Maharashtra: స్థానిక ఎన్నికల కోసం ఒక్కటైన పవార్ కుటుంబం.. చేతులు కలిపిన శరద్ పవార్-అజిత్ పవార్
- ఆసక్తిరేపుతోన్న మహారాష్ట్ర రాజకీయాలు
- స్థానిక ఎన్నికల సమయంలో ఒక్కటైన పవార్ కుటుంబాలు
- కలిసి పోటీ చేయాలని శరద్ పవార్-అజిత్ పవార్ నిర్ణయం
- గత వారం ఉద్ధవ్ థాక్రే-రాజ్ థాక్రే కలయిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర స్థానిక ఎన్నికల సమయంలో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. స్థానిక ఎన్నికల కోసం శరద్ పవార్-అజిత్ పవార్ కుటుంబాలు మళ్లీ ఏకమయ్యాయి. ముంబై, పింప్రి-చించ్వాడ్, పూణె సహా మహారాష్ట్ర అంతటా 29 మునిసిపల్ కార్పొరేషన్లకు జనవరి 15న ఎన్నికలు జరగనున్నాయి. జనవరి 16న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇక డిసెంబర్ 30న నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ. ఈ నేపథ్యంలో పింప్రి-చించ్వాడ్లో కలిసి పోటీ చేయాలని శరద్ పవార్-అజిత్ పవార్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇద్దరూ చేతులు కలిపారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ వెల్లడించారు. ఈ కొత్త కూటమికి తన బాబాయ్ శరద్ పవార్ నాయకత్వం వహిస్తారని తెలిపారు.
ఇది కూడా చదవండి: CM Revanth ShakeHands KCR: అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర పరిణామం.. కేసీఆర్కి షేక్హ్యాండ్ ఇచ్చిన సీఎం రేవంత్
Also Read
- India-UK: జూలై 15 నుంచి స్వేచ్ఛా వాణిజ్య అమలు.. ఏవేవి తగ్గనున్నాయంటే..!
- Ghaziabad Jewelry Heist: మందు పార్టీ ఇచ్చి మరీ రూ.4 కోట్లు లేపేశాడు.. ప్రియురాలి కోసం ప్రియుడు వేసిన 'గోల్డెన్' స్కెచ్!
- Akash Deep Wedding: టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఇంట పెళ్లి బాజాలు.. పూర్తి షెడ్యూల్ విడుదల
- Rahul Gandhi: భారత విద్యా వ్యవస్థ పిల్లల్ని అణచివేస్తోంది.. రాహుల్గాంధీ కీలక వ్యాఖ్యలు
మొత్తానికి పవార్ కుటుంబంలో నెలకొన్న విభేదాలు.. తిరిగి స్థానిక ఎన్నికల రూపంలో మళ్లీ కలిపింది. ప్రస్తుతం పింప్రి-చించ్వాడ్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పూణె మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం కలిసి పోటీ చేసే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం పొత్తులపై చర్చలు జరుపుతున్నారు.
ఇది కూడా చదవండి: China-Taiwan: చైనా-తైవాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు.. డ్రాగన్ దళాలు భారీ విన్యాసాలు
ఇదిలా ఉంటే ముంబై మున్సిపల్ ఎన్నికల కోసం శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ థాక్రే ఇప్పటికే ఒక్కటయ్యారు. ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నట్లు గత వారం సంయుక్తంగా ప్రకటించారు. బీఎంసీ మేయర్ పీఠం తమదేనని వెల్లడించారు. ఈ కుటుంబాల కలయిక మహారాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పు తీసుకువస్తుందనే సర్వత్రా ఆసక్తి నెలకొంది.
తాజావార్తలు
-
DA Hike: విద్యుత్ ఉద్యోగులకు సర్కార్ గుడ్న్యూస్..
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Off The Record: సత్యవేడు టీడీపీలో ఆల్ సెట్ అయినట్టేనా..?
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
India-UK: జూలై 15 నుంచి స్వేచ్ఛా వాణిజ్య అమలు.. ఏవేవి తగ్గనున్నాయంటే..!
ట్రెండింగ్
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్తో రోజంతా ఫ్రెష్గా!
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!