AB De Villiers Re-Entry: అభిమానులకు శుభవార్త.. దక్షిణాఫ్రికా కెప్టెన్గా ఏబీ డివిలియర్స్!
- క్రికెట్ అభిమానులకు శుభవార్త
- బ్యాట్ పట్టేందుకు సిద్దమైన ఏబీ డివిలియర్స్
- జిమ్, నెట్స్ ప్రాక్టీస్ చేస్తున్న ఏబీడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రికెట్ అభిమానులకు శుభవార్త. దక్షిణాఫ్రికా దిగ్గజ ఆటగాడు, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ నాలుగు సంవత్సరాల తర్వాత బ్యాట్ పట్టేందుకు సిద్దమయ్యాడు. వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్) టోర్నీలో తాను బరిలో దిగనున్నట్లు ఏబీడీ స్వయంగా ప్రకటించాడు. అంతేకాదు డబ్ల్యూసీఎల్లో దక్షిణాఫ్రికా జట్టుకు కెప్టెన్గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్లు తెలిపాడు. డబ్ల్యూసీఎల్ రెండవ ఎడిషన్లో గేమ్ ఛేంజర్స్ సౌతాఫ్రికా ఛాంపియన్స్కు ఏబీడీ నాయకత్వం వహిస్తాడు. తాను మైదానంలోకి బరిలోకి దిగుతున్నట్లు మిస్టర్ 360 ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు సంతోషపడిపోతున్నారు.
‘ఇకపై ఆడాలనే కోరిక లేకపోవడంతో నాలుగు సంవత్సరాల క్రితం నేను క్రికెట్ నుండి రిటైర్ అయ్యాను. సమయం గడిచింది. ఇప్పుడు నా కుమారులు ఆడడం ప్రారంభించారు. మేము గార్డెన్లో తరచుగా ఆడుతున్నాము. నా పిల్లలు మళ్లీ క్రికెట్ ఆడేలా ప్రేరేపించారు. అందుకే నేను జిమ్, నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్నా. జూలైలో జరిగే డబ్ల్యూసీఎల్ కోసం నేను సిద్ధంగా ఉన్నాను’ అని ఏబీ డివిలియర్స్ తెలిపాడు. గేమ్ ఛేంజర్స్ సౌతాఫ్రికా ఛాంపియన్స్ వ్యవస్థాపకుడు అమన్దీప్ సింగ్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. కెప్టెన్గా ఏబీ డివిలియర్స్ తిరిగి రావడం జట్టులో ఉత్సాహం నెలకొందని, జట్టు కచ్చితంగా ఉత్తమ ప్రదర్శన చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read
- Pakistan: ‘‘అసిమ్ మునీర్ కండోమ్లు పంచుతాడా.?’’ పాక్ ఆర్మీ చీఫ్ కొత్త బాధ్యతలపై సెటైర్లు..
- Iran War: ట్రంప్ వార్నింగ్తో ఉద్రిక్తతలు.. అమెరికాతో చర్చలకు నో చెప్పిన ఇరాన్
- Perni Nani: చంద్రబాబుకు రాజకీయ నీతి గురించి మాట్లాడే అర్హత లేదు.. సీఎంపై పేర్ని నాని ఫైర్..
- Bihar: షాకింగ్ నిర్ణయం.. బంకీపూర్ అభ్యర్థిని మార్చేసిన బీజేపీ.. కారణమిదేనా?
ఏబీ డివిలియర్స్ దక్షిణాఫ్రికా తరఫున 2004లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. కెరీర్లో 114 టెస్టు మ్యాచ్లలో 8765 పరుగులు, 228 వన్డేల్లో 9577 రన్స్, 78 టీ20 మ్యాచ్లలో 1672 పరుగులు చేశాడు. ఏబీడీ 22 టెస్టు సెంచరీలు, 25 వన్డే సెంచరీలు చేశాడు. కుటుంబంతో కలిసి సమయం గడిపేందుకు 2021లో అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు మరలా టీ20 టోర్నీ ఆడేందుకు సిద్దమయ్యాడు. డబ్ల్యూసీఎల్ ఒక ప్రీమియర్ టీ20 టోర్నమెంట్. ఇందులో రిటైర్ అయిన, నాన్ కాంట్రాక్ట్ క్రికెట్ దిగ్గజాలు ఆడతారు. మొదటి ఎడిషన్లో భారత్ చాంపియన్గా నిలిచింది.
తాజావార్తలు
-
Pakistan: ‘‘అసిమ్ మునీర్ కండోమ్లు పంచుతాడా.?’’ పాక్ ఆర్మీ చీఫ్ కొత్త బాధ్యతలపై సెటైర్లు..
-
Vietnam Boat Accident: వియత్నాం బోటు ప్రమాదం.. తెలంగాణ అలర్ట్.!
-
Lucky Plants: ధనలక్ష్మిని ఇంట్లోకి లాగేసే ‘లక్కీ ప్లాంట్స్’.. మీ తలరాత మారిపోవడం ఖాయం అంట!
-
Iran War: ట్రంప్ వార్నింగ్తో ఉద్రిక్తతలు.. అమెరికాతో చర్చలకు నో చెప్పిన ఇరాన్
-
Perni Nani: చంద్రబాబుకు రాజకీయ నీతి గురించి మాట్లాడే అర్హత లేదు.. సీఎంపై పేర్ని నాని ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!