Maha Kumbh Mela 2025: ప్రత్యేక రైలుపై రాళ్ల దాడి.. బెంబేలెత్తిపోయిన ప్రయాణికులు
- మహా కుంభమేళాకు వెళ్లే ప్రత్యేక రైలుపై రాళ్ల దాడి
- బెంబేలెత్తిపోయిన ప్రయాణికులు
- సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహా కుంభమేళాకు భక్తులు భారీ ఎత్తున పోటెత్తుతున్నారు. ఇప్పటికే 15 కోట్లకుపైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఇక రోజురోజుకు భక్తులు పెరుగుతున్నారు. ఇదిలా ఉంటే మహా కుంభమేళాకు వెళ్లే ప్రత్యేక రైలుపై ప్రయాణికులు దాడికి పాల్పడ్డారు. దీంతో ప్యాసింజర్స్ భయాందోళనతో బెంబేలెత్తిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: AB De Villiers Re-Entry: అభిమానులకు శుభవార్త.. దక్షిణాఫ్రికా కెప్టెన్గా ఏబీ డివిలియర్స్!
Also Read
- Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
ఉత్తరప్రదేశ్లోని ప్రయోగ్రాజ్లో మహా కుంభమేళ జరుగుతోంది. అయితే యూపీలోని ఝాన్సీ నుంచి ప్రయాగ్రాజ్కు స్పెషల్ ట్రైన్ బయల్దేరింది. హర్పాల్పూర్ స్టేషన్లో ట్రైన్ వచ్చి ఆగింది. అయితే అప్పటికే రిజర్వేషన్ బోగీలన్నీ ప్రయాణికులతో కిక్కిరిపోయింది. డ్రోర్లు తీసేందుకు కూడా చోటులేదు. అంతగా ప్యాసింజర్స్తో ట్రైన్ నిండిపోయింది. అయితే స్టేషన్లో ఉన్న ప్రయాణికులు మాత్రం ఎక్కేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో రిజర్వేషన్ చేయించుకున్న వాళ్లంతా ఆగ్రహంతో రగిలిపోయారు. అంతే రాళ్లు తీసుకొచ్చి డోర్ అద్దాలు ధ్వంసం చేసి నానా బీభీత్సం సృష్టించారు. ఈ పరిణామంతో ట్రైన్ లోపల ఉన్న ప్రయాణికులు హడలెత్తిపోయారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై ఆందోళనకారులను శాంతింపజేశారు. కొన్ని నిమిషాల్లోనే పరిస్థితుల్ని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ప్రయాణికులంతా సమన్వయం చేసుకుంటూ ప్రయాణాలు సాగించాలని పోలీసులు సూచించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Meerpet Murder Case: కాసేపట్లో మీడియా ముందుకు కిల్లర్ భర్త..
భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు పరస్పరం సమన్వయం చేసుకోవాలని రైల్వేశాఖ విజ్ఞప్తి చేసింది. డిమాండ్కు అనుగుణంగా ప్రత్యేక సర్వీసులతో సహా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వేశాఖ తెలిపింది.
Vandalism and stone pelting in #Mahakumbh Special train going from Jhansi to Prayagraj. Live video surfaced. The reason for this is not known yet. pic.twitter.com/gXvrcadTxf
— Siraj Noorani (@sirajnoorani) January 28, 2025
తాజావార్తలు
-
Arjun Tendulkar: అచ్చు తండ్రి మాదిరే.. అర్జున్ టెండూల్కర్ గొప్ప మనసు.. వీడియో వైరల్!
-
SPR India: వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వ్ అంటే ఏమిటి? చమురు సంక్షోభంలో జాతీయ భద్రతా కవచంగా ఎలా ఉపయోగపడుతుంది?
-
Janhvi Kapoor : క్రేజీ ఛాన్స్ కొట్టేసిన జాన్వీ… “తుంబాడ్” డైరెక్టర్ తో హార్రర్ మూవీ
-
Bharathiraja Passed Away : తమిళ సినీ దిగ్గజం అస్తమయం.. దర్శకుడు భారతీరాజా కన్నుమూత
-
Steel Plant Accident : ఇవాళ విశాఖకు వైఎస్ జగన్.. షెడ్యూల్ ఇలా..!
ట్రెండింగ్
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?