Morbi Bridge Collapse: వంతెన కూలిన ఘటనపై విచారణ కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Petition in Supreme Court on Gujarat bridge collapse incident: గుజరాత్ లోని మోర్బీ వంతెన కూలిన ఘటనపై యావత్ దేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మచ్చు నదీ అందాలను తిలకించేందుకు వెళ్లిన చాలా మంది మరణించారు. సామర్థ్యాన్ని మించి పెద్ద ఎత్తున జనాలు తీగల వంతెనపైకి చేరుకోవడంతో వంతెన కుప్పకూలింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 141 మంది మరణించారు. దీపావళి హాలీడేస్, వీకెండ్ కావడంతో ఆదివారం సాయంత్ర పెద్ద ఎత్తున జనాలు ఈ బ్రిడ్జ్ వద్దకు వెళ్లారు. మరమ్మతులు చేసి తిరిగి ప్రారంభించిన ఐదు రోజులకే బ్రిడ్జ్ కూలింది.
Read Also: Sound Of Earth’s Magnetic Field: భూ అయస్కాంత క్షేత్ర శబ్ధాలు విన్నారా..? ఎంత భయంకరంగా ఉందో వినండి..
Also Read
ఈ ఘటనపై గుజరాత్ ప్రభుత్వం 9 మందిని అరెస్ట్ చేసింది. విచారణ కోసం సిట్ ఏర్పాటు చేసింది. ఇప్పటికీ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు( మంగళవారం) మోర్బీ ఘటన స్థలాన్ని సందర్శించనున్నారు. బాధితులను పరామర్శించనున్నారు. ఇప్పటికే ఈ ఘటనలో మరణించిన వారికి రూ.2 లక్షలు, గాయపడిని వారికి రూ.50,000 చొప్పున పరిహారాన్ని ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ. గుజరాత్ ప్రభుత్వం కూడా మరణించిన వారికి రూ. 4 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 పరిహారాన్ని ప్రకటించింది.
ఇదిలా ఉంటే మోర్బీ వంతెన కూలిన ఘటన సుప్రీం కోర్టుకు చేరింది. ఈ ప్రమాదంపై రిటైర్డ్ జడ్జితో తక్షణమే జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. పర్యావరణ సాధ్యత, భద్రతను నిర్దారించేందుకు పాత వంతెనలను, స్మారక కట్టడాలను సర్వే, రిస్క్ అసెస్మెంట్ కోసం కమిటీని ఏర్పాటు చేయాడానికి రాష్ట్రప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు.
తాజావార్తలు
-
Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
-
Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
-
YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
-
CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!