Golden Temple: గోల్డెన్ టెంపుల్ని టార్గెట్ చేసిన పాక్.. భారత్ ఆర్మీ ఎలా రక్షించిందంటే..?
- ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ పై భారత్ ప్రతీకారం తీర్చుకుంది..
- అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంపై దాడికి పాకిస్తాన్ ప్రయత్నం..
- పాక్ డ్రోన్లు, మిస్సైల్స్తో దాడి చేయగా.. తిప్పికొట్టిన భారత గగనతల రక్షణ వ్యవస్థ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Golden Temple: పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్పై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మే 7వ తేదీన పాక్లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలను మిస్సైళ్లతో ధ్వంసం చేసింది. అయితే, ఆ తర్వాత పాక్ పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లో గల స్వర్ణ దేవాలయాన్ని టార్గెట్గా చేసుకుని డ్రోన్లు, మిస్సైల్స్ తో దాడికి ప్రయత్నించింది అని GOC మేజర్ జనరల్ కార్తీక్ సి శేషాద్రి ఈ రోజు మీడియాకు తెలిపారు. ఇక, గోల్డెన్ టెంపుల్ ని లక్ష్యంగా చేసుకున్న అన్ని డ్రోన్లు, క్షిపణులను ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు వెల్లడించారు. ఉగ్ర స్థావరాలపై భారత్ జరిపిన దాడులతో ఉక్కిరిబిక్కిరైన పాక్ మన దేశంలోని సైనిక స్థావరాలు, నివాస ప్రాంతాలు, ప్రార్థనా మందిరాలపై దాడి చేసేందుకు ప్లాన్ చేస్తుందని ముందుగానే ఊహించింది భారత సైన్యం. దీంతో స్వర్ణ దేవాలయం పరిసరాల్లో పూర్తిస్థాయి వైమానిక రక్షణ కల్పించినట్లు తెలిపారు.
Read Also: Trivikram Srinivas : ఓజీ సెట్స్ లో త్రివిక్రమ్..?
Also Read
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్బస్టర్!!
- Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
- TMC Rebellion: కోల్కతా టు ఢిల్లీ.. పార్లమెంట్కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
- Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
అలాగే, మే 8వ తేదీన పాకిస్తాన్ మానవ రహిత వైమానిక దాడులు చేపట్టిందని మేజర్ జనరల్ కార్తీక్ సి శేషాద్రి పేర్కొన్నారు. ప్రధానంగా డ్రోన్లు, దీర్ఘ-శ్రేణి క్షిపణులతో దాడులకు పాల్పడినట్లు చెప్పుకొచ్చారు. ఆకాశ్ క్షిపణి వ్యవస్థ, L-70 ఎయిర్ డిఫెన్స్ గన్స్ లాంటి భారత వైమానిక రక్షణ వ్యవస్థలు అమృత్సర్లోని స్వర్ణ దేవాలయాన్ని, పంజాబ్ లోని నగరాలను పాక్ దాడుల నుంచి కాపాడిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆపరేషన్ సింధూర్ తో సాయుధ దళాలు పాక్ లోని అనేక ప్రదేశాలను అత్యంత కచ్చితత్వంతో దాడి చేసి నాశనం చేశారని వెల్లడించారు. ఉగ్రవాద సంస్థల ప్రధాన కార్యాలయాలు ఉన్న మురిద్కే, బహవల్పూర్ వంటి ప్రాంతాలపై దాడి చేసి పూర్తిగా ధ్వంసం చేసినట్లు మేజర్ జనరల్ చెప్పారు.
#WATCH | Amritsar, Punjab: Indian Army shows a demo of how Indian Air Defence systems, including AKASH missile system, L-70 Air Defence Guns, saved the Golden Temple in Amritsar and cities of Punjab from Pakistani missile and drone attacks. pic.twitter.com/yulFvSFqKv
— ANI (@ANI) May 19, 2025
తాజావార్తలు
-
Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Dream Numbers Lottery: కలలో వచ్చిన నంబర్లలే జీవితాన్ని మార్చేశాయి.. కూరగాయలు అమ్మే మహిళకు రూ.2 కోట్ల లాటరీ!
-
AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
-
Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై “సింగం” ఫార్ములా బ్లాక్బస్టర్!!
-
Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!