TheTigers Attacked: ఒడిస్సాలో కలకలం సృష్టిస్తున్న పులులు.. భయాందోళనలో ప్రజలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Odisha: కొద్ది నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ లోని చింతూరు జిల్లా తిరుమలలో చిరుతలు బీభత్సం సృష్టించిన విషయం అందరికి సుపరిచితమే.. అప్పుడు తిరుమలకు కాలినడకన వెళ్లేందుకు ప్రజలు చాల భయపడ్డారు. అయితే ప్రభుత్వం చర్యలను తీసుకుని చిరుతల బెడదను తొలిగించింది. కాగా ప్రస్తుతం ఒడిస్సా రాష్ట్రంలో పులులు కలకలం సుష్టిస్తున్నాయి. దీనితో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. వివరాలలోకి వెళ్తే.. శనివారం ఒడిస్సా రాష్ట్రం లోని నువాపాడ జిల్లా సదర్ రేంజ్, ధరంబంధ పోలీస్ స్టేషన్, సిలారిబహరా గ్రామం లో దారుణం చోటు చేసుకుంది. శనివారం నువాపాడ జిల్లా లోని సిలారిబహరా గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యురాలు రామేశ్వరి మాఝీ(50) పైన పులి దాడి చేసింది. ఈ దాడిలో ఆమె మరణించగా అనంతరం ఆమె మృతదేహాన్ని పులి తినేసింది.
Read also:Anam Venkata Ramana Reddy: పేదలెవరో, పెత్తందార్లు ఎవరో జగనే చెప్పాలి..
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు పులిని పట్టుకున్నారు. ఈ ఘటన జరిగి 24 గంటలు గడవకముందే ఆదివారం మరో పులి మళ్లీ భీభత్సం సృష్టించింది. ధర్మబంధ పోలీస్ స్టేషన్ పరిధి లోని కోడోపాలి గ్రామంలో ఓ చిన్నారిపై పులి దాడి చేసింది. కాగా ఆ పులి భారీ నుండి గ్రామస్థులు చిన్నారిని రక్షించారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో నువాపా జిల్లా జనరల్ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ నేపథ్యంలో ధర్మబంధ పోలీస్ స్టేషన్ పరిధి లోని కోడోపాలి గ్రామ సమీపంలో పులి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు గుర్తించారు. దీంతో వారు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారులు కోడోపలికి చేరుకుని పులి సంచారాన్ని పర్యవేక్షిస్తున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?