Maha Kumbh Mela: ఇలాంటి గర్ల్ఫ్రెండ్ ఉండాలి.. ఆమె ఐడియాతో “కుంభమేళా”లో డబ్బులు సంపాదిస్తున్న యువకుడు..
- గర్ల్ఫ్రెండ్ ఐడియాతో వేలు సంపాదిస్తున్న యువకుడు..
- మహా కుంభమేళాని ఆదాయంగా మార్చుకున్నాడు..
- వేపపుల్లలు అమ్ముతున్న యువకుడు వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maha Kumbh Mela: ‘‘ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది’’ అనే కొటేషన్ చాలా మందికి సుపరిచితమే. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న ‘‘మహా కుంభమేళా’’ని ఓ యువకుడు తన ఆదాయ మార్గంగా ఎంచుకున్నాడు. కోట్ల సంఖ్యలో హాజరయ్యే భక్తులకు ‘‘వేప పుల్లలు’’ అమ్ముతూ వేలు సంపాదిస్తున్నాడు. భక్తులు తమ దంతాలను శుభ్రపరుచుకోవడానికి సదరు యువకుడి వద్ద నుంచి పుల్లలను కొనుగోలు చేస్తున్నారు. వారం వ్యవధిలోనే తాను రూ. 40,000 సంపాదించినట్లు చెప్పాడు.
Read Also: Union Budget 2025: భారత బడ్జెట్ చరిత్రలో “అతిపెద్ద”, “అతిచిన్న” బడ్జెట్ ప్రసంగాలు ఇవే..
Also Read
- Delhi-NCR Heavy Rain: ఢిల్లీని ముంచెత్తిన వాన.. జనజీవనం అస్తవ్యస్తం.. విమానాలు దారి మళ్లింపు
- Beggar Woman’s Surprising Savings: జీవితాంతం వీధుల్లో భిక్షాటన చేసిన మహిళ.. మరణానంతరం బయటపడ్డ రూ.8.40 లక్షలు!
- Jammu Kashmir: 23 మంది కశ్మీరీ పండిట్ల హత్యాకాండ.. 28 ఏళ్ల క్రితం నాటి ఊచకోత కేసు పునర్ విచారణ
- Tamil Nadu CM Vijay: ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న సీఎం విజయ్.. అన్నపూర్ణ సూపర్-6 ప్రకటన
ఈ ఆలోచన తన ‘‘గర్ల్ఫ్రెండ్’’ ఇచ్చిందని నవ్వుతూ సమాధానం చెబుతున్నాడు. తాను డబ్బు సంపాదించేందుకు కుంభమేళాకి వచ్చానని చెప్పాడు. ప్రస్తుతం ఇతడి వ్యాపారానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తాను ఇప్పటి వరకు రూ. 40,000 సంపాదించానని చెప్పారు. పెట్టుబడి అవసరం లేని వ్యాపారంలో వేపపుల్లల్ని అమ్మాలని తన స్నేహితురాలు చెప్పిందని, ఆమె కారణంగా చాలా సంపాదించానని చెప్పారు.
సోషల్ మీడియాలో నెటిజన్లు సదరు యువకుడి నిజాయతీ, అతడి ప్రేమను అభినందిస్తున్నారు. ఇంతమంచి అమ్మాయిని వదులుకోవద్దని, ఆమెను మోసం చేయవద్దని చాలా మంది నెటిజన్లు సూచించారు. ప్రతీ విజయం వెనక, ఒక స్త్రీ ఉంటుందని, తన స్నేహితురాలికి క్రెడిట్ ఇవ్వడం బాగుందని అభినందించారు. ప్రపంచంలోనే అతిపెద్ద మానవసమాగమంగా ‘‘కుంభమేళ’’ ప్రసిద్ధి చెందింది. జనవరి 13 నుంచి ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ఫిబ్రవరి 26 వరకు కొనసాగుంది. మొత్తం 45 కోట్ల మంది భక్తులు వస్తారని యూపీ సర్కార్ అంచనా వేసింది. ఇప్పటి వరకు త్రివేణి సంగమంలో 27 కోట్ల మంది పవిత్ర స్నానాలు ఆచరించారు.
తాజావార్తలు
-
CM Chandrababu: రైతులు ఫుడ్ ప్రాసెసింగ్లోకి రావాలి.. వ్యవసాయాన్ని ఆర్థిక శక్తిగా మార్చాలి!
-
Anasuya: హిందూ ఆచారాలపై అనసూయ సంచలన వ్యాఖ్యలు.. అసలు స్కెచ్ ఇదేనా!
-
Tollywood Wedding: సైలెంట్గా న్యూజిలాండ్లో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యాక్టర్.. తన రియల్ హీరోయిన్తో ఫోటోలు వైరల్!
-
Delhi-NCR Heavy Rain: ఢిల్లీని ముంచెత్తిన వాన.. జనజీవనం అస్తవ్యస్తం.. విమానాలు దారి మళ్లింపు
-
Kriti Sanon: రాఖీ కట్టడానికి ఇలాంటి బట్టలే దొరికాయా?.. కృతి సనన్ లుక్పై నెటిజన్ల ఫైర్!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!