Morbi Bridge Collapse: వంతెన కూలిన ఘటనపై విచారణ కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Petition in Supreme Court on Gujarat bridge collapse incident: గుజరాత్ లోని మోర్బీ వంతెన కూలిన ఘటనపై యావత్ దేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మచ్చు నదీ అందాలను తిలకించేందుకు వెళ్లిన చాలా మంది మరణించారు. సామర్థ్యాన్ని మించి పెద్ద ఎత్తున జనాలు తీగల వంతెనపైకి చేరుకోవడంతో వంతెన కుప్పకూలింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 141 మంది మరణించారు. దీపావళి హాలీడేస్, వీకెండ్ కావడంతో ఆదివారం సాయంత్ర పెద్ద ఎత్తున జనాలు ఈ బ్రిడ్జ్ వద్దకు వెళ్లారు. మరమ్మతులు చేసి తిరిగి ప్రారంభించిన ఐదు రోజులకే బ్రిడ్జ్ కూలింది.
Read Also: Sound Of Earth’s Magnetic Field: భూ అయస్కాంత క్షేత్ర శబ్ధాలు విన్నారా..? ఎంత భయంకరంగా ఉందో వినండి..
Also Read
ఈ ఘటనపై గుజరాత్ ప్రభుత్వం 9 మందిని అరెస్ట్ చేసింది. విచారణ కోసం సిట్ ఏర్పాటు చేసింది. ఇప్పటికీ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు( మంగళవారం) మోర్బీ ఘటన స్థలాన్ని సందర్శించనున్నారు. బాధితులను పరామర్శించనున్నారు. ఇప్పటికే ఈ ఘటనలో మరణించిన వారికి రూ.2 లక్షలు, గాయపడిని వారికి రూ.50,000 చొప్పున పరిహారాన్ని ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ. గుజరాత్ ప్రభుత్వం కూడా మరణించిన వారికి రూ. 4 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 పరిహారాన్ని ప్రకటించింది.
ఇదిలా ఉంటే మోర్బీ వంతెన కూలిన ఘటన సుప్రీం కోర్టుకు చేరింది. ఈ ప్రమాదంపై రిటైర్డ్ జడ్జితో తక్షణమే జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. పర్యావరణ సాధ్యత, భద్రతను నిర్దారించేందుకు పాత వంతెనలను, స్మారక కట్టడాలను సర్వే, రిస్క్ అసెస్మెంట్ కోసం కమిటీని ఏర్పాటు చేయాడానికి రాష్ట్రప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు.
తాజావార్తలు
-
Kiss Car: బాయ్ ఫ్రెండ్ కారుకు 3,400 ముద్దులు.. ప్రియుడికి పోలీసులు షాక్
-
CM Revanth Reddy : మూసీ ప్రాజెక్ట్పై రేవంత్ స్పీడ్.. అధికారులకు కీలక ఆదేశాలు..
-
Rafale vs J-16: రఫేల్తో చైనీస్ J-16 పోరాటం.. నిశితంగా గమనిస్తున్న భారత్..
-
Nara Lokesh: రెన్యూవబుల్ ఎనర్జీలో ఏపీకి నంబర్-1 టార్గెట్.. నారా లోకేష్ కీలక ప్రకటన!
-
PM Modi: ప్రధాని మోడీ పేరుతో సూరత్లో చేపల మార్కెట్.. గుజరాత్లో కొత్త వివాదం
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!