్పిస్తోంది. ఈ పథకానికి ఆయా రాష్ట్రాలు నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తాయి. భారతదేశంలోని ప్రతి చిన్న మరియు సన్నకారు రైతు ప్రధాన మంత్రి ట్రాక్టర్ యోజన పథకానికి అర్హులు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే రైతు వయస్సు 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలి. సొంత పొలం లేకపోయినా పర్వాలేదు.. కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తిస్తుందని గుర్తుంచుకోవాలి. కౌలు రైతులు.. యజమాని నుంచి ఎన్ ఓసీ తీసుకోవాలి.
Read also: Lucky Dreams: మీ కలలో ఆ స్త్రీ కనిపిస్తే.. నోట్ల వర్షం కురవడం పక్కా!
పీఎం ట్రాక్టర్ పథకానికి దరఖాస్తు చేసుకునే రైతు కుటుంబ వార్షికాదాయం రూ.1.50 లక్షలకు మించకూడదు. దరఖాస్తు చేసుకున్న రైతు అర్హులైతే సగం రేటుకు ట్రాక్టర్ కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ట్రాక్టర్ ధరలో సగం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తోంది. మిగిలిన సగం మొత్తాన్ని బ్యాంకులు రైతులకు రుణంగా ఇస్తాయి. ట్రాక్టర్ కొనుగోలు చేసేందుకు రైతుకు రుణం ఇచ్చే బ్యాంకుకు కేంద్రం ఈ సబ్సిడీని బదిలీ చేస్తుంది. ఉదాహరణకు.. ట్రాక్టర్ ధర రూ. 8 లక్షలు అనుకుందాం. అందులో కేంద్రం రూ. 4 లక్షలు భరిస్తుంది. మరో రూ. 4 లక్షలు బ్యాంకు రైతుకు రుణంగా ఇస్తుంది. రైతు ట్రాక్టర్ కొన్న తర్వాత.. రూ.లక్ష అప్పు తీసుకున్నాడు. 4 లక్షలు వాయిదా పద్ధతిలో (EMI) తిరిగి చెల్లించడానికి సరిపోతుంది. గత 7 ఏళ్లలో ట్రాక్టర్ కొనుగోలు చేయని వారు ఈ పథకం కింద మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం కింద ఒక రైతు ఒక ట్రాక్టర్ మాత్రమే కొనుగోలు చేయవచ్చు. రైతు తనకు నచ్చిన ట్రాక్టర్ను తనకు నచ్చిన ధరకు, తనకు నచ్చిన కంపెనీకి కొనుగోలు చేసే అవకాశం ఉంది. తన సాగు అవసరాలకు అనుగుణంగా ఏ ట్రాక్టర్ కొనుగోలు చేయాలనేది పూర్తిగా రైతుపైనే ఆధారపడి ఉంటుంది.
Read also: Kamal Rajini: ఒరిజినల్ గ్యాంగ్ స్టర్స్ సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు…
దరఖాస్తు ఇలా చేయండి..
* PM ట్రాక్టర్ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే రైతులు తప్పనిసరిగా ఈ పత్రాలను సమర్పించాలి.
* ఆధార్ కార్డు చెల్లుబాటు అయ్యేలా ఉండాలి.
* పాన్ కార్డ్/ఓటర్ ఐడి/డ్రైవింగ్ లైసెన్స్/పాస్పోర్ట్ (వీటిలో ఏదైనా), పొలానికి సంబంధించిన అడంగల్ పత్రాలు, బ్యాంక్ ఖాతా వివరాలు, ఆదాయ ధృవీకరణ పత్రం, తాజా పాస్పోర్ట్ సైజు ఫోటో.
* ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
* కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రాంతాల్లో ఆఫ్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవడానికి అనుమతిస్తున్నాయి.
* తెలంగాణలో, మీరు సాధారణ సేవా కేంద్రాలలో (మీసేవా కేంద్రాలు) దరఖాస్తు చేసుకోవచ్చు.
* ఆంధ్రప్రదేశ్లో, రైతు వివరాలను పొందడానికి అతను ఉన్న గ్రామ సచివాలయం లేదా రైతు భరోసా కేంద్రాల అధికారులను సంప్రదించవచ్చు.
* కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ వెబ్సైట్ https://pmkisan.gov.in/లో ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు.
* ఇందుకోసం మొదటి లాగిన్ ఐడీని క్రియేట్ చేసుకోవాలి.
* లాగిన్ అయిన తర్వాత.. అప్లికేషన్ విండో ఓపెన్ అవుతుంది.
* ఏవైనా సందేహాలుంటే.. పీఎం కిసాన్ వెబ్సైట్లో రైతుల కోసం హెల్ప్లైన్ నంబర్ ఉంది.
* మీరు 155261 / 011-24300606 నంబర్లకు కాల్ చేసి ప్రశ్నలు అడగవచ్చు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని మరో అడుగు ముందుకేసి వినూత్నంగా అమలు చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం..యంత్రలక్ష్మి పేరుతో అమలు చేస్తూ.. ట్రాక్టర్ సహా వ్యవసాయ పరికరాలను కూడా అందజేస్తోంది. మరోవైపు ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ యంత్రసేవను అమలు చేస్తోంది. ఈ పథకం కోసం 155251 టోల్ ఫ్రీ నంబర్ కూడా అందుబాటులో ఉంది. మీసేవా కేంద్రాల్లోనూ దీన్ని దరఖాస్తు చేసుకోవచ్చు.
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ క్రేజ్.. భారీగా పెరిగిన ఇ-కామర్స్ కంపెనీల ఆర్డర్స్
తాజావార్తలు
-
Chhatta Bazaar Arch Collapse : హైదరాబాద్లో భారీ వర్షాల ఎఫెక్ట్.. పాతబస్తీలో కూలిన చారిత్రక కమాన్.!
-
AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
-
Dubai Road Accident: దుబాయిలో ఘోర రోడ్డు ప్రమాదం.. జగిత్యాలకు చెందిన ముగ్గురు దుర్మరణం
-
Kitchen Hacks: వంట పనిని సగం తగ్గించే కిచెన్ టిప్స్ .. బిగినర్స్ కోసం స్పెషల్ గైడ్!
-
CM Revanth Reddy : మహిళల చేతుల్లోనే తెలంగాణ ప్రగతి
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!