Union Budget 2025: నిర్మలమ్మ బడ్జెట్లో ఈ రాష్ట్రాలకు తాయిలాలు ఉండే ఛాన్స్!
- శుక్రవారం నుంచే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
- ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్
- ఈ రాష్ట్రాలకు తాయిలాలు ఉండే ఛాన్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో శుక్రవారం ఉదయం 11 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. ఇక ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇక బడ్జెట్పై అన్ని రాష్ట్రాలు గంపెడాశలు పెట్టుకున్నాయి. ఆయా రాష్ట్రాలు నిర్మలమ్మ బడ్జెట్ కోసం ఎదురుచూస్తున్నాయి. అలాగే ధరల తగ్గింపుపై ఏమైనా శుభవార్త అందుతుందేమోనని సామాన్య ప్రజలు కూడా ఎదురుచూస్తున్నారు. ఇలా అన్ని రకాల ప్రజలు బడ్జెట్ కోసం నిరీక్షిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Monalisa Kumbh: బాలీవుడ్ సినిమా సైన్ చేసిన తేనెకళ్ల మోనాలిసా
Also Read
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
- Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
- PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
ఇదిలా ఉంటే ప్రస్తుతం కేంద్రంలో బీహార్కు చెందిన జేడీయూ, ఏపీకి చెందిన తెలుగుదేశం పార్టీల మద్దతుతో మోడీ ప్రభుత్వం నడుస్తోంది. ఎన్డీఏ కూటమిలో భాగంగా ఈ రెండు రాష్ట్రాలు… నిర్మలమ్మ బడ్జెట్పై చాలా ఆశలు పెట్టుకున్నాయి. పైగా ఈ ఏడాది అక్టోబర్లో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికలు ఎన్డీఏ కూటమికి చాలా కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో తాజా బడ్జెట్లో బీహార్పై వరాల జల్లు కురిపించొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. బీహార్కు అత్యధికంగా తాయిలాలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోసారి బీహార్లో ఎన్డీఏ కూటమి పాగా వేయాలని చూస్తోంది. దీంతో బడ్జెట్లో అధిక ప్రాధాన్యత బీహార్కు ఉండే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. అలాగే మరో మిత్రపక్షం ఏపీలో ఉన్న టీడీపీకి కూడా తాయిలాలు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఏపీ, బీహార్కు నిర్మలమ్మ వరాలు కురిపించే ఛాన్సుందని వార్తలు వినిపిస్తున్నాయి. నిర్మలమ్మ బడ్జెట్ ఎలా ఉండబోతుందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.
ఇది కూడా చదవండి: Maha Kumbh Mela: ఇలాంటి గర్ల్ఫ్రెండ్ ఉండాలి.. ఆమె ఐడియాతో “కుంభమేళా”లో డబ్బులు సంపాదిస్తున్న యువకుడు..
ఇదిలా ఉంటే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జరుగుతున్నాయి. మొదటి సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరుగుతుండగా.. రెండో విడత మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి. అయితే ఈ సమావేశాల్లో దాదాపు 16 బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. వక్ఫ్ బోర్డు సవరణ చట్టంతో సహా 16 బిల్లులు బడ్జెట్ సెషన్లో ప్రవేశపెట్టనన్నారు. ఇక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ను ఎనిమిదో సారి శనివారం సమర్పించనున్నారు.
అయితే ఈ సమావేశాలు కూడా వాడీవేడిగా జరగనున్నట్లు తెలుస్తోంది. గత శీతాకాల సమావేశాలు హాట్హాట్గా సాగాయి. అదానీ లంచాల వ్యవహారంతో ఉభయ సభలు అట్టుడికాయి. ఈ బడ్జెట్ సమావేశాలు కూడా అదే మాదిరిగా ఉండనున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Gopisundar: గోపీసుందర్ ఇంట తీవ్ర విషాదం
తాజావార్తలు
-
KTR : బండి భగీరథ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
-
Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
-
Epstein: ఎప్స్టీన్ కేసులో సంచలనం.. వెలుగులోకి కొత్త బాధితులు..
-
Stock Market: భారత స్టాక్ మార్కెట్ నుంచి భారీగా విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ.. కారణం ఇదే..
-
Jet Lee OTT Release: సడన్ సర్ప్రైజ్.. ‘జెట్ లీ’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..