Ayodhya: రామాలయ నిధుల వివాదంలో కొత్త ట్విస్ట్.. PMOకు సైతం లెక్కలు ఇవ్వని రామ్ మందిర్ ట్రస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya: అయోధ్య రామాలయ నిధుల వివాద వ్యవహారంలో తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ప్రక్రియను సాకుగా చూపిస్తూ, ఆలయానికి సంబంధించిన ఎలాంటి ఆర్థిక వివరాలను వెల్లడించడానికి ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్’ నిరాకరించింది. చివరికి ప్రధానమంత్రి కార్యాలయం (PMO) ద్వారా జిల్లా యంత్రాంగానికి అందిన లేఖకు సైతం సమాధానం ఇచ్చేందుకు ట్రస్ట్ నిరాకరించడం గమనార్హం.
అయోధ్యకు చెందిన స్థానిక బీజేపీ నాయకుడు డాక్టర్ రజనీష్ సింగ్.. రామాలయ ట్రస్ట్కు వస్తున్న విరాళాలు, బ్యాంకు ఖాతాలు, భూముల కొనుగోలు, అమ్మకాల్లో భారీ అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఆలయ ట్రస్ట్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని ఆర్థిక లావాదేవీలు, సమకూరిన ఆస్తుల వివరాలను బహిరంగపరచాలని డిమాండ్ చేస్తూ ఆయన జూన్ 9న మొదటిసారి, ఆ తర్వాత జూన్ 12న రెండోసారి పీఎంఓకు ఫిర్యాదులు పంపారు. ఆ మరుసటి రోజే, అంటే జూన్ 13న ఈ వ్యవహారంపై సిట్ (SIT) ఏర్పాటయింది. బీజేపీ నేత చేసిన ఈ ఫిర్యాదును ప్రధానమంత్రి కార్యాలయం తీవ్రంగా పరిగణించి, తదుపరి చర్యల కోసం అయోధ్య జిల్లా పరిపాలన విభాగానికి పంపింది. పీఎంఓ ఆదేశాలతో రంగంలోకి దిగిన జిల్లా యంత్రాంగం.. ఆలయ ఆదాయ-వ్యయాల లెక్కలు అప్పగించాలంటూ రామాలయ ట్రస్ట్ను కోరింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. జూన్ 23న అయోధ్య ఏడీఎం (పరిపాలన) విశు రాజాకు రాసిన ఒక లేఖలో, ఏడీఎం (శాంతిభద్రతలు) ఇంద్రకాంత్ ద్వివేది ఈ విషయాలను ప్రస్తావించారు. పీఎంఓ పంపిన ఫిర్యాదు ఆధారంగా తాము రామాలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ను సంప్రదించి విరాళాల లెక్కలు అడిగామని ఆయన పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం ఈ వ్యవహారంపై సిట్ దర్యాప్తు సాగుతోందని, దర్యాప్తు ప్యానెల్ అన్ని కీలక రికార్డులను సేకరిస్తోందని చెబుతూ చంపత్ రాయ్ వివరాలు ఇవ్వడానికి నిరాకరించినట్లు ఏడీఎం తెలిపారు. విచారణ నడుస్తున్నందున ఇప్పుడు ఎలాంటి సమాచారం ఇవ్వలేమని ట్రస్ట్ స్పష్టం చేసింది.
Also Read
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!