Governor Ananda Bose: బెంగాల్లో అల్లర్లు.. ముర్షిదాబాద్లో గవర్నర్ సీవీ ఆనంద్ క్షేత్ర స్థాయి పర్యటన
- వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్లో అల్లర్లు..
- నేటి నుంచి బెంగాల్లో పర్యటించనున్న రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద్..
- సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఈ అల్లర్లు జరిగాయి: గవర్నర్ ఆనంద్
Governor Ananda Bose: పశ్చిమ బెంగాల్ లో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. గత వారం రోజులుగా పెద్ద ఎత్తున చేపట్టిన నిరసనలతో ఇప్పటి వరకూ పలువురు మృతి చెందారు. ముస్లిం జనాభా అధికంగా ఉండే ముర్షీదాబాద్ జిల్లాలో ఇప్పటి వరకూ 118 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అల్లర్లపై రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద్ స్పందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హిందువులపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Read Also: OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు లిస్ట్ ఇదే
Also Read
- High Voltage Drama: ప్రియుడిపై ప్రేమ.. టవర్పై డ్రామా! సినిమాను మించిన సీన్ చూపించిన మైనర్ బాలిక..
- Judge Suicide: ఢిల్లీలో న్యాయమూర్తి ఆత్మహత్య.. బాత్రూంలో మృతదేహం..
- Central Govt: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. బీమా రంగంలోనే సంచలనం..
- Nashik TCS Case: టీసీఎస్ నాసిక్ నిందితురాలు నిదా ఖాన్కు షాక్..
ఇక, హింసాకాండ చెలరేగిన ముర్షిదాబాద్లో ఈ రోజు ( ఏప్రిల్ 18న ) నుంచి రెండో రోజుల పాటు పర్యటించబోతున్నట్లు పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద్ పేర్కొన్నారు. ముర్షిదాబాద్లో శాంతిని నెలకొల్పేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. మమతా బెనర్జీ సర్కార్ లో హిందువులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. కాగా, గవర్నర్ పర్యటనపై సీఎం మమతా బెనర్జీతో సహా రాష్ట్ర నాయకత్వం నుంచి తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి.
Read Also: Top Headlines @9AM: టాప్ న్యూస్!
కాగా, ముర్షిదాబాద్లో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుండటంతో.. కేంద్ర బలగాల మోహరింపును పొడిగించాలని కలకత్తా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే, ఈ కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కి బదిలీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారించింది. ఇక, వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలతో హింస పెరిగిందని వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదికను సమర్పించింది. దీంతో పాటు గుర్తు తెలియని గుంపు ప్రాణాంతక ఆయుధాలతో రాష్ట్ర ప్రజలతో పాటు పోలీసులపై దాడి చేశారని అందులో నివేదికలో వెల్లడించింది.
తాజావార్తలు
-
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!