Morbi Bridge Collapse: వంతెన కూలిన ఘటనపై విచారణ కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
Petition in Supreme Court on Gujarat bridge collapse incident: గుజరాత్ లోని మోర్బీ వంతెన కూలిన ఘటనపై యావత్ దేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మచ్చు నదీ అందాలను తిలకించేందుకు వెళ్లిన చాలా మంది మరణించారు. సామర్థ్యాన్ని మించి పెద్ద ఎత్తున జనాలు తీగల వంతెనపైకి చేరుకోవడంతో వంతెన కుప్పకూలింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 141 మంది మరణించారు. దీపావళి హాలీడేస్, వీకెండ్ కావడంతో ఆదివారం సాయంత్ర పెద్ద ఎత్తున జనాలు ఈ బ్రిడ్జ్ వద్దకు వెళ్లారు. మరమ్మతులు చేసి తిరిగి ప్రారంభించిన ఐదు రోజులకే బ్రిడ్జ్ కూలింది.
Read Also: Sound Of Earth’s Magnetic Field: భూ అయస్కాంత క్షేత్ర శబ్ధాలు విన్నారా..? ఎంత భయంకరంగా ఉందో వినండి..
Also Read
ఈ ఘటనపై గుజరాత్ ప్రభుత్వం 9 మందిని అరెస్ట్ చేసింది. విచారణ కోసం సిట్ ఏర్పాటు చేసింది. ఇప్పటికీ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు( మంగళవారం) మోర్బీ ఘటన స్థలాన్ని సందర్శించనున్నారు. బాధితులను పరామర్శించనున్నారు. ఇప్పటికే ఈ ఘటనలో మరణించిన వారికి రూ.2 లక్షలు, గాయపడిని వారికి రూ.50,000 చొప్పున పరిహారాన్ని ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ. గుజరాత్ ప్రభుత్వం కూడా మరణించిన వారికి రూ. 4 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 పరిహారాన్ని ప్రకటించింది.
ఇదిలా ఉంటే మోర్బీ వంతెన కూలిన ఘటన సుప్రీం కోర్టుకు చేరింది. ఈ ప్రమాదంపై రిటైర్డ్ జడ్జితో తక్షణమే జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. పర్యావరణ సాధ్యత, భద్రతను నిర్దారించేందుకు పాత వంతెనలను, స్మారక కట్టడాలను సర్వే, రిస్క్ అసెస్మెంట్ కోసం కమిటీని ఏర్పాటు చేయాడానికి రాష్ట్రప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో