PAKISTAN: పాకిస్తాన్కు ‘‘ఆపరేషన్ సిందూర్’’ దెబ్బ గట్టిగానే తగిలినట్లుంది. గతేడాది పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ పాకిస్తాన్పై భీకర దాడులు చేసింది. పాక్, పీఓకే ప్రాంతాల్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు నిర్వహించి, వందలాది మంది టెర్రరిస్టుల్ని హతమార్చింది. పాకిస్తాన్ సైన్యం భారత భూభాగాలపై దాడులు చేసేందుకు ప్రయత్నిస్తే, పాక్ వైమానిక దళానికి చెందిన ఎయిర్బేసుల్ని భారత్ ధ్వంసం చేసింది.
అసిమ్ మునీర్ భారత్ పై విషం కక్కుతూ పహల్గాం ఉగ్ర ఘటనకు కారణమయ్యాడు. ఆపరేషన్ సింధూర్ తో పాక్ కు భారత సైన్యం గట్టిగా బుద్ధి చెప్పింది. కాగా ఫీల్డ్ మార్షల్గా ఎన్నికైన తర్వాత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఆదివారం ఉన్నత స్థాయి విందు ఏర్పాటు చేశారు. ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ నుంచి అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, బిలావల్ భుట్టో వరకు, రాజకీయ, సైన్యం నుంచి అనేక మంది ఉన్నతాధికారులు విందులో…