PAKISTAN: పాకిస్తాన్కు ‘‘ఆపరేషన్ సిందూర్’’ దెబ్బ గట్టిగానే తగిలినట్లుంది. గతేడాది పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ పాకిస్తాన్పై భీకర దాడులు చేసింది. పాక్, పీఓకే ప్రాంతాల్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు నిర్వహించి, వందలాది మంది టెర్రరిస్టుల్ని హతమార్చింది. పాకిస్తాన్ సైన్యం భారత భూభాగాలపై దాడులు చేసేందుకు ప్రయత్నిస్తే, పాక్ వైమానిక దళానికి చెందిన ఎయిర్బేసుల్ని భారత్ ధ్వంసం చేసింది.
Read Also: Boost Iron Levels in Summer: సమ్మర్లో ఐరెన్ స్థాయి పెంచే 7 సూపర్ ఫుడ్స్ మీకోసం..
అయితే, ఇప్పుడు ఆ ఎయిర్ బేసుల్లో పాక్ మరమ్మతులు చేయించుకుంటోంది. కొన్ని ఎయిర్ బేసుల్లో రిపేర్లు సాధ్యమవ్వకపోవడంతో కూల్చివేసుకుంటోంది. నేషనల్ మీడియ కథనం ప్రకారం, ఫిబ్రవరి 28న వెలుగులోకి వచ్చిన శాటిలైట్ ఇమేజ్ పరిశీలిస్తే, భారత దాడుల తీవ్రతకు మురిద్ బేస్లో రిపేర్లు సాధ్యం కాలేదని తెలుస్తోంది. గతంలో దెబ్బతిన్న భవానాన్ని కూల్చేసినట్లు కనిపిస్తోంది. చక్వాల్ సమీపంలో ఉన్న ఈ స్థావరం భారత్ చేసిన దాడిలో దారుణంగా దెబ్బతింది. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్గా భావిస్తున్న భవనాన్ని ఇప్పుడు కూల్చేశారు.
శాటిలైట్ ఇమేజరీ విశ్లేషకుడు డేమియన్ సైమన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. తాజాగా తీసిన శాటిలైట్ చిత్రాల్లో భవనం ఉన్న చోట ఇప్పుడు ఖాళీ నేల, శిథిలాలు మాత్రమే కనిపిస్తున్నా్యని అన్నారు. భవనం అంతర్గతంగా తీవ్రంగా దెబ్బతినడంతో మరమ్మతులు సాధ్యం కాలేదని సూచిస్తోందని చెప్పారు. ఇది పాకిస్తాన్ నిర్వహించే డ్రోన్ దాడులకు కమాండ్ సెంటర్గా పనిచేసేది.